Supreme Court: ‘‘అందర్ని చంద్రుడిపైకి పంపాలా.?’’ భూకంపాల పిటిషన్పై సుప్రీంకోర్ట్..
- ప్రజల్ని చంద్రుడిపైకి తరలించాలా?
- భూకంపం పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు..
Supreme Court: ‘‘ప్రజల్ని చంద్రుడి పైకి తరలించాలా? మరెక్కడికైనా పంపాలా?’’ అంటూ సుప్రీంకోర్టు శుక్రవారం పిటిషనర్పై ఫైర్ అయింది. భారతదేశ జనాభాలో 75 శాతం మంది భూకంపాల జోన్లోనే ఉన్నారని, భూకంపాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి అధికారులు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కొట్టివేస్తూ అత్యున్నత న్యాయస్థానం, ఈ వ్యాఖ్యలు చేసింది.
Read Also: India-China: చైనా బిజినెస్ వీసాల వేగం పెంచిన భారత్.. కారణాలు ఇవే..
Also Read
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
- Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
ఈ కేసును జస్టిన్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ముందు వినిపించేందుకు పిటిషన్ స్వయంగా హాజరయ్యారు. గతంలో ఢిల్లీ మాత్రమే అధిక భూకంప జోన్ భాగంలో ఉండేదని, కానీ ఇటీవల భారత్ జనాభాలో 75 శాతం మంది ఈ జోన్ లో ఉన్నారని తెలిపారు. దీనికి ప్రతిగా ‘‘అయితే మనం అందర్ని చంద్రుడిపైకి లేదా మరెక్కడికైనా తరలించాలా?’’ అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ఇటీవల జపాన్ లో పెద్ద భూకంపం వచ్చిందని పిటిషనర్ చెప్పారు. ‘‘మనం ముందుగా ఈ దేశంలోకి అగ్నిపర్వతాలు తీసుకురావాలి, అప్పుడు మనం భారత్ను జపాన్తో పోల్చవచ్చు’’ అని ధర్మాసనం పేర్కొంది.
భూకంపం సంభవించినప్పుడు నష్టాన్ని తగ్గించడానికి అధికారులు ఏర్పాట్లు చేయాలని పిటిషనర్ కోరాడు. దీనికి ప్రతిగా అది ప్రభుత్వం చూసుకోవాల్సిన విషయమని, ఈ కోర్టు దీనిని చేయలేదని, పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది.
తాజావార్తలు
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో