Pahalgam Terror attack: పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు.. టెర్రరిస్టుల ఎలా వచ్చారంటే..?
- పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక విషయాలు..
- 22 గంటలు కఠినమైన భూభాగాల గుండా పహల్గామ్కి..
- ఉగ్రదాడిలో ముగ్గురు పాకిస్తానీలు, ఒక లోకల్ ఉగ్రవాది..
Pahalgam Terror attack: 26 మంది టూరిస్టుల ప్రాణాలను తీసిన పహల్గామ్ ఉగ్ర దాడిలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదుల ప్లానింగ్, వారికి సాయం చేసిన వారి గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కీలక సమాచారాన్ని వెలికి తీశాయి. ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు, ఒకరు స్థానిక ఉగ్రవాది దాడిలో పాల్గొన్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రకారం, ఉగ్రవాదులు K-47, M4 రైఫిల్స్ వాడినట్లు తెలిసింది. అత్యంత క్లిష్టతరమైన హిమాలయాలు, దట్టమైన అరణ్యాల్లో గంటల కొద్ది ప్రయాణించి పహల్గామ్ చేరినట్లు తెలుస్తోంది. కొకెర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయకు దాదాపు 20-22 గంటల కష్టతరమైన భూభాగం గుండా నడిచి వచ్చి ప్రాణాంతక దాడిని అమలు పరిచినట్లు తెలుస్తోంది.
దాడి సమయంలో ఉగ్రవాదులు రెండు మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. ఒకటి స్థానికుడి కాగా, మరొకటి పర్యాటకుడి. స్థానిక ఉగ్రవాదిని ఆదిల్ థోకర్గా భద్రతా బలగాలు గుర్తించాయి. థోకర్ 2018లో హిజ్బుల్ ముజాహిదీన్లో చేరాడు. పాకిస్తాన్ వెళ్లి ట్రైనింగ్ పొందాడు. 2024లో కాశ్మీర్ లోయకు తిరిగి వచ్చే ముందు లష్కరే తోయిబాతో యుద్ధ శిక్షణ పొందాడు. తిరిగి వచ్చినప్పటి నుంచి థోకర్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు లాజిస్టిక్ సాయం అందిస్తున్నాడు. కాశ్మీర్ భౌగోలిక స్వరూపంపై ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చాడు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
పహల్గామ్ దాడి సమయంలో దుకాణాల వెనుక నుంచి ఇద్దరు ఉగ్రవాదులు బాధితులను పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి నలుగురిని కాల్చి చంపారు. దీనికి ముందు వారిని కల్మా పఠించమని ఆదేశించినట్లు తెలుస్తోంది. కాల్పులతో ఒక్కసారిగా పర్యాటకులు భద్రత కోసం అన్ని దిశల్లో పరుగులు తీశారు. అదే సమయంలో జిప్ లైన్ ప్రాంతం దగ్గర ఉన్న మరో ఇద్దర ఉగ్రవాదులు కాల్పులు జరిపి రక్తపాతాన్ని మరింత తీవ్రం చేసినట్లు తెలుస్తోంది.
ఘటన సమయంలో స్థానిక ఫోటో గ్రాఫర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనను ఆయన రికార్డ్ చేయగలిగాడు. ఇది ఇప్పుడు భద్రతా బలగాల దర్యాప్తుకు కీలకంగా మారింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారిస్తోంది. సీన్ రికన్స్ట్రక్షన్ చేయడానికి ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. లోయలోకి ఉగ్రవాదులు ఎలా ప్రవేశించారు, పారిపోయారనే విషయాలను నిశితంగా గనిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!