Supreme Court: ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అగౌరవపరిచేలా మాట్లాడటం తప్పే..
- అన్నాడీఎంకే నేత, మాజీమంత్రి సీవీ షణ్ముగంకు సుప్రీంకోర్టు షాక్..
- ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడటం తప్పే..
- ఈ కేసు విచారణను సీవీ షణ్ముగం ఎదుర్కోవాల్సిందే: సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కించపరిచేలా మాట్లాడటం తప్పే.. అందువల్ల ఈ కేసు విచారణ ఎదుర్కోవాల్సిందేనని అన్నాడీఎంకే సీనియర్ నేత సీవీ షణ్ముగంకు సుప్రీంకోర్టు తెలిపింది. కొత్త కార్మిక చట్టం ప్రకారం 12 గంటల పని, వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు పంపించడం, గంజాయి రవాణా, మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే పార్టీ ఆధ్వర్యంలో గతంలో జరిగిన ఆందోళనలో.. సీవీ షణ్ముగం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు గుప్పించారు.
Read Also: Adani Group: అమెరికాలో కేసులపై అదానీ గ్రూప్ క్లారిటీ..
Also Read
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- Mamata Banerjee: "ఇక మేమేంటో చూపిస్తాం".. అల్లుడు అభిషేక్పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
- LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
ఇక, దీనిపై డీఎంకే నేతలు పరువు నష్టం కేసు దాఖలు చేశారు. జిల్లా న్యాయస్థానంలో విచారణ జరగాల్సి ఉండగా, సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది. అదే సమయంలో కేసు రద్దు చేయాలని కోరుతూ సీవీ షణ్ముగం సుప్రీంకోర్టులో మరో పిల్ దాఖలు చేయగా.. దీనిపై అపెక్స్ కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతూ.. తన ప్రమాణ పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని సెప్టెంబరు నెల 23న అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును మంగళవారం జస్టిస్ సుదన్షు తులియా, జస్టిస్ అజానుద్దీన్ అమనుల్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
Read Also: Hemant Soren: ప్రధాని మోడీతో హేమంత్ సోరెన్ దంపతుల భేటీ.. సీఎం ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానం..
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించింది. ఈ కేసు అంశంలో జిల్లా కోర్టు విచారణపై విధించిన స్టే ఎందుకు తొలగించ కూడదు? అని అగిడింది. అలాగే, అసత్య ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయడం సహజమే కదా?.. అందువల్ల ఈ కేసు విచారణను సీవీ షణ్ముగం ఎదుర్కోవాల్సిందేనంటూ సుప్రీం ధర్మాసనం పేర్కొనింది. ఇక, తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..