Tamil Nadu: 24 గంటల్లో రెండు రాజకీయ హత్యలు.. బీజేపీ కార్యకర్తని నరికి చంపిన దుండగులు..
- తమిళనాడులో వరసగా రాజకీయ హత్యలు..
- 24 గంటల్లో బీజేపీ.. ఏఐడీఎంకే కార్యకర్తల హతం..
- స్టాలిన్ సర్కార్పై అన్నామలై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో రాజకీయ హత్యలు ప్రకంపలను సృష్టిస్తున్నాయి. ఈ నెలలో బీఎస్పీ తమిళనాడు చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్ని దుండగులు హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై స్టాలిన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పదవి నుంచి దిగిపోవాలని ఏఐడీఎంకే, బీజేపీలు డిమాండ్ చేశాయి. ఇదిలా ఉంటే కడలూరు జిల్లాలో పళనిస్వామి పార్టీ ఏఐడీఎంకేకి చెందిన క్యార్తకర్తను నరికిచంపారు. పుదుచ్చేరి సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది. పద్మనాభన్ అనే వ్యక్తి బైకుపై బాగూర్ వైపు వెళ్తుండగా, కారులో వచ్చిన దుండగులు అతడిని నరికి చంపారు. ఈ కేసులో ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Also Read
- Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Nationwide Medical Shop Strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ ఎమర్జెన్సీ? బంద్ కానున్న 15 లక్షల మందుల దుకాణాలు!
- PM Modi: రోమ్లో మోదీ.. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి.!
ఇదిలా ఉండగా, 24 గంటల్లోనే మరో పార్టీకి చెందిన వ్యక్తి హత్యకు గురయ్యారు. రాష్ట్రంలోని శివగంగైలో బీజేపీ కార్యకర్తను దుండగులు నరికి చంపారు. శివగంగై బీజేపీ జిల్లా కార్యదర్శిగా ఉన్న సెల్వకుమార్ తనకున్న ఇటుక బట్టీ నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా దాడి జరిగింది. కొంతమంది వ్యక్తులు అతన్ని చుట్టుముట్టి, నరికి చంపారు. దారిలో వెళ్తున్న స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న సెల్వకుమార్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలంలోకి చేరేలోపే అతను మరణించాడు.
ఈ హత్యపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడు సెల్వకుమార్ కుటుంబానికి సానూభూతి తెలియజేశారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తమిళనాడు హత్యలకు రాజధానిగా మారిందని ఆయన ఆరోపించారు. నిందితులకు ప్రభుత్వం, పోలీసులు అన్నా భయం లేదని చెప్పారు. పోలీసులను తన ఆధీనంలో ఉంచుకుని ముఖ్యమంత్రి నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. స్టాలిన్కి ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు ఉందా.? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారినట్లు ఆరోపించారు. అయితే, ఈ హత్య రెండు వర్గాల మధ్య శత్రుత్వం కారణంగానే జరిగిందని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని శివగంగై ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు.
తాజావార్తలు
-
Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
-
Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
-
Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
-
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
-
Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?