Kumbh stampede: కుంభమేళా తొక్కిసలాటపై పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్ట్..
- కుంభమేళా తొక్కిసలాటపై సుప్రీంకోర్టులో విచారణ..
- ఘటన ‘‘దురదృష్టకరం’’ అంటూనే పిటిషన్ తిరస్కరణ..
- హైకోర్టుని ఆశ్రయించాలని పిటిషనర్కి సూచన..
- ఇప్పటికే ఘటనపై జ్యుడీషియల్ విచారణ ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kumbh stampede: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మంది వరకు భక్తులు మరణించారు. 60 మంది వరకు గాయపడ్డారు. అయితే, ఈ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మెరుగైన నిర్వహణ విధానాలను కోరుతూ పిటిషనర్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ రోజు పిటిషన్పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
‘‘ఇది దురదృష్టకరమైన సంఘటన, ఆందోళన కలిగించే విషయం, కానీ మీరు దీనిపై హైకోర్టుని ఆశ్రయించండి. ఇప్పటికే జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటైంది’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తివారీకి తెలిపారు. అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించాలని పిటిషనర్ న్యాయవాది విశాల్ తివారీకి కోర్టు సూచించింది. యూపీ ప్రభుత్వం తరుపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగి.. ఈ ఘటనపై న్యాయ విచారణ జరుగుతోందని ధర్మాసనానికి తెలిపారు. హైకోర్టులో దాఖలైని ఇలాంటి పిటిషన్ని ఎత్తిచూపారు.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
Read Also: Maruti e Vitara : మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ షురూ..టోకెన్ అమౌంట్ ఎంత కట్టాలో తెలుసా ?
రిటైర్డ్ జడ్జి హర్ష్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఈ సంఘటనపై న్యాయ విచారణ జరుపుతోంది. మాజీ పోలీస్ చీఫ్ వీకే గుప్తా మరియు రిటైర్డ్ సివిల్ సర్వెంట్ డికె సింగ్ ఈ ప్యానెల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రత్యేక పోలీస్ దర్యాప్తుకు ఆదేశించారు. జనవరి 29న,మౌని అమావాస్య రోజున పుణ్య స్నానాలకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీనిని నివారించడంలో యోగి ప్రభుత్వం విఫలమైందని విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. పరిపాలనలో లోపాలున్నాయని, ప్రత్యేక సహాయక కేంద్రం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!