Bangladesh: హిందూ మహిళా జర్నలిస్టుపై దాడి.. భారత్ ఎజెంట్ అంటూ ఆరోపణ..
- బంగ్లాదేశ్లో దారుణం..
- హిందూ మహిళా జర్నలిస్టుపై దాడి..
- భారత్ ఏజెంట్ అంటూ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో ప్రముఖ హిందూ మహిళా జర్నలిస్టుపై అక్కడి మతోన్మాదుల మూక దాడికి ప్రయత్నించింది. ప్రముఖ టీవీ జర్నలిస్ట్ మున్సీ సాహా మీడియా కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా, ఢాకాలోని కార్వాన్ బజార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాహా ఒక భారతీయ ఏజెంట్ అని, మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుదారు అని మూక ఆరోపించింది. చివరకు పోలీసులు కలుగజేసుకుని ఆమెని రక్షించాల్సి వచ్చింది. స్థానిక మీడియా నివేదిక ప్రకారం.. జర్నలిస్ట్ కారును గుంపు అడ్డగించి, ఆమెపై దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారు. చుట్టుపక్కల జనాలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆమెను పోలీసులు రక్షించి తేజ్ గావ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఢాకా మెట్రోపాలిటన్ డిటెక్టివ్ బ్రాంచ్ (DB) కార్యాలయాని తరలించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఆమెను అరెస్ట్ చేయలేదని తెల్లవారుజామున విడుదల చేసినట్లు బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. ఆమె తీవ్ర భయాందోళనకు గురైనట్లు వారు తెలిపారు. “పోలీసులు మున్నీ సాహాను అదుపులోకి తీసుకోలేదు. ఆమె కార్యాలయం వెలుపల ఉన్న కవ్రాన్ బజార్ వద్ద కొంతమంది వ్యక్తులు ఆమెను చుట్టుముట్టారు. తరువాత, భద్రతా కారణాల దృష్ట్యా తేజ్గావ్ పోలీసులు ఆమెను DB కార్యాలయానికి తీసుకెళ్లారు” అని ఒక అధికారి వెల్లడించారు.
Also Read
- Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
Read Also: Ram Gopal Varma: రామ్గోపాల్ వర్మ భయపడి పారిపోయాడు: టీడీపీ నేత
సాహా నాలుగు కేసుల్లో నిందితురాలిగా ఉన్నారని, బెయిల్ కోసం కోర్టుకు హాజరుకావాలని, భవిష్యత్తులో పోలీస్ సమన్లను పాటించాలని అధికారులు తెలిపారు. సాహాను వేధించిన వ్యక్తులపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వైరల్గా మారిన ఈ దాడి వీడియోలో..57 మంది ప్రాణాలు బలిగొన్న బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు సంబంధించి ఆమె ప్రజల్ని తప్పుదారి పట్టించిందని ఆరోపించడం వినవచ్చు. మీరు ఈ దేశాన్ని భారత్లో భాగం చేయడానికి చేయగలిగినదంతా చేస్తున్నారు, విద్యార్థుల రక్తం మీ చేతులకు అంటుకుంది అని ఆమెను ఉద్దేశించి ఆరోపించారు. మీరు ఈ దేశ పౌరురాలిగా ఉండీ, ఈ దేశాని ఎలా హాని చేస్తారని..? గుంపు ప్రశ్నించింది.
55 ఏళ్ల జర్నలిస్ట్ బెంగాలీ ఛానెల్ ATN న్యూస్ మాజీ న్యూస్ హెడ్. హసీనా పాలన తర్వాత ఆమెతో పాటు అనేక మంది జర్నలిస్టులపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు మోపబడ్డాయి. ఇటీవల హిందువులపై జరిగిన హింసను సాహా చూపించారు. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందూ వ్యతిరేకత పెరుగుతోంది. ముఖ్యంగా జమాతే ఇస్లామి వంటి మతోన్మాద సంస్థలు హిందువుల్ని టార్గెట్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్లో హిందూ సమాజానికి పెద్ద దిక్కుగా ఉన్న చిన్మోయ్ కృష్ణదాస్ని పోలీసులు దేశద్రోహం కింద అరెస్ట్ చేయడంతో అక్కడి పరిణామాలు ఉద్రిక్తంగా మారాయి.
কারওয়ানবাজার থেকে সাংবাদিক মুন্নী সাহা গ্রেপ্তার |
Munni Saha Arrest | Channel 24 pic.twitter.com/xq7x0HHkzd— Md. Sohel Rana (@mdsohelrana7707) December 1, 2024
తాజావార్తలు
-
Patriot: 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి – మోహన్ లాల్ కలయిక.. ‘పేట్రియాట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
-
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!