Modi-Trump: ట్రంప్కు మోడీ ఎందుకు గుర్తుకొచ్చినట్లు.? వెనక పాకిస్తాన్ కోణం..
- ఇరాన్ యుద్ధానికి 4 వారాలు..
- చాలా రోజుల తర్వాత మోడీకి ట్రంప్ ఫోన్..
- ఫోన్ వెనక పాకిస్తాన్ యాంగిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi-Trump: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమై నాలుగో వారానికి చేరింది. ఇప్పటికీ ఇరాన్పై యూఎస్, ఇజ్రాయిల్ దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇరాన్ ప్రతీకార దాడుల్ని ఆపడం లేదు, ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాలపై అటాక్స్ చేస్తోంది. అయితే, యుద్ధం ప్రారంభమై ఇన్ని రోజులు గడిచిన తర్వాత, మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , భారత ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్ చేశారు. ‘‘హార్ముజ్ జలసంధి’’, ఇరాన్ యుద్ధంపై ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఇన్ని రోజుల తర్వాత ట్రంప్కు మోడీ ఎందుకు గుర్తుకు వచ్చారనేది ఇక్కడ ఆసక్తికరమైన విషయం. అయితే, ఇందులో పాకిస్తాన్ యాంగిల్ ఉందని తెలుస్తోంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్-యూఎస్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. త్వరలోనే ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరుగుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు కోపం రాకుండా అమెరికా జాగ్రత్త పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ను సంతృప్తి పరిచేందుకు ట్రంప్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్, మోడీ చర్చల్లో హార్ముజ్ భద్రత ప్రధానంగా ఉంది. ప్రపంచంలో సుమారుగా 20 శాతం చమురు, గ్యాస్ ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతోంది. యుద్ధం కారణంగా ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే ఇది ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారి తీస్తుంది. భారత్ వంటి పెద్ద దేశాలపై అధిక ప్రభావం ఉంటుంది.
Also Read
- Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు
- NDA Women Cadets: భారత రక్షణ రంగంలో నయా హిస్టరీ.. చరిత్ర సృష్టించిన నారీమణులు! ‘ఎన్డీఏ’ తొలి మహిళా సింహాలు వీరే..
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Modi-Trump Meet: ఫ్రాన్స్లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్హౌజ్..
మరోవైపు, భారత్ ఒక బ్యాలెన్సుడ్ విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుంది. ఒకేసారి అమెరికా-రష్యాలతో, ఇజ్రాయిల్-ఇరాన్తో మాట్లాడగలదు. గల్ఫ్ దేశాలతో భారత్కు సత్సంబంధాలు ఉన్నాయి. భారత్ ఏ ఒక్క పక్షానికి పూర్తిగా మద్దతు ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మధ్య చర్చలు జరిగాయి. అమెరికన్ అధికారులు భారత్ను ‘‘ముఖ్య భాగస్వామి’’గా అభివర్ణించడం గమనార్హం.
ఇక పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేయడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇరాన్తో పాక్కు సరిహద్దు సంబంధం ఉంది. ఇరాన్ తర్వాత షియాలు పాక్లోనే ఎక్కువగా ఉంటారు. ఇరాన్లో ఏం జరిగిన పాక్పై ప్రభావం ఉంటుంది. ఇక పాక్ ఆర్థిక సమస్యలు ఒకెత్తు. ఆయిల్ సంక్షోభం ఆ దేశాన్ని పట్టిపీడిస్తోంది. సౌదీ అరేబియాతో పాక్కు రక్షణ ఒప్పందం ఉంది. ఇరాన్ సౌదీపై దాడి చేస్తున్నా, పాక్ యుద్ధంలోకి దిగలేదు. ఒకవేళ ఇరాన్కు వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగితే పాక్ తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో ఈయుద్ధం త్వరగా ఆగాలని పాక్ భావిస్తోంది.
తాజావార్తలు
-
Thalapathy Vijay : తలపతి బర్త్ డే ట్రీట్ ‘జన నాయగన్’ కాదు… సర్ప్రైజ్ ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
-
OTT Movies : ఓటీటీలో సందడి చేస్తోన్న హిట్ మూవీస్
-
Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు, డబ్బే డబ్బు!
-
Vijay Deverakonda : నాగ చైతన్య ‘దూత’ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ… క్రేజీ కాంబినేషన్ లోడింగ్ ?
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!