Tamil Nadu: కోవిడ్ ఆంక్షలు.. తమిళనాడు కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది.. తాజాగా 3,086 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరోవైపు.. కోవిడ్ ఆంక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది స్టాలిన్ సర్కార్.. ఈ నెల 16 నుంచి మరిన్ని కోవిడ్ ఆంక్షలను ఎత్తివేయన్నారు.. అయితే లాక్డౌన్ నిబంధనలను మాత్రం మార్చి 2వ తేదీ వరకు కొనసాగనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. తమిళనాడు ఇప్పుడు కిండర్ గార్టెన్ మరియు ప్లే స్కూల్లను తిరిగి తెరవడానికి అనుమతించింది. కొత్త నిబంధనలలో భాగంగా ప్రదర్శనలు కూడా నిర్వహించవచ్చు. రోజువారీ ఇన్ఫెక్షన్లు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
Read Also: AP Special Status: ఏపీకి కేంద్రం షాక్.. ప్రత్యేక హోదా తొలగింపు..!
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
ఇవాళ సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.. ఈ తర్వాత ఈ నిర్ణయాలను వెల్లడించారు.. థియేటర్లు, హోటళ్లు, మాల్స్, జిమ్స్, లాడ్జీలు, బట్టల దుకాణం, జ్యువెలరీ దుకాణం, సెలూన్స్, బ్యూటీ పార్లర్లను 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.. గతంలో పేర్కొన్న ఆంక్షలన్నింటినీ ఎత్తేస్తున్నట్లు స్పష్టం చేసింది.. అయితే, రద్దీ ఎక్కువగా ఉండే సామాజిక, రాజకీయ మరియు సాంస్కృతిక సమావేశాలపై నిషేధాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే, వివాహాలు మరియు సంబంధిత కార్యక్రమాలకు గరిష్ట హాజరు 200కి పరిమితం చేయబడింది, అంత్యక్రియలకు పరిమితి 100 మాత్రమే. గతంలో 100 మంది వివాహాలకు మరియు అంత్యక్రియలకు 50 మందిని అనుమతించినప్పటికి ఇప్పుడు పరిమితిని పెంచారు. మిగతా అన్ని ఆంక్షలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది… గత ఉత్తర్వుల ప్రకారం 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలు ఫిబ్రవరి 1న రాష్ట్రంలో పునఃప్రారంభమయ్యాయి. రెస్టారెంట్లు, ఇతర తినుబండారాలు, లాడ్జీలు, వస్త్రాలు మరియు ఆభరణాల దుకాణాలు మరియు థియేటర్లు, సినిమాహాళ్ళు మరియు మల్టీప్లెక్స్లు వంటి ఇతర వాణిజ్య సంస్థలు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. రాష్ట్రం ఇటీవల రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ మరియు ఆదివారాల్లో పూర్తి లాక్డౌన్ను కూడా ఉపసంహరించుకుంది ప్రభుత్వం.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!