President of India Building: శబరిమలలో అధికారిక రాష్ట్రపతి భవన్.. నేపథ్యం ఇదే..!
- శబరిమలలో అధికారిక రాష్ట్రపతి భవన్
- బ్యాగ్రౌండ్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి భవన్ అనగానే గుర్తొచ్చేది ఢిల్లీ. ఇక శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు వచ్చిప్పుడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఈ రెండు కాకుండా శబరిమలలో కూడా అధికారిక రాష్ట్రపతి భవనం ఉందని ఎంత మందికి తెలుసు. శబరిమలలో రాష్ట్రపతి భవనం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదువుతున్నది నిజమే. దీని బ్యాగ్రౌండ్ తెలియాలంటే అయితే ఈ వార్త చదవాల్సిందే.
ఇది కూడా చదవండి: Toll Plaza: దీపావళి బోనస్ ఇవ్వలేదని ఉద్యోగుల నిరసన.. ఫ్రీగా టోల్ గేట్లు ఎత్తివేత
Also Read
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
కేరళలోని శబరిమల సన్నిధానం లోపల రాష్ట్రపతి భవనం ఉంది. ఈ భవనం అధికారికంగా భారత రాష్ట్రపతి పేరు మీద రిజిస్టర్ అయినట్లుగా అధికారిక రికార్డులు ఉన్నాయి. అయితే ఈ భవనం 1978లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా 40 సెంట్ల భూమిని అటవీశాఖ 99 సంవత్సరాల పాటు బీఎస్ఎన్ఎల్ సంస్థకు లీజుకు ఇచ్చింది. అయితే కేంద్ర సంస్థల అధీనంలో ఉండే ఆస్తులను రాష్ట్రపతి పేరుతోనే రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. అలా అప్పట్లో భారత రాష్ట్రపతి పేరు మీద రిజిస్టర్ అయింది. ఈ మేరకు అధికారిక రికార్డులు కూడా చెబుతున్నాయి. దీంతో ఇప్పటికీ ఆ భవనం రాష్ట్రపతి భవన్గానే పిలువబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఎక్స్ఛేంజ్, కార్యాలయం కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Sanae Takaichi: జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి ఎన్నిక.. ఊహించని మెజారిటీతో గెలుపు
ప్రారంభంలో శబరిమలలో 30 కనెక్షన్లతో బీఎస్ఎన్ఎల్ కార్యకలాపాలు ప్రారంభించింది. కేవలం లక్ష రూపాయుల ఖర్చుతో నిర్మాణం చేపట్టారు. ఏడాది పొడవునా ఇక్కడ కార్యాలయం కొనసాగుతుంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రల కాలంలో కమ్యూనికేషన్ను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అత్యుత్తమ పని తీరుతో కస్టమర్లకు సేవలు అందిస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి నాలుగు రోజుల పాటు కేరళలోని తిరువనంతపురంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయం, శివగిరి సందర్శన, రాజ్భవన్లో మాజీ రాష్ట్రపతి కే.ఆర్.నారాయణన్ విగ్రహా ఆవిష్కరణ, రెండు కళాశాల్లో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
PM Kisan Yojana: రైతులకు అలెర్ట్.. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడవు!
-
Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
-
Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకరండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
-
Donald Trump: “నీకు పిచ్చి పట్టింది, నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి” నెతన్యాహుపై ట్రంప్ ఫైర్
-
Italy Earthquake: ఇటలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!