Uttam Kumar Reddy: రాష్ట్రపతిని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. గిరిజన రిజర్వేషన్లపై వినతి
గిరిజనుల రిజర్వేషన్లు 6శాతం నుంచి 10శాతం పెంచాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. తెలంగాణాలో పోడు భూముల సమస్యపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటవికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినా, ఎటువంటి వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుండడం వల్ల గిరిజనులకు, దళితులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో.. దేశవ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఢిల్లీలో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు.
read also: Bihar Politics: నితీష్ వలస పక్షి, అధికారం కోసం ఏదైనా చేస్తాడు.. బీజేపీ విమర్శలు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సందర్భంగా రాములునాయక్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజన నాయకులు, ఎంపీలు హాజరయ్యారు. ఈసందర్భంగా.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తెలంగాణకు చెందిన గిరిజన నాయకులు కలిశారు. తెలంగాణలో ఎస్టీలకు రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతం పెంచాలని గిరిజనులు కోరుతున్నారని గత ఎనిమిదేళ్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ గిరిజనుల రిజర్వేషన్లు పెంచకుండా ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని పార్లమెంట్లో చెబుతోందని మండిపడ్డారు.
ఇది తెలంగాణలోని ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, పోడు భూముల సమస్యల పరిష్కారంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కోరారు. తెలంగాణలోని లక్షలాది మంది గిరిజనులు అనేక దశాబ్దాలుగా క్లియరెన్స్ చేసిన అటవీ ప్రాంతాల్లో భూమిని సాగు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వాలు వారికి హక్కులు కల్పించాయి. ఇప్పుడు వివిధ సాకులతో తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను తరిమికొట్టేందుకు క్రూరమైన పోలీసు బలగాలను ఉపయోగిస్తోందని మండిపడ్డారు. అయితే.. 50 శాతానికి అదనంగా ఈబీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారని, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Bihar Politics : శివసేన తరహాలో జేడీయూలో చీలికకు బీజేపీ ప్రయత్నించిందా..?
- Tags
- congress
- delegation
- President
తాజావార్తలు
-
Couple: 29 ఏళ్ల మహిళ.. 36 ఏళ్ల ప్రియుడిని హోటల్కు పిలిచి.. గదిలో ఇలా..
-
Pawan Kalyan: అధికారులతో చర్చిస్తుండగా తీవ్ర అస్వస్థత.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఆపరేషన్..
-
AP Weather Alert: ఏపీలో డబుల్ అలర్ట్.. రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు.. ఆ జిల్లాల్లో ఎండలు..
-
RCB vs DC: “చిన్నస్వామిలో ‘కిల్లర్’ షో.. ఆర్సీబీ చేతిలో నుంచి మ్యాచ్ను లాగేసుకున్న మిల్లర్.. బెంగళూరుకు షాక్!”
-
CSK Vs SRH: టాస్ గెలిచిన సీఎస్కే.. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. ఇరు జట్లలోకి కొత్త ప్లేయర్లు..
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!