Supreme Court: అంధులు కూడా న్యాయమూర్తులు కావచ్చు.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
- అంధులు కూడా న్యాయమూర్తులు కావచ్చు
- సుప్రీం కోర్టు సోమవారం అంధుల కోసం చారిత్రాత్మక తీర్పు
- సుప్రీంకోర్టు తన నిర్ణయంలో మధ్యప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ నిబంధనలను రద్దు చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దృష్టిలోపం ఉండి న్యాయ సేవలోకి రావాలనుకునే వారికి బిగ్ రిలీఫ్. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం అంధుల కోసం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అంధులు కూడా న్యాయ సేవలలో నియమించబడే హక్కు కలిగి ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది. అంధులు కూడా న్యాయమూర్తులు కావచ్చని కోర్టు పేర్కొంది. దృష్టి లోపం ఉన్న వ్యక్తులను న్యాయ సేవ నుంచి మినహాయించకూడదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సోమవారం కొట్టివేసింది.
Also Read:Botsa Satyanarayana: రాజధాని అంశంపై బొత్స సంచలన వ్యాఖ్యలు..
Also Read
వైకల్యం ఆధారంగా ఎవరినీ న్యాయ సేవల నుంచి మినహాయించలేమని సుప్రీంకోర్టు తన నిర్ణయంలో పేర్కొంది. న్యాయ సేవా అవకాశాలను పొందడంలో వికలాంగులు ఎటువంటి వివక్షను ఎదుర్కోకూడదని హక్కు ఆధారిత విధానం అవసరం అని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు తన నిర్ణయంలో మధ్యప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ నిబంధనలను కూడా రద్దు చేసింది. జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అంధులు న్యాయ సేవల నియామక ఎంపిక ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించే మధ్యప్రదేశ్ న్యాయ సేవల నిబంధనలను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Also Read:Revolt RV BlazeX: సరసమైన ధరలో కిల్లింగ్ లుక్స్, అదిరిపోయే ఫీచర్స్తో వచ్చేసిన కొత్త ఎలక్ట్రిక్ బైక్
మధ్యప్రదేశ్ న్యాయ సేవల నియమాల రూల్ 6A దృష్టి లోపం ఉన్న అభ్యర్థులు, తక్కువ దృశ్యమానత ఉన్నవారు న్యాయవ్యవస్థలో చేరడానికి అనుమతి నిరాకరిస్తుంది. మధ్యప్రదేశ్ న్యాయ సేవలు(నియామక, సేవా నిబంధనలు) 1994 లో అమలు చేయబడ్డాయి. తాజాగా సుప్రీం కోర్టు ఈ నిబంధనలను కొట్టివేసింది. కాగా మధ్యప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ నిబంధనలను ఓ మహిళ 2024లో కోర్టులో సవాలు చేసింది.
Also Read:Mahesh Kumar Goud: కేంద్రం సహకరిస్తే తెలంగాణ నెంబర్ వన్ అవుతుంది..
దృష్టి లోపం ఉన్న తన కొడుకు న్యాయవ్యవస్థలోకి రావాలనుకోవడంతో మధ్యప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ నిబంధనలపై 2024 మార్చిలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ కు లేఖ రాసింది. ఆయన ఆ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మార్చారు. మార్చి 2024లో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మార్చి, దృష్టి లోపం ఉన్న అభ్యర్థులను రాష్ట్రంలో న్యాయ అధికారులుగా నియమించకుండా నిరోధించే మధ్యప్రదేశ్ న్యాయ సేవల నిబంధనల చెల్లుబాటును పరిశీలించాలని నిర్ణయించింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
తాజావార్తలు
-
Babar Azam: పాక్ క్రికెట్లో కొత్త శకం.. బాబర్ అజామ్ ఔట్..
-
TVK Vijay: మ్యాజిక్ ఫిగరైతే చేరింది.. షరతులు చూస్తే మాత్రం వామ్మో అనాల్సిందే!
-
Amit Shah: గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు బీజేపీ..
-
Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
-
Arshdeep Singh: అర్ష్దీప్ సింగ్కు షాకిచ్చిన బీసీసీఐ..! ఇక, కుదరదు..