Tamil Nadu: 24 గంటల్లో రెండు రాజకీయ హత్యలు.. బీజేపీ కార్యకర్తని నరికి చంపిన దుండగులు..
- తమిళనాడులో వరసగా రాజకీయ హత్యలు..
- 24 గంటల్లో బీజేపీ.. ఏఐడీఎంకే కార్యకర్తల హతం..
- స్టాలిన్ సర్కార్పై అన్నామలై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో రాజకీయ హత్యలు ప్రకంపలను సృష్టిస్తున్నాయి. ఈ నెలలో బీఎస్పీ తమిళనాడు చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్ని దుండగులు హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై స్టాలిన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పదవి నుంచి దిగిపోవాలని ఏఐడీఎంకే, బీజేపీలు డిమాండ్ చేశాయి. ఇదిలా ఉంటే కడలూరు జిల్లాలో పళనిస్వామి పార్టీ ఏఐడీఎంకేకి చెందిన క్యార్తకర్తను నరికిచంపారు. పుదుచ్చేరి సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది. పద్మనాభన్ అనే వ్యక్తి బైకుపై బాగూర్ వైపు వెళ్తుండగా, కారులో వచ్చిన దుండగులు అతడిని నరికి చంపారు. ఈ కేసులో ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Also Read
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
ఇదిలా ఉండగా, 24 గంటల్లోనే మరో పార్టీకి చెందిన వ్యక్తి హత్యకు గురయ్యారు. రాష్ట్రంలోని శివగంగైలో బీజేపీ కార్యకర్తను దుండగులు నరికి చంపారు. శివగంగై బీజేపీ జిల్లా కార్యదర్శిగా ఉన్న సెల్వకుమార్ తనకున్న ఇటుక బట్టీ నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా దాడి జరిగింది. కొంతమంది వ్యక్తులు అతన్ని చుట్టుముట్టి, నరికి చంపారు. దారిలో వెళ్తున్న స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న సెల్వకుమార్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలంలోకి చేరేలోపే అతను మరణించాడు.
ఈ హత్యపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడు సెల్వకుమార్ కుటుంబానికి సానూభూతి తెలియజేశారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తమిళనాడు హత్యలకు రాజధానిగా మారిందని ఆయన ఆరోపించారు. నిందితులకు ప్రభుత్వం, పోలీసులు అన్నా భయం లేదని చెప్పారు. పోలీసులను తన ఆధీనంలో ఉంచుకుని ముఖ్యమంత్రి నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. స్టాలిన్కి ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు ఉందా.? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారినట్లు ఆరోపించారు. అయితే, ఈ హత్య రెండు వర్గాల మధ్య శత్రుత్వం కారణంగానే జరిగిందని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని శివగంగై ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు.
తాజావార్తలు
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!