Telegram: టెలిగ్రామ్కు బిగుస్తున్న ఉచ్చు.. “డార్క్వెబ్”గా మారిందన్న కేంద్రం..
- టెలిగ్రామ్ను "కొత్త డార్క్ వెబ్"గా అభివర్ణించిన కేంద్ర ప్రభుత్వం.
- బాలల అశ్లీల కంటెంట్, ఉగ్రవాద ప్రచారం ఆరోపణలు.
- NEET పేపర్ లీకులు, సైబర్ మోసాలకు వేదికగా మారిందని వ్యాఖ్య.
- ఆధార్, మొబైల్ డేటా విక్రయాలకు సంబంధించిన బాట్లపై ఆందోళన.
- ఢిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telegram: టెలిగ్రామ్కు ఉచ్చు బిగుస్తోంది. కేంద్ర ప్రభుత్వం మెసేజింగ్ ఫ్లాట్ఫారమ్పై తీవ్ర ఆరోపణలు చేసింది. నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో పరీక్ష పూర్తయ్యే వరకు టెలిగ్రామ్పై కేంద్ర బ్యాన్ విధించింది. ఈ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి ప్రతిగా ఈ యాప్ ‘‘డార్క్ వెబ్’’గా మారిందంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇది ప్రభుత్వం నుంచి తప్పించుకోవడానికి సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులు, ఇతర ప్రమాదకారులు దీనిని ఎక్కువగా వాడుతున్నారని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. నేరపూరిత నెట్వర్క్లు, తీవ్రవాద గ్రూపుల ద్వారా టెలిగ్రామ్ దుర్వినియోగం పెరుగుతోందని కేంద్రం వివరించింది.
నీట్ వంటి లీకైన పరీక్ష పత్రాల వ్యాప్తి, సైబర్ మోసాలు, ఉగ్రవాద సంబంధిత ప్రచారం, బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన మెటీరియల్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆర్థిక నేరాలతో సహా అనేక రకాల చట్టవిరుద్ధ కార్యకలాపాలకు టెలిగ్రామ్ ఒక కీలక వేదికగా మారిందని ప్రభుత్వం ఆరోపించింది. టెలిగ్రామ్ గ్రూపులు, ఛానెళ్ల ద్వారా ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కంటెంట్, తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని కేంద్రం ఆరోపించింది. సామాజిక అశాంతి సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని కోర్టుకు వెల్లడించింది. టెలిగ్రామ్లో ప్రైవసీ ఫీచర్ల ద్వారా నేరపూరిత నెట్వర్క్లను అధికారులు గుర్తించడం కష్టంగా మారిందని కేంద్రం తెలిపింది.
Also Read
- Supreme Court: విద్యార్థి నిరసనకారులకు ఊరట.. మైనర్లు, నేర చరిత్ర లేని వారిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
- Parliament Monsoon Session 2026: నేటి నుంచి సజావుగా పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఓం బిర్లా చొరవతో తొలగిన ప్రతిష్టంభన
- Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
- Instagram: భారత్లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
టెలిగ్రామ్ ఛానెల్లు, గ్రూపుల ద్వారా బాలల లైంగిక దోపిడీ, దుర్వినియోగం(CSEAM) ఎక్కువ అవుతోందని కేంద్రం పేర్కొంది. టెలిగ్రామ్ ద్వారా నకిలీ అకౌంట్లు సృష్టించి సైబన్ మోసాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం తెలిపింది. ఆధార్ వివరాలు, మొబైల్ నెంబర్లు, వ్యక్తిగత సమాచారం వంటి డేటాను విక్రయించే బాట్లు కూడా టెలిగ్రామ్లో పనిచేస్తేన్నాయని ఆరోపించింది. సైబర్ నేరాల కోసం మ్యూల్ బ్యాంక్ అకౌంట్ల కొనుగోలు, అమ్మకాలు కూడా టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్నాయని వెల్లడించింది. కొన్ని ఛానెళ్లు మాల్వేర్, హ్యాకింగ్ టూల్స్, భద్రతా వ్యవస్థల్ని తప్పుంచుకునే సాఫ్ట్వేర్లను వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రం పేర్కొంది. కొన్ని ఆండ్రాయిడ్ యాప్లు టెలిగ్రామ్ కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్గా ఉపయోగించి యూజర్ల డేటాను దొంగిలిస్తున్నాయని తెలిపింది. సినిమాలు, వెబ్ సిరీస్లు, ఇతర కాపీరైట్ కంటెంట్ను అక్రమంగా వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం ఆరోపించింది.
తాజావార్తలు
-
Chennai Love Story:’చెన్నై లవ్ స్టోరీ’ గ్రాండ్ సక్సెస్ మీట్.. కిరణ్ అబ్బవరం ఎమోషనల్, నాగచైతన్యకు ప్రత్యేక కృతజ్ఞతలు!
-
Uday Krishna Reddy: నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఆరోపణలు అన్నీ అవాస్తవం.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా!
-
Super El Nino: ఊహకందని విపత్తు… మానవాళికి ముప్పు తప్పదా?
-
Japan Earthquake: జపాన్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదు, సునామీ హెచ్చరికలు జారీ
-
Vaibhav Sooryavanshi: డాన్ బ్రాడ్మన్తో వైభవ్ సూర్యవంశీకి పోలిక.. మాజీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!