Tamil Nadu: మరో స్కూల్ విద్యార్థిని మృతి.. రెండు వారాల్లో నాలుగో సంఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil nadu school girl dead: తమిళనాడు రాష్ట్రంలో వరసగా స్కూల్ విద్యార్థినుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ ఆత్మహత్యలను సీరియస్ గా తీసుకుంది. తాజాగా మరో స్కూల్ విద్యార్థిని ఇంట్లో శవమై కనిపించింది. శివకాశిలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని చనిపోయింది. పోలీసులు దీన్ని ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఈ ఘటన నిన్న(మంగళవారం) చోటు చేసుకుంది. అయితే విచారణ పూర్తయ్యే దాకా ఏం చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. బాలిక తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది. అయితే ఘటనాస్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే తరుచూ కడుపునొప్పితో బాధపడుతోందని అధికారులు చెబుతున్నారు.
కడలూర్ జిల్లాలో 12వ తరగతి విద్యార్థిని చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే శివకాశిలో విద్యార్థిని మరణించిన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు రెండు వారాల్లో రాష్ట్రంలో ముగ్గురు 12 తరగతి విద్యార్థినిలు, తాజాగా 11 తరగతి చదువుతున్న విద్యార్థిని మరణించింది. కడలూర్ విద్యార్థిని తల్లిదండ్రుల ఐఏఎస్ కల నెరవేర్చలేకపోతున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది. రాష్ట్రంలో జరుగుతున్న స్కూల్ విద్యార్థినుల మరణాల పట్ల సీఎం ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఆత్మహత్య ఆలోచనలకు దూరంగా ఉండాలని కోరారు. పరీక్షలను విజయాలుగా మార్చుకోవాలని.. విద్యార్థినులపై లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
Read Also: National Herald Case: సోనియా గాంధీ మూడో రోజు విచారణ.. ఢిల్లీలో భారీ బందోబస్త్
ఈ నెల 13న కల్లకురిచి విద్యార్థిని అనుమానాస్పద మృతితో రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది. ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థిని మరణం తీవ్ర హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. రాష్ట్రంలో పాటు దేశవ్యాప్తంగా ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ప్రిన్సిపాల్ తో సహా ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతరం సోమవారం తిరువళ్లూర్ జిల్లాలోని సేక్రెడ్ హార్ట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని తన హాస్టల్ గధిలో శవమై కనిపించింది. ఆ తరువాత కడలూర్, శివకాశి ఘటనలు జరిగాయి. విద్యాసంస్థల్లో జరుగుతున్న మరణాలపై సీబీ-సీఐడీతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్ట్ ఆదేశించింది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!