Techie Jobs At Risk: హై రిస్క్లో ఐటీ ఉద్యోగాలు.. హెచ్చరించిన ఎకనామిక్ సర్వే..
- హై రిస్క్లో ఐటీ రంగం ఉద్యోగాలు..
- వృద్ధికి అనుగుణంగా లేని జాబ్స్ పెరుగుదల..
- ఏఐతో ‘‘బ్యాక్ ఆఫీస్ మోడల్’’పై ప్రభావం..
- మారాల్సిన తరుణం వచ్చిందని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Techie Jobs At Risk: భారతదేశంలో ఐటీ రంగం, వైట్ కాలర్ ఉద్యోగాలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయని ఎకనామిక్ సర్వే 2025-26 హెచ్చరించింది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రభావంతో ఐటీ రంగంలోని ఉద్యోగులు రిస్క్లో ఉన్నారంటూ చెప్పింది. ఇప్పటి వరకు సాధారణ మేధోపనులకు భారతీయుల్ని అవుట్సోర్స్గా నియమించుకున్న విదేశీ కంపెనీలు, ఇప్పుడు వీటిని ఏఐ ద్వారా భర్తీ చేస్తుండటంతో ‘‘నిశ్శబ్ధమైన మార్పు’’ జరుగుతోందని సర్వే పేర్కొంది.
ఈ పరిణామాలను అంచనా వేయడానికి అమెరికాలోని ప్రొఫెషనల్, బిజినెస్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(PBIS) రంగాన్ని ముందస్తు సూచికగా (లీడ్ ఇండికేటర్)గా ఉపయోగించింది. డిసెంబర్ 2022 తర్వాత ప్రొడక్టీవ్ ఏఐ టూల్స్ వాడకం మొదలైన తర్వాత, జీడీపీ వృద్ధి పెరుగుతుంటే, దీనికి అనుగుణంగా ఉద్యోగాల వృద్ధి జరగడం లేదని గుర్తించింది. ఉద్యోగాల సృష్టి-వృద్ధి మధ్య అనుసంధానం సరిగా లేదని చెప్పింది. దీనిని ‘‘వీకన్డ్ మార్జినల్ రెస్పాన్సివ్నెస్’’గా పేర్కొంది. దీని అర్థం ‘‘ఉత్పత్తి లేదా ఆర్థిక వృద్ధి పెరిగిన ప్రతీసారి ఉద్యోగాలు పెరుగుతాయనే సంప్రదాయ సంబంధం బలహీన పడింది’’ అని సర్వే చెప్పింది.
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
Read Also: Janasena MLA Arava Sridhar Incident: జనసేన ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు.. విచారణ ప్రారంభం..
ఇది ఆకస్మిక పతనం కాదని ‘‘స్థిరమైన తగ్గుదల’’గా అభివర్ణించింది. ఇది ఇన్ఫర్మేషన్ రిట్రీవల్, సమరైజేషన్, రిపీటిటీవ్ బిజినెస్ టాస్క్లతో ముడిపడి ఉన్న ఉద్యోగాలను ప్రభావితం చేస్తుందని చెప్పింది. తక్కువ డిజిటలైజేషన్ ఉన్న రంగాల్లో ఇలాంటి ధోరణులు కనిపించలేదని, కానీ వైట్ కాలర్, ఏఐ పనిచేసే రంగాల్లోని ఉద్యోగాలకే పరిమితమైందని సర్వే చెప్పింది. ఏఐ వల్ల ఖర్చులు తగ్గడం వల్ల ఈ రంగాలు ఆటోమేషన్ వైపు వెళ్తున్నాయని చెప్పింది. ఉద్యోగుల్ని నియమించుకోవడం కన్నా ఆటోమేషన్కు ప్రాధానత ఇస్తున్నాయి. దీంతో క్యాపిటల్-లేబర్ సమతుల్యం మారిపోతోంది.
భారత ఐటీ మోడల్కు పెనుముప్పు..
తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఐటీ సేవలు ఇవ్వడంలో ప్రపంచంలోనే భారత్కు పేరుంది. ఇలాంటి సర్వీసులతో భారత్ దశాబ్ధాలుగా లాభపడింది. కానీ ఇప్పుడు ఇదే పనిని ఏఐ మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో చేస్తోంది. భారతదేశం ఆధారపడిన సంప్రదాయ బ్యా్క్ – ఆఫీస్ మోడల్ ఇప్పుడు తీవ్ర ముప్పులో ఉందని సర్వే స్పష్టం చేసింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం జోక్యం అవసరమని ఎకనామిక్ సర్వే సూచించింది. ఏఐ ఎకనామిక్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఏఐ వల్ల ఉద్యోగాలపై పడే ప్రభావాన్ని అంచనావేయడం, ఉపాధిని కాపాడేలా ఏఐ వినియోగానికి మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.
తాజావార్తలు
-
Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్పై ప్రతీకారమే మిగిలింది..!
-
Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!