Tahawwur Rana: భారత్ చేరిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది..ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారంటే..
- ఇండియా చేరిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది తహవూర్ రాణా..
- విస్తృత భద్రత ఏర్పాట్లు చేసిన అధికారులు..
- బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు, కమాండోలతో పహారా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tahawwur Rana: 26/11 నిందితుడు, ఇండియా మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది తహవూర్ రాణా ఇండియాకు చేరుకున్నాడు. అమెరికా అత్యున్నత న్యాయస్థానాలు ఇండియాకు అప్పగించేందుకు అనుమతించడంతో, ఇతడిని భారత్ తీసుకువచ్చారు. ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యాడు. మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది కావడంతో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. పాలెం ఎయిర్ పోర్టు నుంచి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలో ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారని తెలుస్తోంది.
ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్ల వంటి అధిక ప్రమాదం ఉన్న వ్యక్తుల్ని కోర్టుకు లేదా విచారణ ఏజెన్సీల కార్యాలయాలకు తరలించడానికి భద్రతా సంస్థలు సాధారణంగా ఉపయోగించే బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం, కాన్వాయ్లో సాయుధ వాహనాలను తహవూర్ రాణా తరలింపులో ఉపయోగిస్తున్నారు. విమానాశ్రయంలో SWAT (స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్) కమాండోలను మోహరించారు, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ను హై అలర్ట్లో ఉంచారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Read Also: Yashasvi Jaiswal: పృథ్వీ షా ఏమయ్యాడో గుర్తున్నాడుగా.. యశస్వి జైస్వాల్కు మాజీ క్రికెటర్ హెచ్చరిక!
నవంబర్ 26, 2008న ముంబైలోని 12 ప్రదేశాలలో పది మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడులు చేసిన 166 మందిని హతమార్చారు. దాడిలో అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఇతడిని 2012లో ఉరితీశారు. ఢిల్లీ కోర్టు 26/11 ఉగ్రవాద దాడుల విచారణ రికార్డుల్ని తీసుకుంది. తహవూర్ రాణా భారత్ రాకముందే ముంబై దాడుల రికార్డుల్ని కోర్టు తీసుకుంది. ముంబై నుంచి కేసు రికార్డుల్ని పొందాలని కోరుతూ ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ చర్య తీసుకుంది.
64 ఏళ్ల ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు, నిఘా సంస్థల అధికారులు, ఉగ్రవాది నిరోధక మరియు ఫోరెన్సిక్ సైకాలజిస్టులు కూడిన టీం ప్రశ్నించనుంది. 26/11 దాడుల వెనక ఉన్న సంస్థల ప్రమేయం, పాకిస్తాన్ హస్తం, ఎవరి దగ్గర నుంచి మార్గనిర్దేశాలు అందాయి, ఎవరు మద్దతు ఇచ్చారనే విషయాలపై విచారణ జరగనుంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!