Tamil Nadu: మరో స్కూల్ విద్యార్థిని మృతి.. రెండు వారాల్లో నాలుగో సంఘటన
Tamil nadu school girl dead: తమిళనాడు రాష్ట్రంలో వరసగా స్కూల్ విద్యార్థినుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ ఆత్మహత్యలను సీరియస్ గా తీసుకుంది. తాజాగా మరో స్కూల్ విద్యార్థిని ఇంట్లో శవమై కనిపించింది. శివకాశిలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని చనిపోయింది. పోలీసులు దీన్ని ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఈ ఘటన నిన్న(మంగళవారం) చోటు చేసుకుంది. అయితే విచారణ పూర్తయ్యే దాకా ఏం చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. బాలిక తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది. అయితే ఘటనాస్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే తరుచూ కడుపునొప్పితో బాధపడుతోందని అధికారులు చెబుతున్నారు.
కడలూర్ జిల్లాలో 12వ తరగతి విద్యార్థిని చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే శివకాశిలో విద్యార్థిని మరణించిన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు రెండు వారాల్లో రాష్ట్రంలో ముగ్గురు 12 తరగతి విద్యార్థినిలు, తాజాగా 11 తరగతి చదువుతున్న విద్యార్థిని మరణించింది. కడలూర్ విద్యార్థిని తల్లిదండ్రుల ఐఏఎస్ కల నెరవేర్చలేకపోతున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది. రాష్ట్రంలో జరుగుతున్న స్కూల్ విద్యార్థినుల మరణాల పట్ల సీఎం ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఆత్మహత్య ఆలోచనలకు దూరంగా ఉండాలని కోరారు. పరీక్షలను విజయాలుగా మార్చుకోవాలని.. విద్యార్థినులపై లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
Read Also: National Herald Case: సోనియా గాంధీ మూడో రోజు విచారణ.. ఢిల్లీలో భారీ బందోబస్త్
ఈ నెల 13న కల్లకురిచి విద్యార్థిని అనుమానాస్పద మృతితో రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది. ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థిని మరణం తీవ్ర హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. రాష్ట్రంలో పాటు దేశవ్యాప్తంగా ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ప్రిన్సిపాల్ తో సహా ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతరం సోమవారం తిరువళ్లూర్ జిల్లాలోని సేక్రెడ్ హార్ట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని తన హాస్టల్ గధిలో శవమై కనిపించింది. ఆ తరువాత కడలూర్, శివకాశి ఘటనలు జరిగాయి. విద్యాసంస్థల్లో జరుగుతున్న మరణాలపై సీబీ-సీఐడీతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్ట్ ఆదేశించింది.
తాజావార్తలు
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!