Assam: 3 వారాల తర్వాత గ్యాంగ్రేప్ కేసులో నిందితుల అరెస్ట్
- 3 వారాల తర్వాత గ్యాంగ్రేప్ కేసులో నిందితుల అరెస్ట్
- అస్సాంలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
- ప్రధాన నిందితుడు చెరువులో పడి మృతి
- మిగతా ఇద్దరు నిందితులు శుక్రవారం అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాం రాష్ట్రంలో 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్రేప్ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. ట్యూషన్కు వెళ్లి తిరిగి వస్తుండగా పదో తరగతి విద్యార్థినిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. రోడ్లపైకి వచ్చి నానా హంగామా సృష్టించారు. దీంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించి.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Game Changer: అంత హడావుడి చేసి.. ఇలా గాలి తీసేశారు ఏంటి గురూ!
Also Read
నాగోన్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో మూడు వారాల తర్వాత అస్సాం పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆగస్ట్ 24 న పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని చెరువులో దూకి చనిపోయాడు. ఆగస్టులో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ట్యూషన్కు వెళ్లి తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డుకుని అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ పరిణామంలో ప్రధాన నిందితుడు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు. మొత్తానికి మూడు వారాల తర్వాత ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరిని అస్సాంలోని మోరిగావ్ జిల్లాకు చెందిన పోలీసులు అరెస్టు చేయగా… మరొకరిని నాగాలాండ్లోని దిమాపూర్లో అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
ఇది కూడా చదవండి: Roshan Kanakala: హేయ్ రోషన్… నువ్వేనా.. ఇలా తయారయ్యావ్ ఏంటి?
ఆగస్టు 22న ఢింగ్లో 14 ఏళ్ల బాలిక ట్యూషన్ ముగించుకుని ఇంటికి వస్తుండగా మోటార్సైకిల్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను చుట్టుముట్టి అత్యాచారం చేశారు. ప్రధాన నిందితుడు తఫాజుల్ ఇస్లామ్ను మరుసటి రోజు అరెస్టు చేసే ప్రయత్నం చేయగా చెరువులో పడి చనిపోయాడు. ఇద్దరు సహచరులు పరారీలో ఉండడంతో 3 వారాల తర్వాత అరెస్ట్ చేశారు. అరెస్టు అనంతరం నిందితులిద్దరినీ విచారణ నిమిత్తం నాగోన్ సదర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇది కూడా చదవండి: Uruku Patela Review: ఉరుకు పటేలా రివ్యూ.. థియేటర్లకు ఉరుకులు పెట్టించేలా ఉందా? లేదా?
తాజావార్తలు
-
Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
-
Dileep Raj Death: కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత!
-
NTA Scam Explained: పరీక్ష పెట్టడం కూడా చేతకాదా? భగ్గుమన్న విద్యార్థి లోకం!
-
SRH Playoff Chances: ఎస్ఆర్హెచ్ ప్లే-ఆఫ్ ఆశలు సజీవమేనా? గుజరాత్ ఓటమి తర్వాత మారిన సమీకరణాలు..
-
Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!