Bihar Politics: ఆర్జేడీ ఘోర పరాజయం, ప్రతిపక్ష నేత పదవిని తిరస్కరించిన తేజస్వీ యాదవ్.!
- బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం..
- ప్రతిపక్ష నేత బాధ్యతలు తీసుకునేందుకు తేజస్వీ నిరాకరణ..
- తండ్రి లాలూ సూచనలతో నిర్ణయం మార్చుకున్న ఆర్జేడీ నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Politics: బీహార్ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిని ముందుండి నడిపించిన, సీఎం అభ్యర్థిగా ఉన్న తేజస్వీ యాదవ్ ఒకానొక దశలో ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది, చివరకు స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ కేవలం 25 సీట్లకు మాత్రమే పరిమితమైంది. మహాఘట్బంధన్ కూటమి కేవలం 35 సీట్లను మాత్రమే సాధించింది. మరోవైపు, ఎన్డీయే కూటమి 202 స్థానాలు కైవసం చేసుకుంది. నితీష్ కుమార్ సీఎంగా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.
Read Also: Sheikh Hasina: ఉరిశిక్ష పడిన ‘‘షేక్ హసీనా’’ను భారత్ బంగ్లాదేశ్కు అప్పగిస్తుందా.?
Also Read
- Abhijeet Dipke: వాంగ్చుక్ దీక్ష విరమించినా తగ్గేదేలే.. కేంద్రానికి అభిజీత్ దిప్కే వార్నింగ్..
- Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
- Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
- CJP Protests: మా 4 డిమాండ్లలో రెండింటికి కేంద్రం అంగీకారం.. ఆందోళనపై CJP తాజా ప్రకటన..
ఇదిలా ఉంటే, ఈ ఘోర పరాజయం తర్వాత తేజస్వీ యాదవ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన తండ్రి లాలూ పట్టుబట్టడంతో ఈ పదవిని చేపట్టడానికి అంగీకరించారు. నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో తాను ఎమ్మె్ల్యేగానే కొనసాగుతానని, ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, లాలూ మాత్రం సభలో పార్టీని నడిపించాలని తేజస్వీని కోరారని చెప్పారు.
ఆర్జేడీ ఓటమికి కూడా తేజస్వీ యాదవ్ తానే బాధ్యత తీసుకున్నాడు. ఈ ఎన్నికల్లో చాలా ప్రయత్నించానని, కానీ విఫలమయ్యానని అన్నారు. అయితే, సమావేశంలో సీనియర్ నాయకులు తేజస్వీ యాదవ్ వెంటే ఉన్నామని, అతడితోనే ఉంటామని చెప్పారు. తేజస్వీ యాదవ్ సన్నిహితుడు, ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్ ఈ సమావేశంలో ఆయనను సమర్థించారు. ఇటీవల, లాలూ ఫ్యామిలీ డ్రామాలో సంజయ్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపించింది. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య, ఇటీవల తన కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నట్లు చెప్పింది. దీనికి సంజయ్ యాదవ్ రమీజ్ నేమత్ ఖాన్లు కారణమని వెల్లడించింది.
తాజావార్తలు
-
Asian Games 2026 Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఒక్కటే ఛాన్స్!
-
Abhijeet Dipke: వాంగ్చుక్ దీక్ష విరమించినా తగ్గేదేలే.. కేంద్రానికి అభిజీత్ దిప్కే వార్నింగ్..
-
Honda ADV 160: మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్.. హోండా ADV 160తో సహా 10 టూవీలర్ల ఆవిష్కరణ..
-
KTR: ‘రాజ్యమా ఉలిక్కిపడు’.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
ట్రెండింగ్
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!