జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బృందం కెనడాకు చేరుకుంది. ఈ బృందం SFJ, ఖలిస్థాన్, సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) వంటి సంస్థలకు మద్దతూనిస్తూ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే సంస్థలకు వస్తున్న నిధులు, వాటిని సమకూరుస్తున్న వివిధ సంస్థలు (NGO) పై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. దీన్లో భాగంగానే శుక్రవారం NIA బృందం కెనడాకు చేరుకుంది. నాలుగు రోజుల పర్యటనలో విదేశీ సంస్థలతో ఈ వేర్పాటువాద సంస్థల సంబంధాలపై ముగ్గురు సభ్యుల NIA బృం దం దర్యాప్తు చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ బృందా నికి ఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్నారు.
NIA రాడార్లోని సంస్థలలో SFJ, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ ఉన్నాయి. కెనడా, UK, USA, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ జర్మనీల నుండి వారి విదేశి నిధుల మార్గాలను పరిశీలించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడా ది ప్రారంభంలో, ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులను ప్రేరేపిం చడానికి, గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై ఖలిస్థాన్ జెండాను ఎగురవేసే వారికి సిక్కు ఫర్ జస్టిస్(SFJ) 2.5 లక్షల యూఎస్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. SFJ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్ను, ఒక వీడియోలో, రైతుల నిరసనను 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లతో ముడిపెట్టడానికి ప్రయత్నించాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.