Site icon NTV Telugu

Earthquake: బంగ్లాదేశ్‌ లో భారీ భూకంపం.. పశ్చిమబెంగాల్‌లోనూ ప్రకంపనలు

Earthquake

Earthquake

Earthquake: బంగ్లాదేశ్‌లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. చిట్టగాంగ్‌లోని భూమి అంతర్భాగంలో 55 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. కోల్ కతా సహా బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే రాష్ట్రంలో ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని పశ్చిమ బెంగాల్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.

Read also: Chandrababu Districts Tour: మళ్లీ జనంలోకి చంద్రబాబు.. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటన..

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. , ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు’ అని అధికారులు తెలిపారు. కోల్ కతా పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. కాగా, శనివారం ఉదయం 9.41 గంటలకు చిట్టగాంగ్‌లోని రామ్‌గంజ్‌లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.6గా నమోదైంది. భూమి అంతర్భాగంలో 55 కిలోమీటర్ల లోతులో కదలికలు వచ్చినట్లు వెల్లడించారు. భూకంప కేంద్రం రామ్‌గంజ్ సమీపంలో ఉందని పేర్కొంది. నిమిషాల వ్యవధిలోనే చిట్టగాంగ్ ప్రావిన్స్‌లోని లక్ష్మీపూర్, చాంద్‌పూర్, కొమిల్లాలో భూమి కంపించింది. అదేవిధంగా, రాజ్‌షాహి, సిల్హెట్, ఢాకా, నౌఖాలీ మరియు కుస్తియాలో కూడా ప్రకంపనలు సంభవించాయి. భూకంపం వల్ల సంభవించిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.


Chandrababu Districts Tour: మళ్లీ జనంలోకి చంద్రబాబు.. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటన..

Exit mobile version