Bihar Elections: లాలూ కుటుంబంలో ముదిరిన వివాదం..
- బీహార్ ఎన్నికల ముందు లాలూ ఫ్యామిలీలో విభేదాలు..
- తేజస్వీ, మీసా భారతిలను అన్ఫాలో చేసిన తేజ్ ప్రతాప్ యాదవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఎన్డీయే, మహాఘటబంధన్ కూటములు సీట్ల షేరింగ్పై చర్చోపచర్చలు నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే, మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది. లాలూ కుటుంబంలో తీవ్ర విభేదాలు ముసురుకున్నాయి. తాజాగా, లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, తన తమ్ముడు తేజస్వీ యాదవ్ , తన అక్క మీసా భారతిలను ఎక్స్లో అన్ఫాలో చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఈ చర్య కుటుంబంలో చీలిక గురించి కొత్త ఊహాగానాలకు దారి తీసింది.
Read Also: Eiffel Tower Demolition: ఈఫిల్ టవర్ కూల్చివేత ? ప్రపంచ వింత మాయం కానుందా!
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
ఆర్జేడీ నుంచి సస్పెన్షన్కు గురైన తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్తగా జనశక్తి జనతాదళ్ (జెజెడి) పార్టీని ప్రారంభించారు. అక్టోబర్ 13న తన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం, తేజ్ ప్రతాప్ తండ్రి లాలూ, తల్లి రబ్రీదేవీ, చెల్లెలు రాజ్ లక్ష్మీ యాదవ్లను మాత్రమే సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. మరో సోదరి హేమా యాదవ్ను అంతకుముందు అన్ఫాలో చేశారు. కుటుంబ విభేదాలు ఇప్పుడు లాలూ కుటుంబంలో రాజకీయ వివాదాలుగా మారాయి. కొడుకు కొత్త పార్టీ పెట్టడం ఆర్జేడీలో చాలా మందికి నచ్చడం లేదు. తేజ్ ప్రతాప్ వచ్చే ఎన్నికల్లో మహువా నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6 మరియు 11 తేదీలలో రెండు దశల్లో జరుగుతాయి, నవంబర్ 14న లెక్కింపు జరుగుతుంది.
ఇటీవల ఫేస్ బుక్ వేదికగా తను ఓ అమ్మాయితో ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నానని ప్రకటించడం మొత్తం వివాదానికి కారణమైంది. ఇదే కుటుంబంలో చిచ్చుపెట్టింది. క్రమశిక్షణా చర్యల కింద లాలూ, తేజ్ ప్రతాప్ను పార్టీ నుంచి బహిష్కరించారు. తేజ్ ప్రతాప్కు గతంలో మాజీ సీఎం దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్య రాయ్ తో వివాహమైంది, ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. వీరిద్దరి విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉంది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!