India-Canada: కెనడాకు భారత్ అల్టిమేటం.. ప్రైవేటుగా చర్చిస్తామంటున్న కెనడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada: భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదం మరింత ముదురుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ని గుర్తు తెలియని వ్యక్తులు జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో కాల్చి చంపారు. అయితే ఇటీవల ఈ హత్యతో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించడంతో వివాదం పెద్దదైంది. దీంతో పాటు కెనడా, భారత సీనియర్ దౌత్యవేత్తను ఆ దేశం నుంచి బహిష్కరించింది. భారత్ ఇందుకు ప్రతిగా కెనడియన్ దౌత్యవేత్తను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో భారత్ మరోసారి కెనడాకు అల్టిమేటం జారీ చేసింది. భారతదేశంలో కెనడా దౌత్యవేత్తలను 41 మంది దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని కోరింది. అక్టోబర్ 10 నాటికి ఈ ప్రక్రియ చేపట్టాలని కెనడాకు సూచించింది. ఒకవేళ గడువు ముగిసిన తర్వాత కెనడా దౌత్యవేత్తలు ఇండియాలో ఉంటే వారికి ఉండే ప్రత్యేక అనుమతులు రద్దు చేయబడతాయని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం 62 మంది ఉన్న కెనడియన్ దౌత్యవేత్తలను 41కి తగ్గించాలని కెనడాను భారత్ కోరినట్లు పేర్కొంది.
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
Read Also: Revanth Reddy: తెలంగాణలో బీజేపీని నడిపిస్తుంది బీఆర్ఎస్సే..
అయితే తాజాగా దీనిపై కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కీలక వ్యాఖ్యలు చేశారు. దౌత్య సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి భారత్ తో కెనడా ప్రైవేట్ చర్చలను కోరుతుందని అన్నారు. ‘‘మేము భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాము. కెనడియన్ దౌత్యవేత్తల భద్రతను మేం సీరియస్ గా తీసుకుంటాము. ప్రైవేటుగా ఉన్నప్పుడు దౌత్య సంభాషణలు ఉత్తమమని భావిస్తున్నాము’’ అని కెనడా మంత్రి చెప్పారు. మంగళవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. తమ దేశం, భారత్ తో ఉద్రిక్తతలను పెంచుకోవానుకోవడం లేదని, న్యూఢిల్లీతో బాధ్యయుత, నిర్మాణాత్మక బంధం కొనసాగుతుందని ఆయన అన్నారు.
కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రాంతంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ని ఇద్దరు ముష్కరులు గురుద్వారా ముందే కాల్చి చంపారు. ఈ పరిణామం రెండు దేశాల మధ్య తీవ్ర విభేదాలు సృష్టించింది. కెనడా చేసిన ఆరోపణల్ని భారత్ అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలు కొట్లి పారేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని భారత విదేశాంగ శాఖ ధ్వజమెత్తింది.
తాజావార్తలు
-
OG 2: ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి?
-
Tom Cruise: గుర్తుపట్టలేనంతగా మారిన టామ్ క్రూజ్.. ‘డిగ్గర్’ ట్రైలర్లో షాకిచ్చిన లుక్!
-
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
-
JR NTR Office : ‘RAW NTR’ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!