Honour killing: ‘‘పరువు హత్య హింస కాదు, అది పిల్లలపై ప్రేమ’’.. తమిళ నటుడు రంజిత్ సంచలన వ్యాఖ్యలు..
- పరువు హత్యలపై తమిళ నటుడు రంజిత్ సంచలన వ్యాఖ్యలు..
- హింస కాదు.. పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ అంటూ కామెంట్స్..
- ఆయన వ్యాఖ్యల్ని తప్పుపడుతున్న నెటిజన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honour killing: తమిళ నటుడు-దర్శకుడు రంజిత్ “పరువు హత్యల”పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం ఆధారంగా జరిగే పరవు హత్యల్ని హింసగా చూడలేమని అన్నారు. రంజిత్ ఇలా సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఆగస్టు 9న తమిళనాడు సేలంలో తాను ఇటీవల దర్శకత్వం వహించిన ‘కవుందంపాళయం’ సినిమా గురించి విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Shravya Varma: బ్యాడ్మింటన్ ప్లేయర్ తో రాంగోపాల్ వర్మ మేనకోడలు ప్రేమాయణం.. త్వరలో పెళ్లి?
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
‘‘కులం ఆధారంగా పరువు హత్య హింస కాదు, అతి వారి పిల్లల పట్ల తల్లిదండ్రులు చూపించే ప్రేమ’’ అని అన్నారు. ‘‘ఒక బైక్ దొంగలించబడితే, ఏం జరుగుతుందో మనం చూస్తు్న్నాం, పిల్లల జీవితం అంటే ఆ తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ చూపిస్తారు, అలాంటి సమయాల్లో కోపం చూపిస్తారు, ఇది హింస కాదు, వారి పిల్లల పట్ల శ్రద్ధ’’ అని చెప్పారు. రంజిత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు. గతంలో ‘‘పొట్టి బట్టలు వేసుకునే స్త్రీలు మరియు అందరి ముందు డ్యాన్స్ చేస్తారు’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన కవుందంపాళయం కూడా కుల ఆధారిత హింస ఆధారంగా ఉంది. పిల్లలపై తల్లిదండ్రుల నియంత్రణ వంటి వివాదాస్పద అంశంతో తెరకెక్కింది. ‘‘ మా భూముల్లో వ్యవసాయం చేయడం ముఖ్యం కాదు, మహిళకు గర్భం చేయడం ముఖ్యం’’ అంటూ ట్రైలర్లో వచ్చే డైలాగ్ ఉంది.
రంజిత్ చేసిన వ్యాఖ్యలపై పలువురు మందిపడుతున్నారు. ‘‘రంజిత్, మీరు ఒక గీతను దాటారు. పరువు హత్య అనేది ప్రేమ కాదు, అనాగరికం. మీ మాటలు అజ్ఞానం మాత్రమే కాదు, ప్రమాదకరమైనవి. ఇది కేవలం ‘తల్లిదండ్రుల మార్గం’ కాదు, ఇది హత్య. మీరు మా సమాజంలో చోటు లేని విషపూరిత మనస్తత్వాన్ని ప్రచారం చేస్తున్నారు.’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
తాజావార్తలు
-
Lionel Messi: మైదానంలోనే బోరున విలపించిన మెస్సీ..!
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్ ఓటమి.. రోహిత్ సెంచరీ వృథా.. వన్డే సిరీస్ కూడా పాయే!
-
JD Vance Fourth Child: నాలుగోసారి తండ్రైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. 150 ఏళ్ల అమెరికా చరిత్రలో అరుదైన ఘట్టం
-
Spain Wins FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనాపై 1-0 తేడాతో చారిత్రాత్మక విజయం
-
Korean Kanakaraju: అనంతపురం నేలపై ‘కొరియన్ కనకరాజు’ సందడి.. చిరంజీవి స్టెప్పులే స్ఫూర్తి అన్న వరుణ్ తేజ్!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!