Survey on Romance: ‘రొమాన్స్’పై ఇండియాలో తొలిసారిగా సర్వే. అమ్మాయిలు ఇన్నోసెంట్. అబ్బాయిలు రొమాంటిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Survey on Romance: నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్)-5లో తాజాగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. 2019-21 మధ్య కాలంలో నిర్వహించిన ఎన్ఎఫ్హెచ్ఎస్-5లో భాగంగా మన దేశంలో తొలిసారిగా శృంగారంపై సర్వే చేశారు. రొమాన్స్లో కండోమ్ వాడకంపైనా అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ఫలితాల ప్రకారం.. వయసులో ఉన్న ప్రతి వంద మంది మహిళల్లో కేవలం 2 శాతం మందే గతేడాది రొమాన్స్లో పాల్గొన్నారు. అదే.. మగాళ్లయితే 13.4 శాతం మంది శృంగారాన్ని ఎంజాయ్ చేశారు. 23-24 ఏళ్ల వయసు అమ్మాయిల్లో 95.3 శాతం మంది ఇప్పటివరకు ఒక్కసారి కూడా రొమాన్స్ జోలికి పోలేదు. అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఈ పర్సంటేజీ 77 శాతం మాత్రమే కావటం గమనార్హం.
15-24 ఏళ్ల వయసులోని పెళ్లికాని ప్రసాదుల(పురుషుల)తో పోల్చితే పెళ్లికాని ఆడవాళ్లు సేఫ్ రొమాన్స్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. 15-19 ఏళ్ల మధ్య వయసు అమ్మాయిల్లో 1.3 శాతం మందే గత 12 నెలల్లో శృంగారంలో పాల్గొన్నారు. అబ్బాయిలు మాత్రం 4.4 శాతం మంది ఈ అనుభవాన్ని పొందారు. ఈ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 707 జిల్లాల్లోని 6 లక్షలకు పైగా ఇళ్లకు తిరిగి అభిప్రాయాలను సేకరించారు. టీనేజ్ అమ్మాయిల కన్నా టీనేజ్ అబ్బాయిలే రొమాన్స్ విషయంలో బాగా యాక్టివ్గా ఉన్నారు. 0.9 శాతం మంది టీనేజ్ గర్ల్స్ మాత్రమే శృంగారం గురించి ప్రాక్టికల్గా తెలుసుకోగా యుక్త వయసు అబ్బాయిలు మాత్రం 2.9 శాతం మంది రొమాన్స్ పట్ల అమితాసక్తి ప్రదర్శించారు.
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
గత సంవత్సర కాలంగా 18-19 ఏళ్ల వయసు అమ్మాయిల్లో 1.9 శాతం మందికే లైంగిక సంపర్కం జరగగా ఈ శాతం అబ్బాయిల్లో 6.6 శాతానికి పెరిగింది. పెళ్లికానివాళ్లలోని 20-24 ఏజ్ గ్రూప్ అమ్మాయిలైతే 1.9 శాతం మందే శారీరకంగా పురుషులతో కలిశారు. సింగిల్ మెన్ మాత్రం 11.8 శాతం మంది అమ్మాయిలతో పడక సుఖాన్ని సొంతం చేసుకున్నారు. 20-22 ఏజ్ గ్రూప్లో సైతం అమ్మాయిల పర్సంటేజీ ఇదే అత్యల్ప స్థాయిలో ఉంది. అబ్బాయిల శాతం 10.9కి చేరింది. అమ్మాయిలు యుక్త వయసులో ఉన్నా వయోజనులైనా రొమాన్స్లో పాల్గొనేటప్పుడు కండోమ్ వాడకానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 15-19 ఏజ్ గ్రూప్లో 57 శాతం మంది అబ్బాయిలే కండోమ్ వాడుతుండగా అమ్మాయిలు మాత్రం 61.2 శాతం మంది ఈ రక్షా కవచాన్ని ధరిస్తుండటం గమనార్హం.
కండోమ్ విషయంలో 20-24 ఏజ్ గ్రూప్కి వచ్చే సరికి అబ్బాయిలో కాస్త అవగాహన పెరిగినట్లు అర్థమవుతోంది. ఈ వయసువాళ్లు 64 శాతం మంది కండోమ్ యూజ్ చేస్తున్నారు. అమ్మాయిలైతే 65.3 శాతం మంది ఈ విధంగా ముందుజాగ్రత్త పడుతున్నారు. పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే 15-24 ఏజ్ గ్రూప్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే అమాయకులని, వర్జిన్లని తేలింది. 15-19 ఏజ్ గ్రూపుల్లో ఏకంగా 97 శాతానికి పైగా గర్ల్స్ వర్జిన్లు కాగా బాయ్స్ మాత్రం 93.8 శాతం మందే వర్జిన్లు. 15-17 ఏజ్ గ్రూప్లో అబ్బాయిల పర్సంటేజీ 96.1కి పెరిగింది. 20-24 ఏజ్ గ్రూప్కి వచ్చే సరికి వర్జిన్ అమ్మాయిల శాతం 2 శాతం తగ్గింది. అబ్బాయిల్లో వర్జిన్ల పర్సంటేజీ 80కి పడిపోయింది.
తాజావార్తలు
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
-
MS Dhoni Retirement: ఎంఎస్ ధోనీ చివరి మ్యాచ్ ఆడనున్నాడా?.. చెపాక్లో ఎమోషనల్ ఫేర్వెల్?
-
TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..