Jagadish Shettar: “నా ఓటమికి కారణం అదే”.. కర్ణాటక మాజీ సీఎం వ్యాఖ్యలు..
Jagadish Shettar: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. కన్నడ అసెంబ్లీలో 224 స్థానాలు ఉంటే కాంగ్రెస్ 135, బీజేపీ 66, జేడీయూ 19 స్థానాలల్లో విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఎన్నికల ముందు బీజేపీ నుంచి పార్టీ మారిన మాజీ సీఎం జగదీష్ షెట్టర్ ఓడిపోయాడు. హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన ఆయనకు ఓటమిని చవిచూశాడు. లింగాయత్ వర్గానికి చెందిన కీలక నేత అయిన షెట్టర్ గెలుపొందకపోవడం చర్చనీయాంశం అయింది.
అయితే తన ఓటమికి ధనబలం, వ్యూహాలే కారణం అని ఆయన అన్నారు. తన ప్రత్యర్థి ఓటర్లకు రూ.500, రూ. 1000 పంపిణీ చేశారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి మహేష్ తెంగినాకై చేతిలో 34,000 ఓట్ల తేడాలో షెట్టర్ ఓడిపోయాడు. ఇదిలా ఉంటే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి మారడం వల్ల హస్తం పార్టీకి ప్లస్ అయింది. సంప్రదాయంగా బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్ లు ఈ సారి కాంగ్రెస్ కు ఓటేయడం విశేషం. దీని ఫలితంగా లింగాయత్ బెల్ట్ నుంచి సుమారుగా 20-25 స్థానాలు రావడానికి సహాయపడింది.
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
Read Also: Congress: కేరళ, తెలంగాణ పొత్తు కదురదు, కానీ.. రాహుల్ గాంధీ సన్నిహితుడి కీలక వ్యాఖ్యలు..
గత ఆరు ఎన్నికల్లో తాను డబ్బును ఉపయోగించలేదని, ఓటర్లకు డబ్బు పంపిణీ చేయలేదని, అయితే ఈసారి బీజేపీ అభ్యర్థి భారీగా డబ్బులు పంపిణీ చేశారని, ఇలా జరగడం ఇదే మొదటిసారని జగదీష్ షెట్టర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 130-140 మధ్య సీట్లు వస్తాయని వారం క్రితమే చెప్పానని గుర్తు చేశారు. ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, అన్ని కులాలు, అందరు ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తున్నారని వారం క్రితం షెట్టర్ అన్నారు.
తనను ఓడించేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలు చేసిందని, డబ్బు అంశం కీలకంగా మారిందని, హుబ్బళ్లిలో వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారని ఒత్తిడి వ్యూహాలు తన ఓటమికి కారణం అయ్యాయని అన్నారు. బీజేపీ మొత్తం జగదీష్ షట్టర్ ను టార్గెట్ చేసింది, చివరకు ఏమైంది..? రాష్ట్రం మొత్తాన్ని పోగొట్టుకున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నిలకపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!