Tension in Haridwar: హరిద్వార్లో ఉద్రిక్తత.. బజరంగ్ దళ్ నిర్వహిస్తున్న ర్యాలీపై రాళ్ల దాడి
- ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జ్వాలాపూర్లో తీవ్ర ఉద్రిక్తత..
- బజరంగ్ దళం నిర్వహించిన శౌర్య యాత్రపై రాళ్లు రువ్విన దుండగులు..
- నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tension in Haridwar: ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జ్వాలాపూర్ ప్రాంతంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బజరంగ్ దళం నిర్వహించిన శౌర్య యాత్రపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే భారీ పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బజరంగ్ దళ కార్యకర్తలకు పోలీసులు హామీ ఇచ్చారు.
Read Also: Debit Card: వీసా, రూపే, మాస్టర్ ATM కార్డ్ లలో.. ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందంటే?
Also Read
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
అయితే, సాయంత్రం హరిద్వార్లోని మూడు ప్రాంతాల నుంచి శౌర్య యాత్రలు నిర్వహించారు. ఈ యాత్ర జ్వాలాపూర్లోని రాం చౌక్కు చేరుకున్న వెంటనే రాళ్ల దాడి జరిగింది. ఇదే సమయంలో కొంతమంది కార్యకర్తలు ఒక బుల్డోజర్తో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుందని తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. సంఘటన ప్రదేశానికి భారీగా బలగాలను మోహరించి అక్కడ పరిస్థితిని నియంత్రించారు. ఇక, హరిద్వార్ సిటీ ఎస్పీ అభయ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. ఈ సంఘటనకు సంబంధించిన దుండగులపై కేసు నమోదు చేశాం.. వీడియోల ద్వారా ఆధారాలను సేకరించి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Read Also: Surya : మూడు భాషలు.. ముగ్గురు దర్శకులు.. సూర్య సౌత్ స్కెచ్ మాములుగా లేదుగా
ఇక, బజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు అనుజ్ వాలియా మాట్లాడుతూ.. యాత్ర రాం చౌక్కు చేరుకున్నప్పుడు కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారని ఆరోపించారు. హరిద్వార్లో చట్టం- ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. బజరంగ్ దళ్ చేపట్టిన ర్యాలీపై దాడులు జరగడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
తాజావార్తలు
-
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
-
Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
-
Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!