Kumbh stampede: కుంభమేళా తొక్కిసలాటపై పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్ట్..
- కుంభమేళా తొక్కిసలాటపై సుప్రీంకోర్టులో విచారణ..
- ఘటన ‘‘దురదృష్టకరం’’ అంటూనే పిటిషన్ తిరస్కరణ..
- హైకోర్టుని ఆశ్రయించాలని పిటిషనర్కి సూచన..
- ఇప్పటికే ఘటనపై జ్యుడీషియల్ విచారణ ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kumbh stampede: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మంది వరకు భక్తులు మరణించారు. 60 మంది వరకు గాయపడ్డారు. అయితే, ఈ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మెరుగైన నిర్వహణ విధానాలను కోరుతూ పిటిషనర్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ రోజు పిటిషన్పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
‘‘ఇది దురదృష్టకరమైన సంఘటన, ఆందోళన కలిగించే విషయం, కానీ మీరు దీనిపై హైకోర్టుని ఆశ్రయించండి. ఇప్పటికే జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటైంది’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తివారీకి తెలిపారు. అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించాలని పిటిషనర్ న్యాయవాది విశాల్ తివారీకి కోర్టు సూచించింది. యూపీ ప్రభుత్వం తరుపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగి.. ఈ ఘటనపై న్యాయ విచారణ జరుగుతోందని ధర్మాసనానికి తెలిపారు. హైకోర్టులో దాఖలైని ఇలాంటి పిటిషన్ని ఎత్తిచూపారు.
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
Read Also: Maruti e Vitara : మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ షురూ..టోకెన్ అమౌంట్ ఎంత కట్టాలో తెలుసా ?
రిటైర్డ్ జడ్జి హర్ష్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఈ సంఘటనపై న్యాయ విచారణ జరుపుతోంది. మాజీ పోలీస్ చీఫ్ వీకే గుప్తా మరియు రిటైర్డ్ సివిల్ సర్వెంట్ డికె సింగ్ ఈ ప్యానెల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రత్యేక పోలీస్ దర్యాప్తుకు ఆదేశించారు. జనవరి 29న,మౌని అమావాస్య రోజున పుణ్య స్నానాలకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీనిని నివారించడంలో యోగి ప్రభుత్వం విఫలమైందని విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. పరిపాలనలో లోపాలున్నాయని, ప్రత్యేక సహాయక కేంద్రం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
K. Bhagyaraj : ప్రముఖ దర్శకులు, నటుడు కే భాగ్యరాజ్ మృతి..
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!