మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూ…తగ్గుతూ వస్తున్నాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 12,514 మంది కోవిడ్బారిన పడ్డారు.. మరో 251 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 12,718 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది. దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,42,85,814 కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,36,68,560 కి పెరిగాయి… మరోవైపు.. ఇప్పటి వరకు 1,06,31,24,205 మందికి వ్యాక్సినేషన్ జరిగిందని బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక, కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 4,58,437 గా ఉండగా… ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,58,817 గా పేర్కొంది కేంద్ర ప్రభుత్వం.