TMC Crisis: మమత బెనర్జీకి మరిన్ని కష్టాలు.. షాకిస్తున్న ఎంపీలు..
- మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ..
- పెరిగిన తిరుగుబాటు వర్గం బలం..
- 22 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)తో ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు వీరి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా, తమ వెంట 22 మంది ఎంపీలు ఉన్నారని, తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహిస్తున్న ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ చెప్పారు. ఈ ఎంపీలంతా సోమవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలవనున్నారు. తమ వర్గాన్ని ఒక ప్రత్యేక పార్లమెంటరీ గ్రూపుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని అర్థం టీఎంసీ నుంచి వేరుగా ఒక కొత్త పార్లమెంటరీ కూటమిని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. తిరుగుబాటు ఎంపీలంతా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వాలని భావిస్తు్న్నారు.
ఇప్పటికే, తిరుగుబాటు వర్గంలో 19 మంది ఎంపీలు సంతకాలతో కూడిన పత్రం బయటకు వచ్చింది. వీరిలో కోలి ఘోష్ దస్తిదార్, సతాబ్ది రాయ్, బాపి హల్దర్, షర్మిలా సర్కార్, ప్రసూన్ బెనర్జీ, జగదీష్ చంద్ర బర్మా బసునియా, అసిత్ మల్, అరూప్ చక్రవర్తి, కాలిపడ సోరెన్, దీపక్ అధికారి అకా దేవ్, జూన్ మాలియా, పార్థ భౌమిక్, ఖలీలుర్ రహ్మాన్, ఖలీలుర్ రహ్మాన్, ఖలీలుర్ రహ్మాన్, బ్యాగ్, మాలా రాయ్ వంటి వారు ఉ న్నారు. రచనా బెనర్జీ, సయానీ ఘోష్ వంటి వారి సంతకాలు కూడా కనిపించాయి.
Also Read
- Russian Oil: రష్యా చమురు కొనుగోలులో భారత్ జోరు..
- SIPRI Report: పాకిస్తాన్ అణు అహంకారం బద్దలు.. ఆపరేషన్ సిందూర్పై సంచలన రిపోర్ట్..
- 100% Ethanol: 100% ఇథనాల్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. E100 ఇంధనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
- Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు
నిజానికి తిరుగుబాటు ఎంపీల సమావేశం కోల్కతాలో జరగాల్సి ఉన్నా, దానిని ఢిల్లీకి మార్చారు. ఈ సమావేశానికి బెంగాల్ సీఎం సువేందు అధికారి హాజరవుతారని భావించినప్పటికీ, అధికారిక కార్యక్రమాల వల్ల రాలేకపోయారు. మమతా బెనర్జీ వర్గంలో ఇప్పుడు అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీ, సౌగతా రాయ్, మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్, శత్రుఘ్న సిన్హా, ప్రతిమా మండల్, సజ్దా అహ్మద్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, టీఎంసీ సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ శనివారం ఢిల్లీలో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమయ్యారు. ఈయన తిరుగుబాటు వర్గంలో చేరే అవకాశం ఉందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో మమతకు రానున్న కాలంలో నేతలు, కార్యకర్తలు మిగిలే అవకాశం లేకుండా పోతోంది.
తాజావార్తలు
-
TMC Crisis: మమత బెనర్జీకి మరిన్ని కష్టాలు.. షాకిస్తున్న ఎంపీలు..
-
Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
-
Ram Charan: ఈ కాంబో సెట్ అయితే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ – శ్రీకాంత్ ఓదెల మూవీపై క్రేజీ బజ్!
-
Emmanuel Macron: భారత్ ఆవిష్కరణల దేశం.. మేక్ ఇన్ ఇండియాకు మా పూర్తి గౌరవం: మాక్రాన్
-
War Effect: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. ఒమన్ గల్ఫ్లో చిక్కుకుపోయిన 13 భారతీయ నౌకలు…
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?