Amit Shah: ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగిసిపోలేదు.. మా పోరాటాన్ని కొనసాగిస్తాం!
- పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన కేంద్రమంత్రి అమిత్ షా..
- దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనే సంకల్పంతో చేస్తున్నాం..
- ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగిసిపోలేదు.. మా పోరాటాన్ని కొనసాగిస్తాం: అమిత్ షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: భారతదేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచి పెట్టాలనే సంకల్పంతో తమ సర్కార్ పని చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేసేందుకు మా బలగాలు గత పదేళ్లుగా కృషి చేస్తున్నాయి.. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగిసిపోలేదన్నారు. డ్రగ్స్, భారత వ్యతిరేక చర్యలు, ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టడానికి ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ టార్గెట్ అని అమిత్ షా చెప్పుకొచ్చారు.
Read Also: Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వార్ రహస్య బంకర్లో భారీగా డబ్బు, వ్యక్తిగత షవర్
Also Read
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
ఇక, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని రక్షించడానికి 36, 468 మంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారు.. వారి త్యాగాల వల్లే దేశం సురక్షితంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. గత ఏడాది కాలంలో దాదాపు 216 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారన్నారు. వీరి త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని చెప్పారు. మా పదేళ్ల పాలనలో జమ్ము కశ్మీర్, వామపక్ష అతివాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొంది అని పేర్కొన్నారు. అయినా మా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కాశ్మీర్లో డ్రగ్స్, సైబర్ నేరాలు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించేందు కుట్రలు, చొరబాట్లకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని అమిత్ షా వెల్లడించారు. అయితే, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకుకేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. 1959లో లడఖ్లో చైనా సైనికులు జరిపిన ఆకస్మిక దాడిలో చనిపోయిన పోలీసులు, ఇతర అధికారుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది.
తాజావార్తలు
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!