Uttam Kumar Reddy: రాష్ట్రపతిని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. గిరిజన రిజర్వేషన్లపై వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గిరిజనుల రిజర్వేషన్లు 6శాతం నుంచి 10శాతం పెంచాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. తెలంగాణాలో పోడు భూముల సమస్యపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటవికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినా, ఎటువంటి వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుండడం వల్ల గిరిజనులకు, దళితులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో.. దేశవ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఢిల్లీలో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు.
read also: Bihar Politics: నితీష్ వలస పక్షి, అధికారం కోసం ఏదైనా చేస్తాడు.. బీజేపీ విమర్శలు
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సందర్భంగా రాములునాయక్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజన నాయకులు, ఎంపీలు హాజరయ్యారు. ఈసందర్భంగా.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తెలంగాణకు చెందిన గిరిజన నాయకులు కలిశారు. తెలంగాణలో ఎస్టీలకు రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతం పెంచాలని గిరిజనులు కోరుతున్నారని గత ఎనిమిదేళ్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ గిరిజనుల రిజర్వేషన్లు పెంచకుండా ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని పార్లమెంట్లో చెబుతోందని మండిపడ్డారు.
ఇది తెలంగాణలోని ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, పోడు భూముల సమస్యల పరిష్కారంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కోరారు. తెలంగాణలోని లక్షలాది మంది గిరిజనులు అనేక దశాబ్దాలుగా క్లియరెన్స్ చేసిన అటవీ ప్రాంతాల్లో భూమిని సాగు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వాలు వారికి హక్కులు కల్పించాయి. ఇప్పుడు వివిధ సాకులతో తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను తరిమికొట్టేందుకు క్రూరమైన పోలీసు బలగాలను ఉపయోగిస్తోందని మండిపడ్డారు. అయితే.. 50 శాతానికి అదనంగా ఈబీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారని, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Bihar Politics : శివసేన తరహాలో జేడీయూలో చీలికకు బీజేపీ ప్రయత్నించిందా..?
- Tags
- congress
- delegation
- President
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!