Tamil Nadu: దేవాలయ నిధులు దేవాలయాలకే.. విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం..
- దేవాలయ నిధుల విషయంలో సీఎం విజయ్ సర్కార్ కీలక నిర్ణయం..
- మ్యారేజ్ హాళ్లు, కమర్షియల్ భవనాల నిర్మాణాలు రద్దు..
- గతంలో డీఎంకే ప్రభుత్వ సమయంలో రూ. 245తో ప్రాజెక్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులోని విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం దేవాలయ నిధుల వినియోగంపై కీలక చర్యను ప్రారంభించింది. హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ శాఖ పరిధిలోని దేవాలయ నిధులతో చేపట్టాలని భావించిన రూ. 245.85 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులకు ఇచ్చిన పరిపాలన అనుమతుల్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 29 కళ్యాణ మండపాలను రూ. 115 కోట్లతో, 17 కమర్షియల్ సముదాయాలను రూ. 130 కోట్లతో నిర్మించాలనే ప్లాన్ నిలిచిపోయింది.
ప్రాజెక్టులు కొన్ని న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోవడం, దేవాలయాలపై ఆర్థిక భారం పెరగడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దేవాలయ నిధుల్ని వాణిజ్య కార్యకలాపాల కన్నా ఆలయ అభివృద్ధి, భక్తుల సంక్షేహం, వారసత్వ పరిరక్షణ వంటి కార్యక్రమాలకు వినియోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేవాలయ నిధులతో భక్తులకు, దేవాలయాలకు ప్రయోజనం చేకూరే కొత్త పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు వెల్లడించారు.
Also Read
- Abortion Ruling: గర్భం కొనసాగించాలా? అబార్షన్ చేయించుకోవాలా? ఈ నిర్ణయం పూర్తిగా తల్లిదే.. హైకోర్టు కీలక తీర్పు
- PM Modi Three-Nation Tour: మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ.. పూర్తి వివరాలు
- Blue Aadhaar Card: బ్లూ ఆధార్ కార్డుపై కీలక అప్డేట్.. పిల్లల గుర్తింపుకు సంబంధించిన ఈ సేవ ఆ తేదీ వరకు ఫ్రీ..!
- Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య కేసులో షాకింగ్ విషయాలు.. దొంగిలించిన డబ్బుతో కార్లు, ఖరీదైన ఫోన్లు, గిఫ్ట్లు..!
గతంలో డీఎంకే ప్రభుత్వం దేవాలయ నిధులతో ఈ ప్రాజెక్టుల్ని చేపట్టింది. అయితే, ఈ నిర్ణయంపై రాజకీయంగా విమర్శలు వచ్చాయి. దేవాలయ ఆదాయాన్ని పెంచడంతో పాటు భక్తులకు తక్కువ ఖర్చుతో వివాహ వేదికలు అందించేందుకు ఈ ప్రాజెక్టులు చేపట్టినట్లు గతంలో డీఎంకే పేర్కొంది. తాజాగా విజయ్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై డీఎంకే తీవ్ర విమర్శలు చేస్తోంది. బీజేపీ డిమాండ్లకు అనుగుణంగా అధికార టీవీకే ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉంటే, ప్రజలు దేవాలయ నిధుల్ని దేశాలయాలకే వినియోగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు.
తాజావార్తలు
-
Ali Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియలపై షాకింగ్ రిపోర్ట్.. అమెరికా భయంతో 13 దేశాలు దూరం!
-
Team India-BCCI: ఆ ఐపీఎల్ స్టార్కు ఛాన్స్ ఇవ్వండి.. టీమిండియా టోటల్ సెట్టు ఇగ!
-
AP Employee Transfers Ban: ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కొత్త జోనల్ విధానంపై కీలక ఉత్తర్వులు
-
వన్డే ప్రపంచకప్ 2027లో Vaibhav Sooryavanshi.. భారత మాజీ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!