PoK Protest: ప్లీజ్ మాకు సాయం చేయండి.. భారత్ను వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్..
- భారత్ సాయాన్ని కోరుతున్న పీఓకే ప్రజలు..
- పీఓకే ఉద్యమాన్ని అణచివేస్తున్న పాకిస్తాన్..
- ఆహారం, మందులు అందకుండా పాక్ కుట్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PoK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీ్ర్(పీఓకే)లో భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ అణచివేతకు నిరసనగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. రోజురోజుకు ఈ ఉద్యమం తీవ్రమవుతోంది. 26 రోజులుగా ప్రజలు పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. ఈ నిరసనల్ని పాక్ క్రూరంగా అణచివేస్తోంది. శాంతియుత నిరసన చేస్తున్నవారిపై కాల్పులు జరుపుతోంది. మరోవైపు, పాకిస్తాన్ నుంచి పీఓకే ప్రాంతానికి వెళ్లే సరకుల్ని, మందులను నిలిపేసింది.
ఈ నేపథ్యంలో, తమకు సాయం చేయాలని పీఓకే ప్రజలు భారత్ను కోరుతున్నారు. భారతదేశంలో, నియంత్రణ రేఖకు(LoC) అవతల నివసిస్తున్న ప్రజల సాయాన్ని అభ్యర్థిస్తూ, ఉద్యమ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రావల్ కోట్ ఈద్గా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. తాము తీవ్రమైన ఆహార, ఔషధ కొరతను ఎదుర్కొంటున్నామని, మనమంతా నియంత్రణ రేఖ వైపు వెళ్లాలా? అంటూ ప్రజల్ని ప్రశ్నించారు. దీనికి అంతా అటువైపే వెళ్లండి అంటూ సమాధానం ఇచ్చారు.
Also Read
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
- H-1B Visa: ఉద్యోగం పోతే అమెరికాలో ఉండటం కష్టమేనా? 60 రోజుల గడువు తొలగించే దిశగా ట్రంప్ ప్రభుత్వం
ప్రజల డిమాండ్లకు ప్రభుత్వం కాల్పులతో సమాధానం ఇస్తే, వారికి ఇతర మార్గాలు ఉన్నాయని హెచ్చరించారు. నిర్ణీత సమయంలోగా తమ డిమాండ్లను నెరవేర్చకుంటే జూలై 8న తదుపరి దశ నిరసనల్ని ప్రకటిస్తామని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జేఏఏసీ) హెచ్చరించింది. ఇదిలా ఉంటే పీఓకే అణచివేతకు నిరసనగా వేలాది మంది ప్రవాసీ కాశ్మీరీలు లండన్లో భారీ మార్చ్ నిర్వహించారు. విద్యుత్ ధరలు, గోధుమ పిండి, ఇతర హక్కుల కోసం పీఓకే ప్రజలు గళమెత్తుతున్నారు. ఇదే కాకుండా కాశ్మీరీ శరణార్థులకు పీఓకే శాసనసభలో రిజర్వేషన్ కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని చేపట్టారు.
తాజావార్తలు
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్వాచ్లు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?