Tamil Nadu: మరో స్కూల్ విద్యార్థిని మృతి.. రెండు వారాల్లో నాలుగో సంఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil nadu school girl dead: తమిళనాడు రాష్ట్రంలో వరసగా స్కూల్ విద్యార్థినుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ ఆత్మహత్యలను సీరియస్ గా తీసుకుంది. తాజాగా మరో స్కూల్ విద్యార్థిని ఇంట్లో శవమై కనిపించింది. శివకాశిలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని చనిపోయింది. పోలీసులు దీన్ని ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఈ ఘటన నిన్న(మంగళవారం) చోటు చేసుకుంది. అయితే విచారణ పూర్తయ్యే దాకా ఏం చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. బాలిక తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది. అయితే ఘటనాస్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే తరుచూ కడుపునొప్పితో బాధపడుతోందని అధికారులు చెబుతున్నారు.
కడలూర్ జిల్లాలో 12వ తరగతి విద్యార్థిని చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే శివకాశిలో విద్యార్థిని మరణించిన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు రెండు వారాల్లో రాష్ట్రంలో ముగ్గురు 12 తరగతి విద్యార్థినిలు, తాజాగా 11 తరగతి చదువుతున్న విద్యార్థిని మరణించింది. కడలూర్ విద్యార్థిని తల్లిదండ్రుల ఐఏఎస్ కల నెరవేర్చలేకపోతున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది. రాష్ట్రంలో జరుగుతున్న స్కూల్ విద్యార్థినుల మరణాల పట్ల సీఎం ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఆత్మహత్య ఆలోచనలకు దూరంగా ఉండాలని కోరారు. పరీక్షలను విజయాలుగా మార్చుకోవాలని.. విద్యార్థినులపై లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
Read Also: National Herald Case: సోనియా గాంధీ మూడో రోజు విచారణ.. ఢిల్లీలో భారీ బందోబస్త్
ఈ నెల 13న కల్లకురిచి విద్యార్థిని అనుమానాస్పద మృతితో రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది. ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థిని మరణం తీవ్ర హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. రాష్ట్రంలో పాటు దేశవ్యాప్తంగా ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ప్రిన్సిపాల్ తో సహా ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతరం సోమవారం తిరువళ్లూర్ జిల్లాలోని సేక్రెడ్ హార్ట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని తన హాస్టల్ గధిలో శవమై కనిపించింది. ఆ తరువాత కడలూర్, శివకాశి ఘటనలు జరిగాయి. విద్యాసంస్థల్లో జరుగుతున్న మరణాలపై సీబీ-సీఐడీతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్ట్ ఆదేశించింది.
తాజావార్తలు
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!