TMC Crisis: మమత బెనర్జీకి మరిన్ని కష్టాలు.. షాకిస్తున్న ఎంపీలు..
- మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ..
- పెరిగిన తిరుగుబాటు వర్గం బలం..
- 22 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)తో ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు వీరి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా, తమ వెంట 22 మంది ఎంపీలు ఉన్నారని, తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహిస్తున్న ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ చెప్పారు. ఈ ఎంపీలంతా సోమవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలవనున్నారు. తమ వర్గాన్ని ఒక ప్రత్యేక పార్లమెంటరీ గ్రూపుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని అర్థం టీఎంసీ నుంచి వేరుగా ఒక కొత్త పార్లమెంటరీ కూటమిని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. తిరుగుబాటు ఎంపీలంతా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వాలని భావిస్తు్న్నారు.
ఇప్పటికే, తిరుగుబాటు వర్గంలో 19 మంది ఎంపీలు సంతకాలతో కూడిన పత్రం బయటకు వచ్చింది. వీరిలో కోలి ఘోష్ దస్తిదార్, సతాబ్ది రాయ్, బాపి హల్దర్, షర్మిలా సర్కార్, ప్రసూన్ బెనర్జీ, జగదీష్ చంద్ర బర్మా బసునియా, అసిత్ మల్, అరూప్ చక్రవర్తి, కాలిపడ సోరెన్, దీపక్ అధికారి అకా దేవ్, జూన్ మాలియా, పార్థ భౌమిక్, ఖలీలుర్ రహ్మాన్, ఖలీలుర్ రహ్మాన్, ఖలీలుర్ రహ్మాన్, బ్యాగ్, మాలా రాయ్ వంటి వారు ఉ న్నారు. రచనా బెనర్జీ, సయానీ ఘోష్ వంటి వారి సంతకాలు కూడా కనిపించాయి.
Also Read
- Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
- Snake bite: కానిస్టేబుల్ను కాటేసిన పాము.. AI సాయంతో దక్కిన ప్రాణాలు..
- Gold Coins: మురికి కాలువలో బంగారు నాణేలు.. తవ్వుతున్న కొద్దీ దొరుకుతూనే ఉన్నాయ్..
- Amit Shah: ‘‘దేశ ప్రజలు మీ పాపాలను క్షమించరు’’.. సోనియాగాంధీపై అమిత్ షా ఫైర్..
నిజానికి తిరుగుబాటు ఎంపీల సమావేశం కోల్కతాలో జరగాల్సి ఉన్నా, దానిని ఢిల్లీకి మార్చారు. ఈ సమావేశానికి బెంగాల్ సీఎం సువేందు అధికారి హాజరవుతారని భావించినప్పటికీ, అధికారిక కార్యక్రమాల వల్ల రాలేకపోయారు. మమతా బెనర్జీ వర్గంలో ఇప్పుడు అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీ, సౌగతా రాయ్, మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్, శత్రుఘ్న సిన్హా, ప్రతిమా మండల్, సజ్దా అహ్మద్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, టీఎంసీ సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ శనివారం ఢిల్లీలో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమయ్యారు. ఈయన తిరుగుబాటు వర్గంలో చేరే అవకాశం ఉందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో మమతకు రానున్న కాలంలో నేతలు, కార్యకర్తలు మిగిలే అవకాశం లేకుండా పోతోంది.
తాజావార్తలు
-
Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
-
Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
-
Junior Doctors: జూనియర్ డాక్టర్ల కీలక నిర్ణయం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్..
-
Bolla Brothers : పోలీసులకు ఇన్ఫోర్మర్లు.. లోపల గంజాయి దందా.. బొల్లా బ్రదర్స్ బాగోతం
-
Yash: ఆ స్టార్ హీరోయిన్ కోసం బాడీగార్డ్గా మారిన యశ్.. ‘టాక్సిక్’ షూటింగ్లో ఆసక్తికర ఘటన?
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?