Tamil Nadu: అజిత్ కుమార్ కస్టడీ డెత్.. రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశం..
- అజిత్ కుమార్ కస్టడీ డెత్పై స్టాలిన్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు..
- బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల మధ్యంతర పరిహారం..
- గత నెలలో దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు..
- కొన్ని రోజుల తర్వాత తీవ్రగాయాలతో మరణించిన అజిత్ కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: గత నెలలో కస్టడీలో అజిత్ కుమార్ అనే 27 ఏళ్ల వ్యక్తి కస్టడీలోనే మరణించడం సంచలనంగా మారింది. తమిళనాడులో జరిగిన ఈ సంఘటనపై అక్కడి డీఎంకే ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహానికి కారణమైంది. దొంగతనం కేసులో ఆలయ సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ని కస్టడీలో పోలీసులు దారుణంగా కొట్టడం, చిత్రహింసలు పెట్టడంతో మరణించారు. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు ప్రభుత్వం, పోలీసులు తీరును తీవ్రంగా విమర్శించింది. ఇదిలా ఉంటే, కస్టడీలో మరణించిన అజిత్ కుమార్ కుటుంబానికి రూ. 25 లక్షల మధ్యంతర పరిహారం చెల్లించాలని మద్రాస్ హైకోర్టు మంగళవారం తమిళనాడు ప్రభుత్వాన్ని చెల్లించింది.
శివగంగ జిల్లాలోని మాదపురం ఆలయంలో అజిత్ కుమార్ సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. గత నెలలో, దొంగతనం కేసుకు సంబంధించి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఒక భక్తురాలు అజిత్ను తన కారు పార్క్ చేయమని కోరిందని, కానీ అతడికి ఎలా డ్రైవ్ చేయాలో తెలియకపోవడంతో, దానిని పార్క్ చేయాలని మరొక వ్యక్తిని కోరాడు. దీని తర్వాత, భక్తురాలు తన కారు నుంచి డబ్బు, నగలు పోయినట్లు ఆరోపించింది. పోలీసులు అజిత్ని ప్రశ్నించేందుకు తీసుకెళ్లారు.
Also Read
Read Also: Boeing Jets: ‘‘ఇంధన నియంత్రన స్విచ్లో లోపాలు లేవు’’.. ఎయిర్ ఇండియా ప్రకటన..
రోజుల తర్వాత, అనుమానాస్పద స్థితిలో పోలీస్ కస్టడీలో మరణించాడు. పోస్టుమార్టం నివేదికలో అతడి శరీరంపై 40కి పైగా గాయాలు బయటపడ్డాయి. కస్టడీలో చిత్రహింసలకు గురైనట్లు ఆధారాలు లభించాయి. నాగరిక సమాజంలో ఇటువంటి చర్యలను సహించలేమని, కఠినంగా వ్యవహరించాలని కోర్టు పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వం గతంలో అజిత్ సోదరుడికి రూ.7.5 లక్షలు పరిహారం, ఇంటి స్థలం మరియు ప్రభుత్వ ఉద్యోగం అందించాలని ప్రతిపాదించింది.
ఈ కేసును తమిళనాడు ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. సీఎం స్టాలిన్ అజిత్ కుమార్ కుటుంబానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. శివగంగై పోలీసు సిబ్బందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేుసింది. కోర్టు ఆదేశాల మేరకు నికిథా అనే మహిళ దాఖలు చేసిన అసలు దొంగతనం ఫిర్యాదును కూడా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటి వరకు, ఈ కేసులో ఒక డీఎస్పీని సస్పెండ్ చేశారు. ఎస్పీని వెయింటింగ్లో ఉంచారు. ఆగస్టు 20 నాటికి తుది నివేదిక సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!