Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News The World Is Interested In The Chinese Weapons Scrap Collected By India China Is Concerned

Operation Sindoor: భారత్ సేకరించిన “చైనీస్ ఆయుధ శిథిలాల”పై ప్రపంచం ఆసక్తి.. చైనా ఆందోళన..

Published Date :June 2, 2025 , 2:52 pm
By Venu Goapl Reddy
  • పాక్ ప్రయోగించిన చైనీస్ ఆయుధాలు భారత్ స్వాధీనం..
  • PL-15E క్షిపణి దొరకడంపై చైనాలో ఆందోళన..
  • దీని పరిశోధనకు భారత్ అనుమతి కోరుతున్న ప్రపంచదేశాలు..
Operation Sindoor: భారత్ సేకరించిన “చైనీస్ ఆయుధ శిథిలాల”పై ప్రపంచం ఆసక్తి..  చైనా ఆందోళన..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ భారత సైనిక సత్తాను పాకిస్తాన్‌కి రుచి చూపించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పీఓకే లోని 09 ఉగ్ర స్థావరాలపై దాడి చేసి, 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం కవ్వింపుల తర్వాత, 11 పాక్ వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్ కింద భారతదేశం తన వైమానిక దళానికి చెందిన నాలుగు స్క్వాడ్రన్‌లను రంగంలోకి దించింది, వాటిలో బ్రహ్మోస్ మరియు SCALP-EG క్రూయిజ్ క్షిపణులు, AASM హామర్ గైడెడ్ బాంబులు, ఎయిర్ టూ ఎయిర్ వార్‌కి మెటియోర్ క్షిపణులను వాడింది.

అయితే, పాకిస్తాన్ 40 కన్నా ఎక్కువ జెట్స్‌తో భారత దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసింది. వీటికి అమెరికా సరఫరా చేసిన ఎఫ్-16 ఫైటర్స్‌తో పాటు చైనీస్ -10C, JF-17 థండర్ ఫైటర్లను వాడింది. చైనా నుంచి కొనుగోలు చేసిన PL-15E ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులతో పాటు ఫతా-2 రాకెట్లను వాడింది. అయితే, భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాకిస్తాన్ దాడుల్ని అడ్డుకుంది.

Also Read

  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
  • Vijay-Governor: విజయ్‌కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
  • China-Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కు చైనా ప్రత్యక్ష సహాయం..!
  • Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్‌గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!
Add as a preferred
source on google

చైనీస్ ఆయుధ శిథిలాలపై ప్రపంచం ఆసక్తి..

ఇదిలా ఉంటే, చైనా ఎంతో గర్వంగా చెప్పుకునే PL-15E క్షిపణిని భారత్ కూల్చేసింది. పంజాబ్ హోషియార్‌పూర్ జిల్లాలోని కామాహి దేవి గ్రామంలో దీని శిథిలాలు లభించాయి. క్షిపణి యొక్క ముఖ్యమైన భాగాలు, దాని ప్రొపల్షన్, డేటా-లింక్, ఇనర్షియల్ యూనిట్ మరియు అడ్వాన్స్‌డ్ యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అర్రే (AESA) సీకర్ సహా, చెక్కుచెదరకుండా లభించాయి. ఈ శిథిలాలు ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా, ఫైవ్ ఐస్ నేషన్స్(యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్)తో పాటు జపాన్, దక్షిణ కొరియా దేశాలు PL-15Eలోని డ్యూయల్-పల్స్ మోటార్ మరియు AESA టెక్నాలజీని అధ్యయనం చేయడానికి యాక్సెస్ కోరాయి.

చైనాలో ఆందోళన

చైనా ఆయుధాలు శిథిలాలుగా భారత్‌కి దొరకడంపై చైనా ఆందోళన చెందుతోంది. తన టెక్నాలజీ ఇతర దేశాలకు తెలిసిపోతుందని భయపడుతోంది. భారత రక్షణ శాస్త్రవేత్తలు ఇప్పుడు దీనిని అధ్యయనం చేస్తున్నారు. బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణుల తయారీని బలోపేతం చేయడానికి, ఈ PL-15E క్షిపణిని రివర్స్ ఇంజనీరింగ్ చేసే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు డ్రాగన్ కంట్రీకి గుబులు పుట్టిస్తోంది.

భారత్-పాకిస్తాన్ సంఘర్షణలో చైనా మొదటిసారిగా PL-15E వాడటాన్ని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జాంగ్ జియావోగాంగ్ అంగీకరించారు. ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా (AVIC) అభివృద్ధి చేసిన PL-15E అనేది దీర్ఘ-శ్రేణి, చురుకైన రాడార్-గైడెడ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి. భారతదేశంలో దాని శిథిలాలను తిరిగి పొందడం వలన సాంకేతిక లీక్‌ల గురించి బీజింగ్‌లో ఆందోళనలు రేకెత్తాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • China PL 15 missile
  • india air strikes
  • India Airstrikes
  • India-Pakistan Tensions
  • India-Pakistan War

తాజావార్తలు

  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

  • YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్‌..

  • Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!

  • CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

  • Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions