New Criminal Laws: నేటి నుంచి అమల్లోకి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు..
- బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెర..
- నేటి నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు..
- ఆన్లైన్లో పోలీస్ కంప్లైంట్స్ పాటు ఎస్ఎంఎస్ పద్ధతిలో సమన్లు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Criminal Laws: నేటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తుండటంతో బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది. భారత న్యాయ వ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. భారత శిక్షా స్మృతి (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టాల చరిత్ర గత అర్ధరాత్రితో పూర్తిగా ముగిసి పోయింది.
Read Also: Tragedy: విషాదం.. మట్టి మిద్దె కూలి నలుగురు మృతి
Also Read
- Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
- Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
- MK Stalin: రాహుల్గాంధీకి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్
- Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
అయితే, కొత్త చట్టాలలో జీరో ఎఫ్ఐఆర్, ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు ఎస్ఎంఎస్ పద్ధతిలో సమన్లు జారీ చేసే అవకాశం ఉంటుంది. పెద్ద నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లను తప్పనిసరి వీడియోల్లో చిత్రికరించడం వంటి కొత్త రూల్స్ న్యాయ వ్యవస్థలోకి వచ్చాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా, న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. చట్టాల పేరు మాత్రమే కాదు, వాటి సవరణలు పూర్తి భారతీయ సంప్రదాయంలో రూపొందించినట్లు తెలిపారు. కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అందిస్తాయని అతడు వెల్లడించారు.
Read Also: NIA Raids : వివిధ కేసుల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ఐఏ దాడులు
కాగా, భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశద్రోహంగా మార్చింది. కులం, మతం లాంటి కారణాలతో సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే ఐపీసీ ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉండేది. కానీ, దీన్ని ఇప్పుడు యావజ్జీవ శిక్షగా మార్చారు. నకిలీ నోట్ల తయారీ, వాటి స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకి తీసుకెళ్లింది. అలాగే, విదేశాల్లో భారతదేశానికి చెందిన ఆస్తుల ధ్వంసాన్నీ ఉగ్రవాదంగా పేర్కొనింది. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడాన్ని ఉగ్రవాదం పరిధిలోకి తీసుకెళ్లింది.
Read Also: Pawan Kalyan: 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన
అలాగే, మహిళలు, పిల్లలపై నేరాలపై కొత్త అధ్యాయాన్ని మోడీ సర్కార్ జోడించింది. పిల్లల్ని కొనడం, అమ్మడం ఘోరమైన నేరంగా పేర్కొనింది. మైనర్పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించేలా నిబంధనను తీసుకొచ్చింది. పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు హామీలను లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను విడిచి పెట్టే కేసులకు కొత్త నిబంధన తీసుకొచ్చారు. మహిళలు, పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆస్పత్రుల్లో ఉచితంగా ప్రథమ చికిత్స అందించాలి చెప్పుకొచ్చింది. కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించేలా నిబంధనలు చేర్చారు.
Read Also: Big Explosion : టర్కీలో భారీ పేలుడు, ఐదుగురు మృతి, 63మందికి గాయాలు
ఇక, కొత్త చట్టాల ప్రకారం ఫిర్యాదుల నుంచి నోటీసులు ఇచ్చే అంశం పూర్తిగా అన్నీ ఆన్లైన్లో జరగనున్నాయి. పోలీసు స్టేషన్కు వెళ్లే పని లేకుండా ఎల్రక్టానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. ఎస్ఎంఎస్ ద్వారా కూడా సమన్లు పంపించే అవకాశం ఉంది. పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎఫ్ఐఆర్ నమోదు చేసే జీరో ఎఫ్ఐఆర్ విధానం కూడా అమల్లోకి తీసుకొచ్చింది. అరెస్టైన వ్యక్తి కుటుంబానికి, స్నేహితులకు సమాచారాన్ని పంచుకునే వీలు కల్పించడంతో పాటు వివరాలను పోలీస్ స్టేషన్లలో ప్రదర్శిస్తారించే ఛాన్స్ ఈ కొత్త చట్టాల్లో పొందుపర్చారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!