Bihar Politics: ఆర్జేడీ ఘోర పరాజయం, ప్రతిపక్ష నేత పదవిని తిరస్కరించిన తేజస్వీ యాదవ్.!
- బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం..
- ప్రతిపక్ష నేత బాధ్యతలు తీసుకునేందుకు తేజస్వీ నిరాకరణ..
- తండ్రి లాలూ సూచనలతో నిర్ణయం మార్చుకున్న ఆర్జేడీ నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Politics: బీహార్ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిని ముందుండి నడిపించిన, సీఎం అభ్యర్థిగా ఉన్న తేజస్వీ యాదవ్ ఒకానొక దశలో ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది, చివరకు స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ కేవలం 25 సీట్లకు మాత్రమే పరిమితమైంది. మహాఘట్బంధన్ కూటమి కేవలం 35 సీట్లను మాత్రమే సాధించింది. మరోవైపు, ఎన్డీయే కూటమి 202 స్థానాలు కైవసం చేసుకుంది. నితీష్ కుమార్ సీఎంగా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.
Read Also: Sheikh Hasina: ఉరిశిక్ష పడిన ‘‘షేక్ హసీనా’’ను భారత్ బంగ్లాదేశ్కు అప్పగిస్తుందా.?
Also Read
- Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
- Viral: ఫుడ్ పాయిజనింగ్కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
- Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్లో బీజేపీ క్లీన్ స్వీప్!
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
ఇదిలా ఉంటే, ఈ ఘోర పరాజయం తర్వాత తేజస్వీ యాదవ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన తండ్రి లాలూ పట్టుబట్టడంతో ఈ పదవిని చేపట్టడానికి అంగీకరించారు. నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో తాను ఎమ్మె్ల్యేగానే కొనసాగుతానని, ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, లాలూ మాత్రం సభలో పార్టీని నడిపించాలని తేజస్వీని కోరారని చెప్పారు.
ఆర్జేడీ ఓటమికి కూడా తేజస్వీ యాదవ్ తానే బాధ్యత తీసుకున్నాడు. ఈ ఎన్నికల్లో చాలా ప్రయత్నించానని, కానీ విఫలమయ్యానని అన్నారు. అయితే, సమావేశంలో సీనియర్ నాయకులు తేజస్వీ యాదవ్ వెంటే ఉన్నామని, అతడితోనే ఉంటామని చెప్పారు. తేజస్వీ యాదవ్ సన్నిహితుడు, ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్ ఈ సమావేశంలో ఆయనను సమర్థించారు. ఇటీవల, లాలూ ఫ్యామిలీ డ్రామాలో సంజయ్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపించింది. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య, ఇటీవల తన కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నట్లు చెప్పింది. దీనికి సంజయ్ యాదవ్ రమీజ్ నేమత్ ఖాన్లు కారణమని వెల్లడించింది.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!