Tamil Nadu: మరో స్కూల్ విద్యార్థిని మృతి.. రెండు వారాల్లో నాలుగో సంఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil nadu school girl dead: తమిళనాడు రాష్ట్రంలో వరసగా స్కూల్ విద్యార్థినుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ ఆత్మహత్యలను సీరియస్ గా తీసుకుంది. తాజాగా మరో స్కూల్ విద్యార్థిని ఇంట్లో శవమై కనిపించింది. శివకాశిలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని చనిపోయింది. పోలీసులు దీన్ని ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఈ ఘటన నిన్న(మంగళవారం) చోటు చేసుకుంది. అయితే విచారణ పూర్తయ్యే దాకా ఏం చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. బాలిక తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది. అయితే ఘటనాస్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే తరుచూ కడుపునొప్పితో బాధపడుతోందని అధికారులు చెబుతున్నారు.
కడలూర్ జిల్లాలో 12వ తరగతి విద్యార్థిని చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే శివకాశిలో విద్యార్థిని మరణించిన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు రెండు వారాల్లో రాష్ట్రంలో ముగ్గురు 12 తరగతి విద్యార్థినిలు, తాజాగా 11 తరగతి చదువుతున్న విద్యార్థిని మరణించింది. కడలూర్ విద్యార్థిని తల్లిదండ్రుల ఐఏఎస్ కల నెరవేర్చలేకపోతున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది. రాష్ట్రంలో జరుగుతున్న స్కూల్ విద్యార్థినుల మరణాల పట్ల సీఎం ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఆత్మహత్య ఆలోచనలకు దూరంగా ఉండాలని కోరారు. పరీక్షలను విజయాలుగా మార్చుకోవాలని.. విద్యార్థినులపై లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
Read Also: National Herald Case: సోనియా గాంధీ మూడో రోజు విచారణ.. ఢిల్లీలో భారీ బందోబస్త్
ఈ నెల 13న కల్లకురిచి విద్యార్థిని అనుమానాస్పద మృతితో రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది. ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థిని మరణం తీవ్ర హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. రాష్ట్రంలో పాటు దేశవ్యాప్తంగా ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ప్రిన్సిపాల్ తో సహా ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతరం సోమవారం తిరువళ్లూర్ జిల్లాలోని సేక్రెడ్ హార్ట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని తన హాస్టల్ గధిలో శవమై కనిపించింది. ఆ తరువాత కడలూర్, శివకాశి ఘటనలు జరిగాయి. విద్యాసంస్థల్లో జరుగుతున్న మరణాలపై సీబీ-సీఐడీతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్ట్ ఆదేశించింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?