Supreme Court: ‘‘కన్స్యూమర్ ఈస్ కింగ్’’.. కస్టమర్లకు హోటళ్ల వివరాలు తెలుసుకునే హక్కు ఉంది..
- వినియోగదారుడే రాజు, హోటళ్ల గురించి తెలుసుకునే హక్కు ఉంది..
- కన్వర్ యాత్రలో హోటల్ వివరాలు ప్రదర్శించాలని యూపీ ఆదేశం..
- ప్రభుత్వ ఆదేశాలను సమర్థించిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: కన్వర్ యాత్రం మార్గంలోని ఉన్న హోటళ్లు , రెస్టారెంట్లలో క్యూఆర్ కోడ్లను ప్రదర్శించాలని ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఆదేశించాయి.అయితే, ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు, రెండు రాష్ట్రాల ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. క్యూఆర్ కోడ్ ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కన్వర్ యాత్ర చివరి రోజు ఇదే అని పేర్కొంది. అయితే, ప్రభుత్వం విక్రేతల పేర్లు, గుర్తింపును వెల్లడించమని బలవంతం చేయగలదా అనే ప్రధాన అంశాన్ని కోర్టు పెండింగ్లో ఉంచింది.
Read Also: Tamil Nadu: అజిత్ కుమార్ కస్టడీ డెత్.. రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశం..
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
అధికారులు జారీ చేసిన ఆదేశాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తులను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కె సింగ్లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ‘‘వినియోగదారుడే రాజు’’ అని చెబుతూ, రెస్టారెంట్లలో వడ్డించే ఆహారంలో ఉపయోగించే పదార్థాలు, తయారీ పద్ధతులను గురించి, ఆ స్థలంలో గతంలో మాంసాహార ఆహారాన్ని అందించారా.? లేదా.? అనే దానితో సహా అన్నింటిని వినియోగదారుడు తెలుసుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు సమర్థించింది. యాత్ర ప్రయోజనం కోసం మాత్రమే, ఎవరైనా మాంసాహారం నుంచి శాఖాహరంగా మారితే, వినియోగదారుడు తెలుసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
చట్టం ప్రకారం విక్రేతలు తమ లైసెన్స్లు మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను ప్రదర్శించాలని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యావేత్త అపూర్వానంద్ ఝాతో సహా వివిధ పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, హుజెఫా అహ్మది వాదనలు వినిపించారు. యూపీ ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరుపున సింఘ్వీ వాదిస్తూ.. మైనారిటీ రెస్టారెంట్లను బహిష్కరించే కుట్ర ఉందని వాదించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు, “వినియోగదారుడే రాజు” అని ఆయన వ్యాఖ్యానించారు, ఒక హోటల్ శ్రావణ మాసంలో మాత్రమే శాఖాహార ఆహారాన్ని అందిస్తుందా లేదా సంవత్సరం పొడవునా వర్తిస్తుందా అని తెలుసుకునే హక్కు వారికి ఉందని చెప్పింది.
తాజావార్తలు
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..