Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- బెంగాల్లో బీజేపీ గెలుపుపై బంగ్లా అధికార పార్టీ ఆనందం..
- తీస్తా నది వివాదంపై ఒప్పందం కురుతుందని ఆశాభావం..
- మమతా బెనర్జీ ఒప్పందాన్ని అడ్డుకుందన్న బీఎన్పీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంపై బంగ్లాదేశ్లో రాడికల్ ఇస్లామిక్ నేతలు ఆందోళన భయాలు వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు, బీజేపీ గెలుపుతో కొత్తగా ఏర్పడిన బంగ్లా ప్రభుత్వం మాత్రం ఒకింత ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రధాని తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఒకింత ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. రెండు దేశాల మధ్య తీస్తా నది నీటి పంపిణీ ఒప్పందాన్ని మమతా బెనర్జీ అడ్డుకున్నారని బీఎన్పీ తీవ్రంగా విమర్శిస్తోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి బీజేపీ గెలుపు సహాయపడుతుందని చెబుతోంది.
బీఎన్పీ సమాచార కార్యదర్శి అజీజుల్ బారి హెలాల్, సువెందు అధికారి నాయకత్వంలో బీజేపీ పనితీరును ప్రశంసించారు, భవిష్యత్తులో కూడా సంబంధాలు సానుకూలంగా కొనసాగుతాయని అన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న తీస్తా వివాదం ఇప్పుడు చక్కబడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సువేందు అధికారి నాయకత్వంలో బీజేపీ ఎన్నికల్లో గెలిచినందున తీస్తా బ్యారేజీ ఒప్పందం ముందుకు సాగుతుందని అన్నారు.
Also Read
- Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
- MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
- PM Modi: ఎర్రకోట వేదికగా యూత్కు ప్రధాని మోడీ గుడ్న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
- PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. 'అర్బన్ నక్సల్స్'ను సమాజం దూరం పెట్టాలి..
ఏమిటి ఈ వివాదం.?
భారత్-బంగ్లా మధ్య చాలా కాలంగా పరిష్కారం కాని నీటి పంపిణీ సమస్యలో తీస్తా వివాదం ఒకటి. 1996 గంగా జలాల ఒప్పందం ప్రకారం, వేసవి కాలంలో ఫరక్కా బ్యారేజ్ వద్ద నీటిని పంచుకోవాలని నిబంధన ఉంది. అయితే, వేసవి నెలల్లో తమకు తగినంత నీరు అందుబాటులో లేదని, దీనివల్ల దిగువ ప్రాంతాల్లోని వ్యవసాయం, జీవనోపాధి దెబ్బతింటున్నాయని బంగ్లాదేశ్ వాదిస్తోంది. వాతావరణ మార్పులు కూడా ఈ నీటి కొరత వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి.
1996 ఒప్పందం ఈ సంవత్సరంతో ముగియనున్న నేపథ్యంలో, బంగ్లాదేశ్ తీస్తా జలాల్లో “సమాన వాటా” కావాలని డిమాండ్ చేస్తోంది. అయితే, పశ్చిమ బెంగాల్ తన సొంత అవసరాలను పేర్కొంటూ దీనిని వ్యతిరేకించడంతో ఈ ఒప్పందం నిలిచిపోయింది. 2011లో ప్రధాన మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పర్యటన సమయంలో బంగ్లాదేశ్ 37.5 శాతం, భారత్ 42.5 శాతం నీటిని వాడుకోవాలని ఒక ప్రతిపాదన చేశారు. అయితే, ఈ ప్రతిపాదన రాష్ట్ర వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని బెంగాల్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది.
54 నదులు, రెండు ఒప్పందాలు:
బంగ్లాదేశ్, భారత్ మధ్య ఏకంగా 54 ప్రవహిస్తున్నాయి. అయితే, రెండు దేశాల మధ్య కేవలం రెండు ఒప్పందాలు మాత్రమే ఉన్నాయి. 1983లో ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. బంగ్లాదేశ్కు 36 శాతం, భారతదేశానికి 39 శాతం నీటిని కేటాయించగా, మిగిలిన 25 శాతాన్ని తర్వాత నిర్ణయించాల్సి ఉంది. అయితే, 2015లో ప్రధాని మోడీ బంగ్లా పర్యటనలో దీనిపై స్పష్టత వస్తుందని అనుకున్నప్పటికీ, రాలేదు. భారత్, బంగ్లా మధ్య గంగా జలాల ఒప్పందం, కుషియారా నదీ ఒప్పందాలు మాత్రమే ఉన్నాయి. తీస్తా, ఫెనీ నదులు సహా అనేక నదుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Mahindra BE 6 Formula E Freedom Edition: ‘Revive’ ఎమర్జెన్సీ ఫీచర్ తో.. మహీంద్రా BE 6 ఫార్ములా ఈ ఎడిషన్ రిలీజ్
-
Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
-
India Test Cricket History: 94 ఏళ్ల టెస్ట్ ప్రయాణం.. 600వ మ్యాచ్కు చేరుకున్న టీమిండియా చరిత్ర ఇదే..!
-
Mahindra BE 6 SPORTEQ: మహీంద్రా BE6 స్పోర్టెక్ ఎలక్ట్రిక్ SUV విడుదల.. 683KM రేంజ్, Gemini AIతో అదిరిపోయే ఫీచర్లు
-
Saira Banu First Look: ముస్లిం అమ్మాయిని ప్రేమించే యువకుడిగా ఆది.. ఆకట్టుకుంటున్న ‘సైరాబాను’ ఫస్ట్ లుక్..
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!