Maharashtra: “ద్రోహం చేసిన నా కుమార్తె, అల్లుడిని ప్రాణహితలో పారేయండి”.. మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- నా కూతురు.. అల్లుడిని ప్రాణహితలో పారేయండి..
- ప్రత్యర్థి వర్గంలో చేరడంపై ఎన్సీపీ మంత్రి ఆగ్రహం..
- అజిత్ పవార్ వర్గం నుంచి శరద్ పవార్ వర్గంలోకి మంత్రి కూతురు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర ఆహార- ఔషధ నిర్వహణ శాఖ మంత్రి, ఎన్సీపీ (అజిత్ పవార్) సీనియర్ నేత ధర్మారావుబాబా ఆత్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ద్రోహం’’ చేసినందుకు తన కుమార్తె భాగ్యశ్రీ, అల్లుడు రితురాజ్ హల్గేకర్లను ప్రాణహిత నదిలో పారేయాలని అహేరి నియోజకవర్గ ఓటర్లు కోరారు. వీరిద్దరు శరద్ పవార్ ఎన్సీపీ వర్గంలో చేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈయన ఈ వ్యాఖ్యలుచేశారు.
మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ పవార్ ఎన్సీపీ) ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’’ ప్రచార కార్యక్రమంలో భాగంగా అహేరీలో ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ పాల్గొన్న సభలో ఆత్రమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై పోటీ చేసేందుకు తన కుమార్తె ప్రత్యర్థి వర్గం ఎన్సీపీ(శరద్ పవార్)లో చేరుతున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
- PM Modi: న్యూజిలాండ్లో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ .. ఆ గిఫ్ట్ను చూపిస్తూ స్టేజ్ పైనే భావోద్వేగం!
- అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
Read Also: Afzal Guru: “అఫ్జల్ గురుని ఉరితీయడం వల్ల లాభం లేదు”.. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
“ప్రజలు పార్టీని వీడిపోతారు కానీ వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మా కుటుంబంలోని కొందరు వేరే పార్టీలో చేరాలనుకుంటున్నారు. 40 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో వారు ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు శరద్ పవార్ గ్రూపు నాయకులు నా ఇంటిని విభజించి నా కుమార్తెను నాపై పోటీకి దింపాలని చూస్తున్నారు. నా అల్లుడు మరియు కూతురిని నమ్మవద్దు,’’ అని ఓటర్లను కోరారు. ‘‘ నా కూతురు, అల్లుడు తనను వదిలిపెట్టారు వారిని ప్రాణహిత నదిలో పారేయవాలి. వారు నా కుమార్తెను తన నుంచి విడదీసి, నాకు వ్యతిరేకంగా పోటీ దింపుతున్నారు. తండ్రికి కూతురు కాలేని అమ్మాయి, మీకు ఏం చేస్తుంది..? మీరు దాని గురించి ఆలోచించాలి. ఆమెని నమ్మొద్దు. రాజకీయాల్లో తాను కూతురు, అల్లుడు, తమ్ము అని చూడను’’ అని అన్నారు.
ఒక కూతురు నన్ను వదిలేసిన, మరో కూతురు ఇతర కుటుంబ సభ్యులు తనతోనే ఉన్నారని ఆత్రం చెప్పుకొచ్చారు. గతేడాది ఎన్సీపీలో చీలిక వచ్చింది. శరద్ పవార్ని కాదని, అజిత్ పవార్ మహారాష్ట్రలో బీజేపీ-శివసేన షిండే వర్గంతో చేతులు కలిపారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, నాయకుల బలంల అజిత్ పవార్కే ఉండటంతో నిజమైన ఎన్సీపీని అజిత్ పవార్దే అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది.
తాజావార్తలు
-
Bhagyasri Borse : ఏడ్చేసిన ‘లెనిన్’ హీరోయిన్.. అండగా నిలబడ్డారంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
-
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!