Abhishek Banerjee: దౌత్య బృందంలోకి మేనల్లుడు! యూసఫ్ పఠాన్కు షాక్!
- దౌత్య బృందంలోకి మమత మేనల్లుడు!
- యూసఫ్ పఠాన్కు షాక్!
- అభిషేక్ బెనర్జీ పేరును సూచించిన సీఎం
పాకిస్థాన్ తీరును అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్రం రాజకీయ పార్టీలతో బృందాలను ఏర్పాటు చేసింది. ఏడు బృందాలను ఆయా దేశాలకు పంపించేందుకు రాజకీయ పార్టీలను పేర్లు అడిగింది. కానీ పేర్లు ఇవ్వకముందే కేంద్రం.. కమిటీ సభ్యుల్ని ఎంపిక చేసింది. ఈ వ్యవహారం పొలిటికల్గా దుమారం రేపింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసఫ్ పఠాన్ను దౌత్య బృందంలోకి తీసుకుంది. ప్రతి బృందంలో ఒక ముస్లిం ఎంపీ ఉండేలా కేంద్రం డిసైడ్ చేసింది. అయితే ఈ వ్యవహారం తృణమూల్ కాంగ్రెస్కు రుచించలేదు. తమను సంప్రదించకుండా యూసప్ పఠాన్ను ఎలా తీసుకుంటారని ఆ పార్టీ ప్రశ్నించింది. దీంతో దౌత్య బృందం నుంచి యూసప్ పఠాన్ తప్పుకున్నారు. తాజాగా ఆయనకు ఝలక్ ఇచ్చి.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ఎంపిక చేశారు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాలలోని డైమండ్ హార్బర్ (లోక్సభ నియోజకవర్గం) పార్లమెంటు సభ్యుడిగా పనిచేస్తున్నారు. 24 ఫిబ్రవరి 2012న థాయ్ జాతీయురాలు రుజిరాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Israel-Gaza: గాజాపై కొనసాగుతున్న మారణహోమం.. 60 మంది మృతి
Also Read
మమతా బెనర్జీకి కిరణ్ రిజిజు ఫోన్ చేసి మరొక ప్రతినిధి పేరు ఇవ్వాలని సూచించారు. దీంతో ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పేరును సిఫార్సు చేశారు. ప్రతినిధిని ఎంపిక చేసే ముందు పార్టీని సంప్రదించి ఉండాల్సిందని మమత సూచించారు.
ఇది కూడా చదవండి: Breaking News : మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
జేడీయూకు చెందిన సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని బృందంలో బీజేపీకి చెందిన అపరాజిత సారంగి, బ్రిజ్ లాల్, జాన్ బ్రిట్టాస్, ప్రసన్ బారువా, హేమాంగ్ జోషి కూడా ఉన్నారు. ఈ ప్రతినిధి బృందం మే 22న బయలుదేరి.. ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ దేశాలను సందర్శించనున్నారు. ఈ బృందంలో అభిషేక్ బెనర్జీ ఉండనున్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో