Telegram: టెలిగ్రామ్కు బిగుస్తున్న ఉచ్చు.. “డార్క్వెబ్”గా మారిందన్న కేంద్రం..
- టెలిగ్రామ్ను "కొత్త డార్క్ వెబ్"గా అభివర్ణించిన కేంద్ర ప్రభుత్వం.
- బాలల అశ్లీల కంటెంట్, ఉగ్రవాద ప్రచారం ఆరోపణలు.
- NEET పేపర్ లీకులు, సైబర్ మోసాలకు వేదికగా మారిందని వ్యాఖ్య.
- ఆధార్, మొబైల్ డేటా విక్రయాలకు సంబంధించిన బాట్లపై ఆందోళన.
- ఢిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telegram: టెలిగ్రామ్కు ఉచ్చు బిగుస్తోంది. కేంద్ర ప్రభుత్వం మెసేజింగ్ ఫ్లాట్ఫారమ్పై తీవ్ర ఆరోపణలు చేసింది. నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో పరీక్ష పూర్తయ్యే వరకు టెలిగ్రామ్పై కేంద్ర బ్యాన్ విధించింది. ఈ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి ప్రతిగా ఈ యాప్ ‘‘డార్క్ వెబ్’’గా మారిందంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇది ప్రభుత్వం నుంచి తప్పించుకోవడానికి సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులు, ఇతర ప్రమాదకారులు దీనిని ఎక్కువగా వాడుతున్నారని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. నేరపూరిత నెట్వర్క్లు, తీవ్రవాద గ్రూపుల ద్వారా టెలిగ్రామ్ దుర్వినియోగం పెరుగుతోందని కేంద్రం వివరించింది.
నీట్ వంటి లీకైన పరీక్ష పత్రాల వ్యాప్తి, సైబర్ మోసాలు, ఉగ్రవాద సంబంధిత ప్రచారం, బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన మెటీరియల్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆర్థిక నేరాలతో సహా అనేక రకాల చట్టవిరుద్ధ కార్యకలాపాలకు టెలిగ్రామ్ ఒక కీలక వేదికగా మారిందని ప్రభుత్వం ఆరోపించింది. టెలిగ్రామ్ గ్రూపులు, ఛానెళ్ల ద్వారా ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కంటెంట్, తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని కేంద్రం ఆరోపించింది. సామాజిక అశాంతి సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని కోర్టుకు వెల్లడించింది. టెలిగ్రామ్లో ప్రైవసీ ఫీచర్ల ద్వారా నేరపూరిత నెట్వర్క్లను అధికారులు గుర్తించడం కష్టంగా మారిందని కేంద్రం తెలిపింది.
Also Read
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్కు త్రిషా కృష్ణన్.. విజయ్తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- BRICS Summit 2026: మోడీ-జిన్పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
టెలిగ్రామ్ ఛానెల్లు, గ్రూపుల ద్వారా బాలల లైంగిక దోపిడీ, దుర్వినియోగం(CSEAM) ఎక్కువ అవుతోందని కేంద్రం పేర్కొంది. టెలిగ్రామ్ ద్వారా నకిలీ అకౌంట్లు సృష్టించి సైబన్ మోసాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం తెలిపింది. ఆధార్ వివరాలు, మొబైల్ నెంబర్లు, వ్యక్తిగత సమాచారం వంటి డేటాను విక్రయించే బాట్లు కూడా టెలిగ్రామ్లో పనిచేస్తేన్నాయని ఆరోపించింది. సైబర్ నేరాల కోసం మ్యూల్ బ్యాంక్ అకౌంట్ల కొనుగోలు, అమ్మకాలు కూడా టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్నాయని వెల్లడించింది. కొన్ని ఛానెళ్లు మాల్వేర్, హ్యాకింగ్ టూల్స్, భద్రతా వ్యవస్థల్ని తప్పుంచుకునే సాఫ్ట్వేర్లను వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రం పేర్కొంది. కొన్ని ఆండ్రాయిడ్ యాప్లు టెలిగ్రామ్ కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్గా ఉపయోగించి యూజర్ల డేటాను దొంగిలిస్తున్నాయని తెలిపింది. సినిమాలు, వెబ్ సిరీస్లు, ఇతర కాపీరైట్ కంటెంట్ను అక్రమంగా వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం ఆరోపించింది.
తాజావార్తలు
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!