Supreme Court: అంధులు కూడా న్యాయమూర్తులు కావచ్చు.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
- అంధులు కూడా న్యాయమూర్తులు కావచ్చు
- సుప్రీం కోర్టు సోమవారం అంధుల కోసం చారిత్రాత్మక తీర్పు
- సుప్రీంకోర్టు తన నిర్ణయంలో మధ్యప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ నిబంధనలను రద్దు చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దృష్టిలోపం ఉండి న్యాయ సేవలోకి రావాలనుకునే వారికి బిగ్ రిలీఫ్. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం అంధుల కోసం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అంధులు కూడా న్యాయ సేవలలో నియమించబడే హక్కు కలిగి ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది. అంధులు కూడా న్యాయమూర్తులు కావచ్చని కోర్టు పేర్కొంది. దృష్టి లోపం ఉన్న వ్యక్తులను న్యాయ సేవ నుంచి మినహాయించకూడదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సోమవారం కొట్టివేసింది.
Also Read:Botsa Satyanarayana: రాజధాని అంశంపై బొత్స సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
వైకల్యం ఆధారంగా ఎవరినీ న్యాయ సేవల నుంచి మినహాయించలేమని సుప్రీంకోర్టు తన నిర్ణయంలో పేర్కొంది. న్యాయ సేవా అవకాశాలను పొందడంలో వికలాంగులు ఎటువంటి వివక్షను ఎదుర్కోకూడదని హక్కు ఆధారిత విధానం అవసరం అని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు తన నిర్ణయంలో మధ్యప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ నిబంధనలను కూడా రద్దు చేసింది. జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అంధులు న్యాయ సేవల నియామక ఎంపిక ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించే మధ్యప్రదేశ్ న్యాయ సేవల నిబంధనలను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Also Read:Revolt RV BlazeX: సరసమైన ధరలో కిల్లింగ్ లుక్స్, అదిరిపోయే ఫీచర్స్తో వచ్చేసిన కొత్త ఎలక్ట్రిక్ బైక్
మధ్యప్రదేశ్ న్యాయ సేవల నియమాల రూల్ 6A దృష్టి లోపం ఉన్న అభ్యర్థులు, తక్కువ దృశ్యమానత ఉన్నవారు న్యాయవ్యవస్థలో చేరడానికి అనుమతి నిరాకరిస్తుంది. మధ్యప్రదేశ్ న్యాయ సేవలు(నియామక, సేవా నిబంధనలు) 1994 లో అమలు చేయబడ్డాయి. తాజాగా సుప్రీం కోర్టు ఈ నిబంధనలను కొట్టివేసింది. కాగా మధ్యప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ నిబంధనలను ఓ మహిళ 2024లో కోర్టులో సవాలు చేసింది.
Also Read:Mahesh Kumar Goud: కేంద్రం సహకరిస్తే తెలంగాణ నెంబర్ వన్ అవుతుంది..
దృష్టి లోపం ఉన్న తన కొడుకు న్యాయవ్యవస్థలోకి రావాలనుకోవడంతో మధ్యప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ నిబంధనలపై 2024 మార్చిలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ కు లేఖ రాసింది. ఆయన ఆ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మార్చారు. మార్చి 2024లో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మార్చి, దృష్టి లోపం ఉన్న అభ్యర్థులను రాష్ట్రంలో న్యాయ అధికారులుగా నియమించకుండా నిరోధించే మధ్యప్రదేశ్ న్యాయ సేవల నిబంధనల చెల్లుబాటును పరిశీలించాలని నిర్ణయించింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?