Amit Shah: ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగిసిపోలేదు.. మా పోరాటాన్ని కొనసాగిస్తాం!
- పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన కేంద్రమంత్రి అమిత్ షా..
- దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనే సంకల్పంతో చేస్తున్నాం..
- ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగిసిపోలేదు.. మా పోరాటాన్ని కొనసాగిస్తాం: అమిత్ షా
Amit Shah: భారతదేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచి పెట్టాలనే సంకల్పంతో తమ సర్కార్ పని చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేసేందుకు మా బలగాలు గత పదేళ్లుగా కృషి చేస్తున్నాయి.. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగిసిపోలేదన్నారు. డ్రగ్స్, భారత వ్యతిరేక చర్యలు, ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టడానికి ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ టార్గెట్ అని అమిత్ షా చెప్పుకొచ్చారు.
Read Also: Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వార్ రహస్య బంకర్లో భారీగా డబ్బు, వ్యక్తిగత షవర్
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇక, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని రక్షించడానికి 36, 468 మంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారు.. వారి త్యాగాల వల్లే దేశం సురక్షితంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. గత ఏడాది కాలంలో దాదాపు 216 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారన్నారు. వీరి త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని చెప్పారు. మా పదేళ్ల పాలనలో జమ్ము కశ్మీర్, వామపక్ష అతివాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొంది అని పేర్కొన్నారు. అయినా మా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కాశ్మీర్లో డ్రగ్స్, సైబర్ నేరాలు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించేందు కుట్రలు, చొరబాట్లకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని అమిత్ షా వెల్లడించారు. అయితే, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకుకేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. 1959లో లడఖ్లో చైనా సైనికులు జరిపిన ఆకస్మిక దాడిలో చనిపోయిన పోలీసులు, ఇతర అధికారుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!