Supreme Court: రాష్ట్రపతి, గవర్నర్ ‘‘బిల్లుల’’ అధికారాలపై నేడు సుప్రీంకోర్టు తీర్పు..
- రాష్ట్రపతి, గవర్నర్ల ‘‘బిల్లుల’’ అధికారాలపై రానున్న స్పష్టత..
- గడువు విధింపుపై తీర్పు చెప్పనున్న సుప్రీంకోర్టు..
- 3 నెలలు నిర్ణయం తీసుకోకుంటే ఆమోదం పొందినట్లే అని గతంలో తీర్పు..
- దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: రాష్ట్ర అసెంబ్లీలు క్లియర్ చేసిన బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి అధికారాల గురించి ఈ రోజు సుప్రీంకోర్టు కీలక అభిప్రాయాన్ని వెల్లడించబోతోంది. బిల్లులను ఆమోదించే విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించే అంశంపై తీర్పు చెప్పనుంది. సెప్టెంబర్ నెలలో ఈ వివాదంపై వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కోసం ఈ తీర్పు వెల్లడించనుంది.
Read Also: kaantha OTT : దుల్కర్–రానా నటించిన ‘కాంత’ ఓటీటీ రిలీజ్పై తాజా అప్డేట్
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
ఈ అంశాన్ని విచారించిన సీజేఐ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం.. రాజ్యాంగబద్ధమైన అధికారం తన విధులను నిర్వర్తించడంలో విఫలమైతే సుప్రీంకోర్టు ‘‘పనిలేకుండా’’, ‘‘శక్తిహీనులై’’ ఉంటుందని కేంద్రం ఆశించకూడదని గవాయ్ సెప్టెంబర్ నెలలో స్పష్టం చేశారు. 2025 ఏప్రిల్ 8న ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గవర్నర్ ఒక బిల్లును అనవసరంగా ఆలస్యం చేయకూడదని, బిల్లుల నిర్ణయం తీసుకోవడానికి 3 నెలల గడువు విధించింది. ఈ తీర్పు తర్వాత, కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతిని సంప్రదించింది. దీంతో ఈ విషయాన్ని మళ్లీ సుప్రీంకోర్టు సలహా కోసం పంపారు.
సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్ని బిల్లులకు ఒకే గడువు పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతీ బిల్లుకు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయని, ఒకే రూల్ పనిచేయదని, కోర్టులు గవర్నర్ పనిని బలవంతంగా నియంత్రించకూడదని చెప్పింది. గవర్నర్లకు బిల్లులపై సంతకం చేయాలా.? వద్దా? అని నిర్ణయించే స్వేచ్ఛ ఉండాలని, ముఖ్యంగా బిల్లుల రాజ్యాంగబద్ధతను పరీక్షించే హక్కు గవర్నర్లకు ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!