Congress: కేరళ, తెలంగాణ పొత్తు కదురదు, కానీ.. రాహుల్ గాంధీ సన్నిహితుడి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కర్ణాటక ఎన్నికల విజయంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్ గా భావించిన కర్ణాటకలో అధికారంలోకి వస్తుండటం కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాాలని కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి విజయాల కోసం ఎదురుచూస్తున్న హస్తం పార్టీ ఘన విజయం సాధించడంతో రానున్న ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలకు ఆ పార్టీ సమాయత్తం అవుతోంది.
Read Also: Indore : 21 ఏళ్ల క్రితం చనిపోయిన మామ.. కట్నం కోసం వేధిస్తున్నాడని కాజల్ ఫిర్యాదు
Also Read
- Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
- Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
ఇదిలా ఉంటే విపక్షాల కూటమి, పొత్తుల వ్యవహారం కూడా చర్చకు వస్తున్నాయి. దీనిపై రాహుల్ గాంధీ సన్నిహితుడు, పార్టీలో కీలక నేత అయిన కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలో సీపీఎంతో, తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల తర్వాత పొత్తులు, కొన్ని సందర్భాల్లో ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో సైద్ధాంతిక విభేదాలు ఉన్నా, ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, ఇతర ప్రాంతీయ పార్టీలతో ఎన్నికల అనంతరం పొత్తులు పెట్టుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎవరనేదానిపై పార్టీ కసరత్తు చేస్తుందని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్యలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఖర్గే ముఖ్యమంత్రి అవుతారనే వాదనల్ని కొట్టిపారేశారు. పుకార్లను నమ్మవద్దని కోరారు. రాజస్థాన్ లో నాయకత్వ సమస్య ఉందని పార్టీ దాన్ని పరిష్కరిస్తుందని అన్నారు. సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ ల మధ్య సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా మరో ప్రచారానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు నుంచి పడమరకు ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభిస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!