Himachal: హిమాచల్పై జలఖడ్గం.. 63 మంది మృతి.. రూ.400 కోట్ల నష్టం
- హిమాచల్ప్రదేశ్పై జలఖడ్గం
- 63 మంది మృతి.. రూ.400 కోట్ల నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ప్రదేశ్పై జలఖడ్గం విరుచుకుపడింది. గత కొద్ది రోజులుగా ప్రకృతి ప్రకోపం చల్లారడం లేదు. ఓ వైపు కుండపోత వర్షాలు.. ఇంకోవైపు కొండచరియలు విరిగిపడడంతో భారీగా ప్రాణ, ఆస్తి జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు 63 మంది చనిపోగా.. రూ.400 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక డజన్ల కొద్దీ గల్లంతయ్యారు.
ఇది కూడా చదవండి: Mivi AI Buds: మివి ఏఐ బడ్స్ విడుదల.. మనుషుల్లా మాట్లాడుతాయి.. ధర ఎంతంటే?
Also Read
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
- Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్పై గడ్కరీ..
- Trump-Iran: జోర్డాన్లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
గత కొద్ది రోజులుగా హిమాచల్ప్రదేశ్లో నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు కారణంగా మేఘాలు రాష్ట్రాన్ని కమ్ముకున్నాయి. అంతేకాకుండా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఇంకోవైపు భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇప్పటి వరకు 63 మంది చనిపోగా… పదుల కొద్దీ గల్లంతయ్యారు. మరోవైపు అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఇక జూలై 7 వరకు అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రూ.400 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. మండి జిల్లాలో సహాయ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: KCR : యశోదలో కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్సీ కవిత
రుతుపవనాలు జూన్ 20న హిమాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసం సృష్టించాయి. తాజా సమాచారం ప్రకారం మండి జిల్లాలో 40 మంది మరణించగా, కాంగ్రాలో 13 మంది, చంబాలో ఆరుగురు, సిమ్లాలో ఐదుగురు మరణించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. 14 వంతెనలు కొట్టుకుపోయాయి. 300 పశువులు చనిపోయాయి. ఇక విద్యుత్ సబ్స్టేషన్లు దెబ్బతినడంతో వేలాది మంది ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. నీరు, ఆహారం కొరత కూడా ఏర్పడింది.
शिमला : ढली के लिंडीधार में भारी लैंडस्लाइड – फोरलेन का डंगा गिरा – सैंकड़ों सेब के पेड़ दबे।
घर छोड़ भागे लोग, 5 घरों को खतरा।#Shimla #Dhali #Landslide #HimachalNews #DDNewsHimachal pic.twitter.com/dKaekscobU
— DD News Himachal (@DDNewsHimachal) July 3, 2025
Whoahh, that was close!!
A massive landslide hit the Shillai area of Sirmaur district, Himachal Pradesh, India today, along National Highway 707 👀pic.twitter.com/nVvfZWty90
— Volcaholic 🌋 (@volcaholic1) May 30, 2025
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!