Amit Shah: ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగిసిపోలేదు.. మా పోరాటాన్ని కొనసాగిస్తాం!
- పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన కేంద్రమంత్రి అమిత్ షా..
- దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనే సంకల్పంతో చేస్తున్నాం..
- ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగిసిపోలేదు.. మా పోరాటాన్ని కొనసాగిస్తాం: అమిత్ షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: భారతదేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచి పెట్టాలనే సంకల్పంతో తమ సర్కార్ పని చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేసేందుకు మా బలగాలు గత పదేళ్లుగా కృషి చేస్తున్నాయి.. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగిసిపోలేదన్నారు. డ్రగ్స్, భారత వ్యతిరేక చర్యలు, ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టడానికి ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ టార్గెట్ అని అమిత్ షా చెప్పుకొచ్చారు.
Read Also: Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వార్ రహస్య బంకర్లో భారీగా డబ్బు, వ్యక్తిగత షవర్
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఇక, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని రక్షించడానికి 36, 468 మంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారు.. వారి త్యాగాల వల్లే దేశం సురక్షితంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. గత ఏడాది కాలంలో దాదాపు 216 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారన్నారు. వీరి త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని చెప్పారు. మా పదేళ్ల పాలనలో జమ్ము కశ్మీర్, వామపక్ష అతివాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొంది అని పేర్కొన్నారు. అయినా మా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కాశ్మీర్లో డ్రగ్స్, సైబర్ నేరాలు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించేందు కుట్రలు, చొరబాట్లకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని అమిత్ షా వెల్లడించారు. అయితే, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకుకేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. 1959లో లడఖ్లో చైనా సైనికులు జరిపిన ఆకస్మిక దాడిలో చనిపోయిన పోలీసులు, ఇతర అధికారుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!