Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు కీలక విజయం దక్కింది. మోస్ట్ వాంటెంట్ జైషే మహ్మద్ ఉగ్రవాది సైఫుల్లా బలోచ్ హతమ్యాడు. కిష్త్వార్ జిల్లాలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో చచ్చారు. సైఫుల్లాపై రూ. 5 లక్షల రివార్డ్ ఉంది. జమ్మూ కాశ్మీర్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఇతను ఒకడు. ముగ్గురు ఉగ్రవాదులు ఒక గుడిసెలో దాక్కున్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ లో సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(SOG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పాల్గొన్నాయి.
Read Also: Aura of Ustaad: మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే.. ఆరా ఆఫ్ ఉస్తాద్ అదిరింది!
సైఫుల్లా గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో భద్రతా బలగాలకు చిక్కకుండా పారిపోతున్నాడు. కనీసం 20 సార్లు తప్పించుకున్నాడు. ఎన్కౌంటర్ స్థలం నుంచి రెండు అసాల్ట్ రైఫిల్స్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరో కీలకమైన ఉగ్రవాది ఆదిల్ ను ఇటీవల ఇదే ప్రాంతంలో కాల్చి చంపారు. చత్రో అటవీ ప్రాంతంలో గత నెల రోజుల్లో దాదాపుగా అర డజన్ ఎన్కౌంటర్లు జరిగాయి. జనవరిలో ఆపరేషన్ త్రాషి-1 ను ప్రారంభించారు. చత్రో, సోన్నార్, డోల్గామ్, దిచార్లతో సహా కిష్త్వార్ లోని అటవీ, పర్వత ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి.