Techie Death: కర్ణాటకలో టెక్కీ మృతి.. ఫోన్ లిప్ట్ చేయకపోవడంతో వెలుగులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Techie Death: బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కృష్ణా జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన భార్యాపిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. కడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన వీరాంజనేయ విజయ్, ఆయన భార్య హేమావతి, ఇద్దరు పిల్లలు సీగేనహళ్లిలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. పిల్లల్లో ఒకరికి ఏడాదిన్నర కాగా మరొకరికి ఎనిమిది నెలల వయస్సు. భార్యాపిల్లలను చంపిన వీరాంజనేయులు కూడా ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని రోజులుగా హేమవతి ఫోన్ ఎత్తకపోవడం, మెసేజ్లు పంపినా రిప్లై ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆమె సోదరుడు వెంటనే బయలుదేరి బెంగళూరు వచ్చాడు. స్థానికులతో కలిసి ఈ కుటుంబం ఉంటున్న ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ వాసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
Read also: Nabha Natesh: అబ్బా అనిపించేలా ఉన్నావ్ నభా…
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
పోలీసులు గురువారం తలుపులు తెరిచి చూడగా బెడ్పై ముగ్గురు, ఫ్యాన్కు వీరాంజనేయులు వేలాడుతూ కనిపించారు. పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కడుగోడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జూలై 31న జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి ఇరు కుటుంబాలకు సమాచారం అందించారు. ఈ కుటుంబం మూడేళ్ల క్రితం బెంగళూరు వచ్చినట్లు తెలుస్తోంది.. వీరాంజనేయులు ఇంట్లో మొబైల్స్, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కాల్ డేటాను పరిశీలించే పనిలో ఉన్నారు. మృతుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి. హత్య, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన మిస్టరీగా మారగా వీరాంజనేయులు, హేమావతి కుటుంబ సభ్యులను అడిగి మరింత సమాచారం రాబట్టే పనిలో పడ్డారు.
AI Replacing Jobs: మహిళల పాలిట శాపంగా AI .. షాకింగ్ నిజాలు..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!