K. Annamalai: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని అన్నాయూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో అధికార డీఎంకేపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చెడు అంతమైపోవాలని కోరుతూ కోయంబత్తూరులో తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై ఆరు కొరడా దెబ్బలు కొట్టించుకుని.. మురుగన్కు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ.. రాష్ట్రంలో స్టాలిన్ సర్కార్ ను గద్దె దించేందుకు ఇవాళ్టి నుంచి 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేస్తానని శపథం చేశారు.
Read Also: Realme 14 Pro Launch: భారత్కు రంగు మారే స్మార్ట్ఫోన్ వచ్చేస్తోంది.. ప్రపంచంలోనే మొదటి మొబైల్!
ఇక, గురువారం నాడు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే సర్కార్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నేను పాదరక్షలు ధరించను అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి రూపాయి కూడా పంచమని తెలిపారు. అయితే, డీఎంకే ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని కె. అన్నామలై చెప్పుకొచ్చారు.
#WATCH | Coimbatore | Tamil Nadu BJP president K Annamalai self-whips himself as a mark of protest to demand justice in the Anna University alleged sexual assault case. pic.twitter.com/ZoEhSsoo1r
— ANI (@ANI) December 27, 2024