New Criminal Laws: నేటి నుంచి అమల్లోకి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు..
- బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెర..
- నేటి నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు..
- ఆన్లైన్లో పోలీస్ కంప్లైంట్స్ పాటు ఎస్ఎంఎస్ పద్ధతిలో సమన్లు జారీ
New Criminal Laws: నేటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తుండటంతో బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది. భారత న్యాయ వ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. భారత శిక్షా స్మృతి (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టాల చరిత్ర గత అర్ధరాత్రితో పూర్తిగా ముగిసి పోయింది.
Read Also: Tragedy: విషాదం.. మట్టి మిద్దె కూలి నలుగురు మృతి
అయితే, కొత్త చట్టాలలో జీరో ఎఫ్ఐఆర్, ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు ఎస్ఎంఎస్ పద్ధతిలో సమన్లు జారీ చేసే అవకాశం ఉంటుంది. పెద్ద నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లను తప్పనిసరి వీడియోల్లో చిత్రికరించడం వంటి కొత్త రూల్స్ న్యాయ వ్యవస్థలోకి వచ్చాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా, న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. చట్టాల పేరు మాత్రమే కాదు, వాటి సవరణలు పూర్తి భారతీయ సంప్రదాయంలో రూపొందించినట్లు తెలిపారు. కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అందిస్తాయని అతడు వెల్లడించారు.
Read Also: NIA Raids : వివిధ కేసుల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ఐఏ దాడులు
కాగా, భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశద్రోహంగా మార్చింది. కులం, మతం లాంటి కారణాలతో సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే ఐపీసీ ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉండేది. కానీ, దీన్ని ఇప్పుడు యావజ్జీవ శిక్షగా మార్చారు. నకిలీ నోట్ల తయారీ, వాటి స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకి తీసుకెళ్లింది. అలాగే, విదేశాల్లో భారతదేశానికి చెందిన ఆస్తుల ధ్వంసాన్నీ ఉగ్రవాదంగా పేర్కొనింది. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడాన్ని ఉగ్రవాదం పరిధిలోకి తీసుకెళ్లింది.
Read Also: Pawan Kalyan: 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన
అలాగే, మహిళలు, పిల్లలపై నేరాలపై కొత్త అధ్యాయాన్ని మోడీ సర్కార్ జోడించింది. పిల్లల్ని కొనడం, అమ్మడం ఘోరమైన నేరంగా పేర్కొనింది. మైనర్పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించేలా నిబంధనను తీసుకొచ్చింది. పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు హామీలను లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను విడిచి పెట్టే కేసులకు కొత్త నిబంధన తీసుకొచ్చారు. మహిళలు, పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆస్పత్రుల్లో ఉచితంగా ప్రథమ చికిత్స అందించాలి చెప్పుకొచ్చింది. కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించేలా నిబంధనలు చేర్చారు.
Read Also: Big Explosion : టర్కీలో భారీ పేలుడు, ఐదుగురు మృతి, 63మందికి గాయాలు
ఇక, కొత్త చట్టాల ప్రకారం ఫిర్యాదుల నుంచి నోటీసులు ఇచ్చే అంశం పూర్తిగా అన్నీ ఆన్లైన్లో జరగనున్నాయి. పోలీసు స్టేషన్కు వెళ్లే పని లేకుండా ఎల్రక్టానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. ఎస్ఎంఎస్ ద్వారా కూడా సమన్లు పంపించే అవకాశం ఉంది. పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎఫ్ఐఆర్ నమోదు చేసే జీరో ఎఫ్ఐఆర్ విధానం కూడా అమల్లోకి తీసుకొచ్చింది. అరెస్టైన వ్యక్తి కుటుంబానికి, స్నేహితులకు సమాచారాన్ని పంచుకునే వీలు కల్పించడంతో పాటు వివరాలను పోలీస్ స్టేషన్లలో ప్రదర్శిస్తారించే ఛాన్స్ ఈ కొత్త చట్టాల్లో పొందుపర్చారు.
తాజావార్తలు
-
CM Chandrababu Birthday: అన్న క్యాంటీన్లో చంద్రబాబు దంపతులు.. పేదలతో కలిసి సీఎం అల్పాహారం!
-
PEDDI : ‘పెద్ది’లో బాలయ్య హీరోయిన్ స్పెషల్ సాంగ్?
-
Netanyahu: ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
-
Varun Chakaravarthy: డ్రెస్సింగ్ రూమ్లో ప్రతిఒక్కరూ ఏడ్చేశారు.. మాపై నిందారోపణలు చేశారు!
-
Fire Accident: గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం.. సెల్లార్లో షార్ట్ సర్క్యూట్తో 15 బైకులు దగ్ధం.!
ట్రెండింగ్
-
స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!
-
Cream Cheese Kunafa Recipe: రెస్టారెంట్స్ లో డబ్బులు వేస్ట్.. ఇంట్లోనే సూపర్ టేస్టీ ‘క్రీమ్ చీజ్ కునాఫా’ చేసేయండి ఇలా.!
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!