Supreme Court: ‘‘కన్స్యూమర్ ఈస్ కింగ్’’.. కస్టమర్లకు హోటళ్ల వివరాలు తెలుసుకునే హక్కు ఉంది..
- వినియోగదారుడే రాజు, హోటళ్ల గురించి తెలుసుకునే హక్కు ఉంది..
- కన్వర్ యాత్రలో హోటల్ వివరాలు ప్రదర్శించాలని యూపీ ఆదేశం..
- ప్రభుత్వ ఆదేశాలను సమర్థించిన సుప్రీంకోర్టు..
Supreme Court: కన్వర్ యాత్రం మార్గంలోని ఉన్న హోటళ్లు , రెస్టారెంట్లలో క్యూఆర్ కోడ్లను ప్రదర్శించాలని ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఆదేశించాయి.అయితే, ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు, రెండు రాష్ట్రాల ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. క్యూఆర్ కోడ్ ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కన్వర్ యాత్ర చివరి రోజు ఇదే అని పేర్కొంది. అయితే, ప్రభుత్వం విక్రేతల పేర్లు, గుర్తింపును వెల్లడించమని బలవంతం చేయగలదా అనే ప్రధాన అంశాన్ని కోర్టు పెండింగ్లో ఉంచింది.
Read Also: Tamil Nadu: అజిత్ కుమార్ కస్టడీ డెత్.. రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశం..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
అధికారులు జారీ చేసిన ఆదేశాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తులను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కె సింగ్లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ‘‘వినియోగదారుడే రాజు’’ అని చెబుతూ, రెస్టారెంట్లలో వడ్డించే ఆహారంలో ఉపయోగించే పదార్థాలు, తయారీ పద్ధతులను గురించి, ఆ స్థలంలో గతంలో మాంసాహార ఆహారాన్ని అందించారా.? లేదా.? అనే దానితో సహా అన్నింటిని వినియోగదారుడు తెలుసుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు సమర్థించింది. యాత్ర ప్రయోజనం కోసం మాత్రమే, ఎవరైనా మాంసాహారం నుంచి శాఖాహరంగా మారితే, వినియోగదారుడు తెలుసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
చట్టం ప్రకారం విక్రేతలు తమ లైసెన్స్లు మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను ప్రదర్శించాలని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యావేత్త అపూర్వానంద్ ఝాతో సహా వివిధ పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, హుజెఫా అహ్మది వాదనలు వినిపించారు. యూపీ ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరుపున సింఘ్వీ వాదిస్తూ.. మైనారిటీ రెస్టారెంట్లను బహిష్కరించే కుట్ర ఉందని వాదించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు, “వినియోగదారుడే రాజు” అని ఆయన వ్యాఖ్యానించారు, ఒక హోటల్ శ్రావణ మాసంలో మాత్రమే శాఖాహార ఆహారాన్ని అందిస్తుందా లేదా సంవత్సరం పొడవునా వర్తిస్తుందా అని తెలుసుకునే హక్కు వారికి ఉందని చెప్పింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!