Maharashtra Politics : రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో మహా రాజకీయం జరుగతోంది. రాజకీయ సంక్షోభంతో మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కింది. అయితే శివసేన రెబల్ ఎమ్మెల్యేతో కొత్ పార్టీని ఏర్పాటు చేస్తామని, మాదే అసలైన శివసేన అంటూ రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే ప్రకటనలు చేశారు. అంతేకాకుండా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ అనర్హత వేటు వేశారు. అయితే ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ ఆ నోటీసులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఏక్నాథ్షిండే సహా 16 రెబల్ ఎమ్మెల్యేలకు ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రెబల్ ఎమ్మెల్యేకు మద్దతుగా ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా బాంబే హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ఏక్నాథ్ షిండే వర్గాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే తమ ప్రాణాలకు ముప్పు ఉందని, ముంబైలో న్యాయపరమైన పరిష్కారాలను కొనసాగించేందుకు వాతావరణం అనుకూలంగా లేదని ఆ వర్గం తెలపడమే కాకుండా.. వారికి నోటీసులు జారీ చేసే అధికారం డిప్యూటీ స్పీకర్కు లేదని షిండే తరపున వాదనలు వినిపిస్తున్న నీరజ్ కిషన్ కౌల్ కోర్టుకు వివరించారు.
రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లు, ఆఫీసులపై దాడులు జరుగుతున్న విషయం గురించి కూడా కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి, డిప్యూటీ స్పీకర్, మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత మూడు రోజుల్లోగా రిజాయిండర్ దాఖలు చేయాలని తెలిపింది సుప్రీంకోర్టు. అంతేకాదు.. జూన్ 27 సాయంత్రం 05.30 లోపు అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన గడువును సుప్రీం కోర్టు జులై 12 వరకూ పొడిగించింది. తదుపరి విచారణ జులై 11కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అంతేకాకుండా రెబల్ ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని, ఎమ్మెల్యేలకు, వారి కుటుంబ సభ్యులకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు.
Also Read
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
తాజావార్తలు
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!