Swati Maliwal: ‘నా పర్సనల్ ఫోటోలు లీక్ చేయాలని వారిపై ఒత్తిడి’’.. స్వాతి మలివాల్ సంచలనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal: స్వాతి మలివాల్ వ్యవహారం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ ఎంపీ, ఆప్ నేత అయిన స్వాతి మలివాల్పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో అతని సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడటం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే నిందితుడు బిభవ్ కుమార్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అరెస్టుకు ముందు బిభవ్ కుమార్ ఫోన్ ఫార్మాట్ చేయడంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ట్యాంపరింగ్ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై సీఎం కేజ్రీవాల్ ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో బీజేపీ ఆప్పై ధ్వజమెత్తుతోంది.
Read Also: Uttar Pradesh: 25 ఏళ్ల యువతి, 16 ఏళ్ల అబ్బాయితో లవ్.. తనతోనే ఉంటా లేకపోతే చస్తా అంటూ బెదిరింపు..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
తాజగా స్వాతి మలివాల్ ఆప్పై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీకి చెందిన సభ్యులకు తనపై చెడుగా చెప్పాలని, వ్యక్తిగత ఫోటోలు లీక్ చేయాలని ఒత్తిడి పెరుగుతున్నట్లు ఆమె ఆరోపించారు. ఆమె ఎక్స్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ నిన్న పార్టీకి చెందిన సీనియర్ నాయకుడి నుంచి నాకు కాల్ వచ్చింది. నాపై దుష్ప్రచారం చేయాలని, నా వ్యక్తిగత ఫోటోలు లీక్ చేయడం ద్వారా నన్ను దెబ్బతీయాలని పార్టీ ఒత్తిడి తీసుకువస్తోంది. నాకు మద్దతు ఇస్తే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తారు. ఎవరికో ప్రెస్ కాన్ఫరెస్స్ డ్యూటీ ఇవ్వబడింది. మరొకరికి ట్వీట్స్ చేసే బాధ్యత ఇచ్చారు’’ అని ఆమె ట్వీట్ చేశారు.
అమెరికాలో కూర్చున్న వాలంటీర్లను పిలిపించి, తనకు వ్యతిరేకంగా మాట్లాడాలని, నిందితుడికి సన్నిహితంగా ఉన్న బీర్ రిపోర్టర్లకు కొన్ని నకిలీ స్టింగ్ ఆపరేషన్లు చేయాలని ఆదేశాలు వచ్చాయని ఆమె ఆరోపించారు. మీరు వేల మంది సైన్యాన్ని పెంచుకున్నప్పటికీ, తన దగ్గర నిజం ఉందని, ఒంటరిగా వారిని ఎదుర్కొంటానంటూ వ్యాఖ్యానించారు. తనకు ఎవరి పైనా కోపం లేదని, నిందితుడు చాలా శక్తివంతమైనవాడు, పెద్ద నాయకులు కూడా అతనికి భయపడుతున్నారని ఆమె అన్నారు. తాను బీజేపీతో టచ్లో ఉన్నానని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత ఆతిషి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఢిల్లీకి చెందిన మహిళా మంత్రి చిరునవ్వుతో నను కించపరచడం తను బాధించిందని స్వాతి మలివాల్ అన్నారు. తాను ఆత్మగౌరవ పోటారాన్ని ప ప్రారంభించానని, నాకు న్యాయం జరిగే వకు పోరాడుతూనే ఉంటానని చెప్పారు.
कल पार्टी के एक बड़े नेता का फोन आया। उसने बताया कैसे सब पर बहुत ज़्यादा दबाव है, स्वाति के ख़िलाफ़ गंदी बातें बोलनी हैं, उसकी पर्सनल फ़ोटोज़ लीक करके उसे तोड़ना है। ये बोला जा रहा है कि जो उसको सपोर्ट करेगा उसको पार्टी से निकाल देंगे। किसी को PC करने की और किसी को ट्वीट्स करने…
— Swati Maliwal (@SwatiJaiHind) May 22, 2024
తాజావార్తలు
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!