Supreme Court: ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అగౌరవపరిచేలా మాట్లాడటం తప్పే..
- అన్నాడీఎంకే నేత, మాజీమంత్రి సీవీ షణ్ముగంకు సుప్రీంకోర్టు షాక్..
- ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడటం తప్పే..
- ఈ కేసు విచారణను సీవీ షణ్ముగం ఎదుర్కోవాల్సిందే: సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కించపరిచేలా మాట్లాడటం తప్పే.. అందువల్ల ఈ కేసు విచారణ ఎదుర్కోవాల్సిందేనని అన్నాడీఎంకే సీనియర్ నేత సీవీ షణ్ముగంకు సుప్రీంకోర్టు తెలిపింది. కొత్త కార్మిక చట్టం ప్రకారం 12 గంటల పని, వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు పంపించడం, గంజాయి రవాణా, మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే పార్టీ ఆధ్వర్యంలో గతంలో జరిగిన ఆందోళనలో.. సీవీ షణ్ముగం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు గుప్పించారు.
Read Also: Adani Group: అమెరికాలో కేసులపై అదానీ గ్రూప్ క్లారిటీ..
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
ఇక, దీనిపై డీఎంకే నేతలు పరువు నష్టం కేసు దాఖలు చేశారు. జిల్లా న్యాయస్థానంలో విచారణ జరగాల్సి ఉండగా, సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది. అదే సమయంలో కేసు రద్దు చేయాలని కోరుతూ సీవీ షణ్ముగం సుప్రీంకోర్టులో మరో పిల్ దాఖలు చేయగా.. దీనిపై అపెక్స్ కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతూ.. తన ప్రమాణ పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని సెప్టెంబరు నెల 23న అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును మంగళవారం జస్టిస్ సుదన్షు తులియా, జస్టిస్ అజానుద్దీన్ అమనుల్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
Read Also: Hemant Soren: ప్రధాని మోడీతో హేమంత్ సోరెన్ దంపతుల భేటీ.. సీఎం ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానం..
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించింది. ఈ కేసు అంశంలో జిల్లా కోర్టు విచారణపై విధించిన స్టే ఎందుకు తొలగించ కూడదు? అని అగిడింది. అలాగే, అసత్య ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయడం సహజమే కదా?.. అందువల్ల ఈ కేసు విచారణను సీవీ షణ్ముగం ఎదుర్కోవాల్సిందేనంటూ సుప్రీం ధర్మాసనం పేర్కొనింది. ఇక, తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!