Shashi Tharoor: రాహుల్ గాంధీతో విభేదిస్తున్న కాంగ్రెస్ ఎంపీలు.. ముందున్న శశిథరూర్..
- ట్రంప్ ‘‘డెడ్ ఎకానమీ’’ వ్యాఖ్యల్ని సమర్థించిన రాహుల్ గాంధీ..
- విభేదిస్తున్న కాంగ్రెస్ ఎంపీలు..
- రాహుల్ వ్యాఖ్యలపై శశిథరూర్ పరోక్ష స్పందన..
Shashi Tharoor: భారతదేశంపై 25 శాతం సుంకాలను విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇదే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను ‘‘చనిపోయిన ఆర్థిక వ్యవస్థ’’గా అభివర్ణించాడు. అయితే, ట్రంప్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ సమర్థించాడు. భారత ఆర్థిక వ్యవస్థ ‘‘డెడ్ ఎకానమీ’’ అని రాహుల్ గాంధీ చెప్పడంపై పలువురు కాంగ్రెస్ ఎంపీలు విభేదిస్తున్నారు. రాహుల్ వ్యాఖ్యలు చేసిన ఒక రోజు తర్వాత కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ.. ‘‘ట్రంప్ వ్యాఖ్యలు నిజం కాదని మనందరికి తెలుసు’’ అని ట్రంప్ వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు ఆయన చెప్పారు.
ట్రంప్ గురువారం భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.భారతదేశం రష్యాతో ఏమి చేస్తుందో నాకు పట్టింపు లేదు. వారు తమ చనిపోయిన ఆర్థిక వ్యవస్థలను కలిసి తగ్గించుకోవచ్చు, నాకు ముఖ్యం. మేము భారతదేశంతో చాలా తక్కువ వ్యాపారం చేసాము, వారి సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్రపంచంలోనే అత్యధికం. అదేవిధంగా, రష్యా మరియు USA కలిసి దాదాపు ఎటువంటి వ్యాపారం చేయవు. దానిని అలాగే ఉంచుదాం,” అని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు.
Also Read
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
- Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
Read Also: CM Chandrababu: అన్నదాతలకు సీఎం గుడ్న్యూస్.. రేపటి నుంచే ఒక్కో రైతుకు రూ. 20 వేలు..
ఈ వ్యాఖ్యలపై తాను ఏకీభవిస్తున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. ‘‘ట్రంప్ చెప్పింది అంతా నిజమే. ప్రధాని, ఆర్థిక మంత్రికి తప్పా ఈ విషయం అందరికి తెలుసు. ఆయన నిజం చెప్పినందుకు ఆనందంగా ఉంది’’ అని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం శుక్రవారం మాట్లాడుతూ.. ట్రంప్ సంప్రదాయేతర రాజకీయ నాయకుడు అని అన్నారు. భారత్, అమెరికా ప్రజల మధ్య మంచి సంబంధాల ఉన్నాయి. దీర్ఘకాలంలో ఈ సంబంధాలు దెబ్బతినవు అని ఆయన అన్నారు. రాజ్యసభ ఎంపీ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. మన ఆర్థిక వ్యవస్థ ఏ మాత్రం బలహీనంగా లేదని, ఎవరైనా మనల్ని ఆర్థికంగా అంతం చేయాలనుకుంటే అది అపార్థమే అవుతుందని, ట్రంప్ భ్రమల్లో జీవిస్తున్నారని అన్నారు.
#WATCH | Delhi: On the arrest of two Malayali nuns in Chhattisgarh, Congress MP from Thiruvananthapuram, Shashi Tharoor says, "The arrest of nuns is grave injustice. They have not done anything against the law. They were just taking some tribal girls to the city for employment.… pic.twitter.com/EV02otczWG
— ANI (@ANI) August 1, 2025
తాజావార్తలు
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
-
Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా ‘మెగా’ దాడి.. 666 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం!
-
Akshay Kumar: అక్షయ్ కుమార్ కుమార్తెకు సైబర్ వేధింపులు.. నిందితుడు అరెస్ట్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!