Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- బెంగాల్లో బీజేపీ గెలుపుపై బంగ్లా అధికార పార్టీ ఆనందం..
- తీస్తా నది వివాదంపై ఒప్పందం కురుతుందని ఆశాభావం..
- మమతా బెనర్జీ ఒప్పందాన్ని అడ్డుకుందన్న బీఎన్పీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంపై బంగ్లాదేశ్లో రాడికల్ ఇస్లామిక్ నేతలు ఆందోళన భయాలు వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు, బీజేపీ గెలుపుతో కొత్తగా ఏర్పడిన బంగ్లా ప్రభుత్వం మాత్రం ఒకింత ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రధాని తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఒకింత ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. రెండు దేశాల మధ్య తీస్తా నది నీటి పంపిణీ ఒప్పందాన్ని మమతా బెనర్జీ అడ్డుకున్నారని బీఎన్పీ తీవ్రంగా విమర్శిస్తోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి బీజేపీ గెలుపు సహాయపడుతుందని చెబుతోంది.
బీఎన్పీ సమాచార కార్యదర్శి అజీజుల్ బారి హెలాల్, సువెందు అధికారి నాయకత్వంలో బీజేపీ పనితీరును ప్రశంసించారు, భవిష్యత్తులో కూడా సంబంధాలు సానుకూలంగా కొనసాగుతాయని అన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న తీస్తా వివాదం ఇప్పుడు చక్కబడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సువేందు అధికారి నాయకత్వంలో బీజేపీ ఎన్నికల్లో గెలిచినందున తీస్తా బ్యారేజీ ఒప్పందం ముందుకు సాగుతుందని అన్నారు.
Also Read
- Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి 'ది ఎండ్'?
- Punjab Blasts: పంజాబ్లో హైటెన్షన్.. గంటల వ్యవధిలో రెండు చోట్ల పేలుళ్లు.. ఇది ఖలిస్తానీ గ్రూపు పనే!
- Tamil Nadu Politics: నిమిషానికో మలుపు.. విజయ్ మాస్టార్ ప్లాన్.. ఏఐఏడీఎంకేతో చర్చలు!
- TVK Vijay: విజయ్ తన భవిష్యత్తును ముందే ఊహించారా?.. GOATలో విజయ్ నంబర్ ప్లేట్ వైరల్
ఏమిటి ఈ వివాదం.?
భారత్-బంగ్లా మధ్య చాలా కాలంగా పరిష్కారం కాని నీటి పంపిణీ సమస్యలో తీస్తా వివాదం ఒకటి. 1996 గంగా జలాల ఒప్పందం ప్రకారం, వేసవి కాలంలో ఫరక్కా బ్యారేజ్ వద్ద నీటిని పంచుకోవాలని నిబంధన ఉంది. అయితే, వేసవి నెలల్లో తమకు తగినంత నీరు అందుబాటులో లేదని, దీనివల్ల దిగువ ప్రాంతాల్లోని వ్యవసాయం, జీవనోపాధి దెబ్బతింటున్నాయని బంగ్లాదేశ్ వాదిస్తోంది. వాతావరణ మార్పులు కూడా ఈ నీటి కొరత వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి.
1996 ఒప్పందం ఈ సంవత్సరంతో ముగియనున్న నేపథ్యంలో, బంగ్లాదేశ్ తీస్తా జలాల్లో “సమాన వాటా” కావాలని డిమాండ్ చేస్తోంది. అయితే, పశ్చిమ బెంగాల్ తన సొంత అవసరాలను పేర్కొంటూ దీనిని వ్యతిరేకించడంతో ఈ ఒప్పందం నిలిచిపోయింది. 2011లో ప్రధాన మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పర్యటన సమయంలో బంగ్లాదేశ్ 37.5 శాతం, భారత్ 42.5 శాతం నీటిని వాడుకోవాలని ఒక ప్రతిపాదన చేశారు. అయితే, ఈ ప్రతిపాదన రాష్ట్ర వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని బెంగాల్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది.
54 నదులు, రెండు ఒప్పందాలు:
బంగ్లాదేశ్, భారత్ మధ్య ఏకంగా 54 ప్రవహిస్తున్నాయి. అయితే, రెండు దేశాల మధ్య కేవలం రెండు ఒప్పందాలు మాత్రమే ఉన్నాయి. 1983లో ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. బంగ్లాదేశ్కు 36 శాతం, భారతదేశానికి 39 శాతం నీటిని కేటాయించగా, మిగిలిన 25 శాతాన్ని తర్వాత నిర్ణయించాల్సి ఉంది. అయితే, 2015లో ప్రధాని మోడీ బంగ్లా పర్యటనలో దీనిపై స్పష్టత వస్తుందని అనుకున్నప్పటికీ, రాలేదు. భారత్, బంగ్లా మధ్య గంగా జలాల ఒప్పందం, కుషియారా నదీ ఒప్పందాలు మాత్రమే ఉన్నాయి. తీస్తా, ఫెనీ నదులు సహా అనేక నదుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
-
Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?
-
Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..
-
Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు?
-
Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్ప్లే, GPS ఫీచర్లతో అదిరింది
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!