Congress: కేరళ, తెలంగాణ పొత్తు కదురదు, కానీ.. రాహుల్ గాంధీ సన్నిహితుడి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కర్ణాటక ఎన్నికల విజయంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్ గా భావించిన కర్ణాటకలో అధికారంలోకి వస్తుండటం కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాాలని కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి విజయాల కోసం ఎదురుచూస్తున్న హస్తం పార్టీ ఘన విజయం సాధించడంతో రానున్న ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలకు ఆ పార్టీ సమాయత్తం అవుతోంది.
Read Also: Indore : 21 ఏళ్ల క్రితం చనిపోయిన మామ.. కట్నం కోసం వేధిస్తున్నాడని కాజల్ ఫిర్యాదు
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
ఇదిలా ఉంటే విపక్షాల కూటమి, పొత్తుల వ్యవహారం కూడా చర్చకు వస్తున్నాయి. దీనిపై రాహుల్ గాంధీ సన్నిహితుడు, పార్టీలో కీలక నేత అయిన కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలో సీపీఎంతో, తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల తర్వాత పొత్తులు, కొన్ని సందర్భాల్లో ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో సైద్ధాంతిక విభేదాలు ఉన్నా, ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, ఇతర ప్రాంతీయ పార్టీలతో ఎన్నికల అనంతరం పొత్తులు పెట్టుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎవరనేదానిపై పార్టీ కసరత్తు చేస్తుందని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్యలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఖర్గే ముఖ్యమంత్రి అవుతారనే వాదనల్ని కొట్టిపారేశారు. పుకార్లను నమ్మవద్దని కోరారు. రాజస్థాన్ లో నాయకత్వ సమస్య ఉందని పార్టీ దాన్ని పరిష్కరిస్తుందని అన్నారు. సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ ల మధ్య సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా మరో ప్రచారానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు నుంచి పడమరకు ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభిస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!