Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
- పాస్పోర్టు పౌరసత్వానికి రుజువు కాదు.
- పౌరసత్వ చట్టం, పాస్పోర్టు చట్టాలు వేర్వేరు..
- పౌరసత్వాన్ని నిరూపించే పత్రాల్లో పాస్పోర్టు ఒకటి మాత్రమే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Passport Row: పాస్పోర్టు ఉంటే, భారత పౌరసత్వం ఉన్నట్లు కాదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) స్పష్టం చేసింది. భారత పాస్పోర్ట్ ప్రధానంగా ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని, దానిని పౌరసత్వానికి నిశ్చయాత్మకమైన రుజువుగా పరిగణించరాదని చెప్పింది. అయితే, ఈ ప్రకటనపై ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల ప్రక్షాళన, పౌరసత్వంపై చర్చలు జరుగుతున్న వేళ కేంద్రం నుంచి ఈ ప్రకటన రావడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా చేసింది. పాస్పోర్టు జారీలో ధృవీకరణ, పలు ప్రభుత్వ పత్రాల పరిశీలన ఉంటాయని, అయితే పౌరసత్వం మాత్రం రాజ్యాంగం, 1955 పౌరసత్వ చట్టం ద్వారా నిర్ధారించబడుతుందని విదేశాంగ శాఖ చెప్పింది.
ఈ ప్రకటనపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పాస్పోర్టు 1967 నాటి పాస్పోర్ట్ చట్టంపై ఆధారపడి ఉంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో పౌరులు కాని వారికి కూడా పాస్పోర్టు, ప్రయాణ పత్రాలను జారీ చేయవచ్చు. దీని వల్లే పాస్పోర్టు కలిగి ఉండటం పౌరసత్వానికి రుజపువగా పరిగణించలేము. 2013 నాటి ఒక తీర్పులో, పాస్పోర్ట్ ఒక్కటే పౌరసత్వానికి అంతిమ రుజువు కాదని బొంబాయి హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. పౌరసత్వాన్ని పౌరసత్వ చట్టం మరియు ఇతర ఆధారాల ఆధారంగా నిర్ధారించాలని కోర్టు పేర్కొంది.
Also Read
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
- PM Modi: పుతిన్ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
- Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా మాట్లాడుతూ.. కేంద్రం ఎలాంటి కొత్త విధానాన్ని ప్రకటించలేదని, కేవలం సుదీర్ఘ కాలంగా ఉన్న చట్టపరమైన వైఖరినే పునరుద్ఘాటించిందని అన్నారు. జనన ధ్రువీకరణ పత్రాలు, తల్లిదండ్రుల పత్రాలు, ఓటర్ జాబితా, పాఠశాల ధ్రువీకరణ పత్రాలు, భూమి రికార్డులు, ప్రభుత్వ పత్రాలు, పాస్పోర్టులు అన్నీ కలిసి పౌరసత్వాన్ని నిరూపిస్తాయని యఆయన అన్నారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేస్తున్నాయని ఆరోపించారు.
తాజావార్తలు
-
Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
-
Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
-
Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
-
IND vs ENG 1st ODI: అక్షర్ పటేల్ మ్యాజిక్.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!