Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- బెంగాల్లో బీజేపీ గెలుపుపై బంగ్లా అధికార పార్టీ ఆనందం..
- తీస్తా నది వివాదంపై ఒప్పందం కురుతుందని ఆశాభావం..
- మమతా బెనర్జీ ఒప్పందాన్ని అడ్డుకుందన్న బీఎన్పీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంపై బంగ్లాదేశ్లో రాడికల్ ఇస్లామిక్ నేతలు ఆందోళన భయాలు వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు, బీజేపీ గెలుపుతో కొత్తగా ఏర్పడిన బంగ్లా ప్రభుత్వం మాత్రం ఒకింత ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రధాని తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఒకింత ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. రెండు దేశాల మధ్య తీస్తా నది నీటి పంపిణీ ఒప్పందాన్ని మమతా బెనర్జీ అడ్డుకున్నారని బీఎన్పీ తీవ్రంగా విమర్శిస్తోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి బీజేపీ గెలుపు సహాయపడుతుందని చెబుతోంది.
బీఎన్పీ సమాచార కార్యదర్శి అజీజుల్ బారి హెలాల్, సువెందు అధికారి నాయకత్వంలో బీజేపీ పనితీరును ప్రశంసించారు, భవిష్యత్తులో కూడా సంబంధాలు సానుకూలంగా కొనసాగుతాయని అన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న తీస్తా వివాదం ఇప్పుడు చక్కబడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సువేందు అధికారి నాయకత్వంలో బీజేపీ ఎన్నికల్లో గెలిచినందున తీస్తా బ్యారేజీ ఒప్పందం ముందుకు సాగుతుందని అన్నారు.
Also Read
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
- NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
- PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
- Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..
ఏమిటి ఈ వివాదం.?
భారత్-బంగ్లా మధ్య చాలా కాలంగా పరిష్కారం కాని నీటి పంపిణీ సమస్యలో తీస్తా వివాదం ఒకటి. 1996 గంగా జలాల ఒప్పందం ప్రకారం, వేసవి కాలంలో ఫరక్కా బ్యారేజ్ వద్ద నీటిని పంచుకోవాలని నిబంధన ఉంది. అయితే, వేసవి నెలల్లో తమకు తగినంత నీరు అందుబాటులో లేదని, దీనివల్ల దిగువ ప్రాంతాల్లోని వ్యవసాయం, జీవనోపాధి దెబ్బతింటున్నాయని బంగ్లాదేశ్ వాదిస్తోంది. వాతావరణ మార్పులు కూడా ఈ నీటి కొరత వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి.
1996 ఒప్పందం ఈ సంవత్సరంతో ముగియనున్న నేపథ్యంలో, బంగ్లాదేశ్ తీస్తా జలాల్లో “సమాన వాటా” కావాలని డిమాండ్ చేస్తోంది. అయితే, పశ్చిమ బెంగాల్ తన సొంత అవసరాలను పేర్కొంటూ దీనిని వ్యతిరేకించడంతో ఈ ఒప్పందం నిలిచిపోయింది. 2011లో ప్రధాన మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పర్యటన సమయంలో బంగ్లాదేశ్ 37.5 శాతం, భారత్ 42.5 శాతం నీటిని వాడుకోవాలని ఒక ప్రతిపాదన చేశారు. అయితే, ఈ ప్రతిపాదన రాష్ట్ర వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని బెంగాల్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది.
54 నదులు, రెండు ఒప్పందాలు:
బంగ్లాదేశ్, భారత్ మధ్య ఏకంగా 54 ప్రవహిస్తున్నాయి. అయితే, రెండు దేశాల మధ్య కేవలం రెండు ఒప్పందాలు మాత్రమే ఉన్నాయి. 1983లో ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. బంగ్లాదేశ్కు 36 శాతం, భారతదేశానికి 39 శాతం నీటిని కేటాయించగా, మిగిలిన 25 శాతాన్ని తర్వాత నిర్ణయించాల్సి ఉంది. అయితే, 2015లో ప్రధాని మోడీ బంగ్లా పర్యటనలో దీనిపై స్పష్టత వస్తుందని అనుకున్నప్పటికీ, రాలేదు. భారత్, బంగ్లా మధ్య గంగా జలాల ఒప్పందం, కుషియారా నదీ ఒప్పందాలు మాత్రమే ఉన్నాయి. తీస్తా, ఫెనీ నదులు సహా అనేక నదుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
The Paradise: 20 కోట్ల వ్యూస్తో దుమ్మురేపిన ‘ఆయా షేర్’.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్పై బిగ్ అప్డేట్!
-
Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్.. ట్రోఫీతో పాటు రూ. 20 లక్షల ప్రైజ్ మనీ
-
Ram Charan: రామ్ చరణ్కు గాయం.. సర్జరీ కోసం కోయంబత్తూరు, RC17పై ప్రభావం?
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!