Terror Attack: ఉగ్రదాడిలో 27 మంది మృతి?.. మరణించిన వారిలో ఇజ్రాయెల్, ఇటాలియన్ టూరిస్టులు!
- జమ్ము కాశ్మీర్ ఉగ్రదాడిలో 27 మంది మృతి?..
- మరణించిన వారిలో ఇజ్రాయెల్, ఇటాలియన్ టూరిస్టులు!
- ఉగ్ర దాడిని ఖండించిన ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terror Attack: జమ్ము కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్లోని బైసరన్ లోయను చూసేందుకు వచ్చిన పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగ బడ్డారు. ఈ ఉగ్ర దాడిలో మృతుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు సుమారు 27 మంది టూరిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనలో గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా చికిత్స కోసం తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే, మృతుల్లో ఇజ్రాయెల్, ఇటాలియన్ దేశాలకు చెందిన పలువురు పర్యటకులు ఉన్నారు.
Read Also: Tilak Varma: నేను ఉంటే గెలిపించేవాడిని.. తిలక్ వర్మ హాట్ కామెంట్స్
Also Read
అయితే, జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిపై ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా స్పందించారు. అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుందని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని రాసుకొచ్చారు. బాధిత కుటుంబాలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భద్రతా దళాలకు మా మద్దతు ఉంది అని భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ వెల్లడించారు.
Read Also: Pahalgam terror attack: ‘‘వెళ్లి మోడీకి చెప్పండి’’.. పహల్గామ్ దాడి తర్వాత టెర్రరిస్టుల పైశాచికం..
మరోవైపు, ఈ ఉగ్ర దాడిలో హిందువులను గుర్తించి మరి చంపేసినట్లు తేలింది. సుమారు 27 మందికి పైగా మృతి చెందారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంది. ప్రధాని మోడీ ఆదేశాలో హుటాహుటిన జమ్మూ కాశ్మీర్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బయలుదేరి వెళ్లిపోయారు. ఉగ్రవాదుల ఏరివేతపై ప్రత్యేక కార్యాచరణను కేంద్రం సిద్ధం చేయనుంది.
Ambassador of Israel to India, Reuven Azar tweets, "Sad and appalled following the terrorist attack in J&K which took the lives of innocent civilians. Our thoughts are with the victims and their families, and our support is for the security forces in their struggle against… pic.twitter.com/TIkIWSmIKV
— ANI (@ANI) April 22, 2025
తాజావార్తలు
-
Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
-
Shubman Gill History: చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటి కెప్టెన్!
-
లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
-
Dragon : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసెంబర్ దాకా ఆగాల్సిందే!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!