Supreme Court: రాష్ట్రపతి, గవర్నర్ ‘‘బిల్లుల’’ అధికారాలపై నేడు సుప్రీంకోర్టు తీర్పు..
- రాష్ట్రపతి, గవర్నర్ల ‘‘బిల్లుల’’ అధికారాలపై రానున్న స్పష్టత..
- గడువు విధింపుపై తీర్పు చెప్పనున్న సుప్రీంకోర్టు..
- 3 నెలలు నిర్ణయం తీసుకోకుంటే ఆమోదం పొందినట్లే అని గతంలో తీర్పు..
- దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: రాష్ట్ర అసెంబ్లీలు క్లియర్ చేసిన బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి అధికారాల గురించి ఈ రోజు సుప్రీంకోర్టు కీలక అభిప్రాయాన్ని వెల్లడించబోతోంది. బిల్లులను ఆమోదించే విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించే అంశంపై తీర్పు చెప్పనుంది. సెప్టెంబర్ నెలలో ఈ వివాదంపై వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కోసం ఈ తీర్పు వెల్లడించనుంది.
Read Also: kaantha OTT : దుల్కర్–రానా నటించిన ‘కాంత’ ఓటీటీ రిలీజ్పై తాజా అప్డేట్
Also Read
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
ఈ అంశాన్ని విచారించిన సీజేఐ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం.. రాజ్యాంగబద్ధమైన అధికారం తన విధులను నిర్వర్తించడంలో విఫలమైతే సుప్రీంకోర్టు ‘‘పనిలేకుండా’’, ‘‘శక్తిహీనులై’’ ఉంటుందని కేంద్రం ఆశించకూడదని గవాయ్ సెప్టెంబర్ నెలలో స్పష్టం చేశారు. 2025 ఏప్రిల్ 8న ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గవర్నర్ ఒక బిల్లును అనవసరంగా ఆలస్యం చేయకూడదని, బిల్లుల నిర్ణయం తీసుకోవడానికి 3 నెలల గడువు విధించింది. ఈ తీర్పు తర్వాత, కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతిని సంప్రదించింది. దీంతో ఈ విషయాన్ని మళ్లీ సుప్రీంకోర్టు సలహా కోసం పంపారు.
సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్ని బిల్లులకు ఒకే గడువు పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతీ బిల్లుకు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయని, ఒకే రూల్ పనిచేయదని, కోర్టులు గవర్నర్ పనిని బలవంతంగా నియంత్రించకూడదని చెప్పింది. గవర్నర్లకు బిల్లులపై సంతకం చేయాలా.? వద్దా? అని నిర్ణయించే స్వేచ్ఛ ఉండాలని, ముఖ్యంగా బిల్లుల రాజ్యాంగబద్ధతను పరీక్షించే హక్కు గవర్నర్లకు ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
తాజావార్తలు
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దొరకని స్థానం.. కారణం ఇదే..
-
Actor Raghu Karumanchi: దీవానా నా రియల్ స్టోరీ
-
Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?