Pahalgam terror attack: ‘‘హిందువునని గర్వంగా ప్రాణత్యాగం చేశాడు’’.. నా భర్తకు అమరవీరుడి హోదా ఇవ్వండి..
- ‘‘ హిందువని గర్వంగా ప్రాణత్యాగం చేశారు’’..
- నా భర్తకు ‘‘అమరవీరుడి’’హోడా ఇవ్వాలి..
- శుభం ద్వివేది భార్య అశాన్య డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడి బాధితుల్ని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. అప్పటి వరకు ప్రకృతిని, కాశ్మీర్ అందాలను చూస్తూ సంతోషంగా ఉన్న వారిని టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్నారు. క్షణాల్లో వారి ఆనందాన్ని విషాదంగా మార్చారు. ముఖ్యంగా, హిందువుల్ని టార్గెట్ చేస్తూ దాడికి తెగబడ్డారు. లష్కరే తోయిబా అనుబంధ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ఉగ్రసంస్థ జరిపిన దాడిలో 26 మంది మరణించారు.
పహల్గామ్ దాడి బాధితుడు శుభం ద్వివేది భార్య అశాన్య ద్వివేది తన భర్తకు ‘‘అమరవీరుడి’’ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ద్వివేది తనను తానున హిందువుగా గర్వంగా ప్రాణ త్యాగం చేసి ఇతరుల్ని రక్షించారని ఆమె అన్నారు. మొదటి బుల్లెట్ తన భర్తకు తగిలిందని, ఉగ్రవాదులు హిందువులు, ముస్లింలా అని అడగటానికి సమయం తీసుకున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది పరిగెత్తి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సమయం ఉందని అని అశాన్య శనివారం తెలిపారు.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
Read Also: Terror attack: కెనడాలో జనాలపైకి దూసుకెళ్లిన కారు.. ఉగ్రదాడిగా అనుమానం..
పహల్గామ్ పచ్చిక మైదానాలను చూస్తున్న సమయంలో ఉగ్రవాదులు అమాయకపు టూరిస్టులపై దాడికి పాల్పడ్డారు. వీరిలో శుభం ద్వివేది కూడా ఉన్నారు. శుభం, అశాన్యకు ఫిబ్రవరి 12న వివాహం జరిగింది. ఇంతలోనే ఉగ్రదాడిలో శుభం మరణించారు. ఆయన అంత్యక్రియాలు స్వగ్రామంలో గురువారం జరిగాయి. ప్రభుత్వం తన డిమాండ్ని అంగీకరిస్తే తాను జీవించడానికి ఒక కారణం ఉంటుందని అశాన్య చెప్పింది.
ఉగ్రవాదులు శుభంని హిందువా..? ముస్లిమా..? అని అడిగిన సమయంలో ఫ్రాంక్ చేస్తున్నారని తాను భావించినట్లు అశాన్య చెప్పింది. “వారు వచ్చిన వెంటనే, వారిలో ఒకరు మేము హిందువులమా లేక ముస్లింలమా అని అడిగారు? ఆ వ్యక్తులు (ఉగ్రవాదులు) ఫ్రాంక్ చేస్తున్నారని నేను అనుకున్నాను. నేను వెనక్కి తిరిగి, నవ్వి, ఏమి జరుగుతుందో అడిగాను. అప్పుడు వారు తమ ప్రశ్నను మళ్లీ అడిగారు. మేము హిందువులమని నేను సమాధానం ఇచ్చిన వెంటనే, కాల్పులు జరిగాయి . శుభమ్ ముఖం రక్తంతో కప్పబడి ఉంది. ఏమి జరిగిందో నాకు అర్థం కాలేదు” అని ఆమె చెప్పింది. తనను కాల్చి చంపాలని ఉగ్రవాదుల్ని వేడుకున్నానని, కానీ అందుకు వారు నిరాకరించి, మీ ప్రభుత్వానికి తాము ఏం చేశామో చెప్పేందుకు బతికే ఉండాలని చెప్పారని అశాన్య చెప్పింది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!