Telegram: టెలిగ్రామ్కు బిగుస్తున్న ఉచ్చు.. “డార్క్వెబ్”గా మారిందన్న కేంద్రం..
- టెలిగ్రామ్ను "కొత్త డార్క్ వెబ్"గా అభివర్ణించిన కేంద్ర ప్రభుత్వం.
- బాలల అశ్లీల కంటెంట్, ఉగ్రవాద ప్రచారం ఆరోపణలు.
- NEET పేపర్ లీకులు, సైబర్ మోసాలకు వేదికగా మారిందని వ్యాఖ్య.
- ఆధార్, మొబైల్ డేటా విక్రయాలకు సంబంధించిన బాట్లపై ఆందోళన.
- ఢిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telegram: టెలిగ్రామ్కు ఉచ్చు బిగుస్తోంది. కేంద్ర ప్రభుత్వం మెసేజింగ్ ఫ్లాట్ఫారమ్పై తీవ్ర ఆరోపణలు చేసింది. నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో పరీక్ష పూర్తయ్యే వరకు టెలిగ్రామ్పై కేంద్ర బ్యాన్ విధించింది. ఈ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి ప్రతిగా ఈ యాప్ ‘‘డార్క్ వెబ్’’గా మారిందంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇది ప్రభుత్వం నుంచి తప్పించుకోవడానికి సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులు, ఇతర ప్రమాదకారులు దీనిని ఎక్కువగా వాడుతున్నారని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. నేరపూరిత నెట్వర్క్లు, తీవ్రవాద గ్రూపుల ద్వారా టెలిగ్రామ్ దుర్వినియోగం పెరుగుతోందని కేంద్రం వివరించింది.
నీట్ వంటి లీకైన పరీక్ష పత్రాల వ్యాప్తి, సైబర్ మోసాలు, ఉగ్రవాద సంబంధిత ప్రచారం, బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన మెటీరియల్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆర్థిక నేరాలతో సహా అనేక రకాల చట్టవిరుద్ధ కార్యకలాపాలకు టెలిగ్రామ్ ఒక కీలక వేదికగా మారిందని ప్రభుత్వం ఆరోపించింది. టెలిగ్రామ్ గ్రూపులు, ఛానెళ్ల ద్వారా ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కంటెంట్, తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని కేంద్రం ఆరోపించింది. సామాజిక అశాంతి సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని కోర్టుకు వెల్లడించింది. టెలిగ్రామ్లో ప్రైవసీ ఫీచర్ల ద్వారా నేరపూరిత నెట్వర్క్లను అధికారులు గుర్తించడం కష్టంగా మారిందని కేంద్రం తెలిపింది.
Also Read
- Ahmedabad Serial Blasts Case: వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. 38 మందికి ఉరిశిక్ష ఖరారు
- Women Financial Assistance: మహిళలకు గుడ్ న్యూస్.. ఇక, నెలకు రూ.2,500.. అర్హతలు ఇవే..
- Organ Donation: యాక్సిడెంట్.. బ్రెయిన్ డెడ్.! ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన 7 ఏళ్ల 'యశ్వన్'.!
- E25 Petrol in India: భారత ఇంధన రంగంలో మరో భారీ మార్పు.. E20 తర్వాత E21, E25..
టెలిగ్రామ్ ఛానెల్లు, గ్రూపుల ద్వారా బాలల లైంగిక దోపిడీ, దుర్వినియోగం(CSEAM) ఎక్కువ అవుతోందని కేంద్రం పేర్కొంది. టెలిగ్రామ్ ద్వారా నకిలీ అకౌంట్లు సృష్టించి సైబన్ మోసాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం తెలిపింది. ఆధార్ వివరాలు, మొబైల్ నెంబర్లు, వ్యక్తిగత సమాచారం వంటి డేటాను విక్రయించే బాట్లు కూడా టెలిగ్రామ్లో పనిచేస్తేన్నాయని ఆరోపించింది. సైబర్ నేరాల కోసం మ్యూల్ బ్యాంక్ అకౌంట్ల కొనుగోలు, అమ్మకాలు కూడా టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్నాయని వెల్లడించింది. కొన్ని ఛానెళ్లు మాల్వేర్, హ్యాకింగ్ టూల్స్, భద్రతా వ్యవస్థల్ని తప్పుంచుకునే సాఫ్ట్వేర్లను వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రం పేర్కొంది. కొన్ని ఆండ్రాయిడ్ యాప్లు టెలిగ్రామ్ కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్గా ఉపయోగించి యూజర్ల డేటాను దొంగిలిస్తున్నాయని తెలిపింది. సినిమాలు, వెబ్ సిరీస్లు, ఇతర కాపీరైట్ కంటెంట్ను అక్రమంగా వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం ఆరోపించింది.
తాజావార్తలు
-
Naga Vamsi: ‘పెద్ది’ కోసమే సైలెంట్ అయ్యా.. లేదంటే కావాలనే చేశాననేవారు.. అసలు విషయం చెప్పేసిన నాగవంశీ!
-
Minister Kolusu Parthasarathy: ఏపీలో పేదలకు శుభవార్త.. 9 లక్షలకు పైగా ఇళ్ల దరఖాస్తులకు అర్హత
-
VenkyAnil5: సెట్స్పైకి వెంకటేష్.. #VenkyAnil5 షూటింగ్ కు మరింత ఊపు.. కీలక షెడ్యూల్ షురూ!
-
Sanju Samson: సంజు శాంసన్కు బైబై చెప్పేశారా..? మౌనం వీడిన బీసీసీఐ
-
AA23 Update: లోకేష్ స్టైల్ రెడీ.. అల్లు అర్జున్ అభిమానులకు త్వరలో బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!